*భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు అంబేద్కర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్* కోరుట్ల డిసెంబర్ 07 ప్రజా ముద్ర న్యూస్ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలలోని వారి విగ్రహాలకు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు. అణగారిన వర్గాలకు, పేదలకు, బలహీన వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు రావాలంటే సమాజం ఎలా ముందుకు సాగాలన్న దానిపై అద్భుత దారిని చూపిన దార్శనికుడని. తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో అంబేద్కర్ ఆలోచనలు, ఆయన చూపిన మార్గం యువతలో స్పూర్తిని నింపడం మనందరి బాధ్యత అని న్యాయం – సమానత్వం – స్వేచ్ఛ – సోదరభావం ఆయన ప్రమాణించిన ఈ విలువలు నేటికీ మార్గదర్శమని. అలాగే అంబేద్కర్ సిద్ధాంతాలే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి అని, పేదల కోసం—పల్లె ప్రజల కోసం విద్యావంతమైన సమాజం కోసం ప్రతి రోజు కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొని అంబేద్కర్ తత్వాన్ని స్మరించుకున్నారు. అనంతరం కల్లూరు రోడ్డులో గల ఎమ్మెల్యే భవనం సమీపంలో స్థానికులతో కలిసి టిఫిన్ చేసి పలువురుని ఆప్యాయతతో పలకరించి సమస్యలు తెలుసుకున్నారు.
*భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు అంబేద్కర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్* కోరుట్ల డిసెంబర్ 07 ప్రజా ముద్ర న్యూస్ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలలోని వారి విగ్రహాలకు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు
భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు. అణగారిన వర్గాలకు, పేదలకు, బలహీన వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు రావాలంటే సమాజం ఎలా ముందుకు సాగాలన్న దానిపై అద్భుత దారిని చూపిన దార్శనికుడని. తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో అంబేద్కర్ ఆలోచనలు, ఆయన చూపిన మార్గం యువతలో స్పూర్తిని నింపడం మనందరి బాధ్యత అని న్యాయం – సమానత్వం – స్వేచ్ఛ – సోదరభావం ఆయన ప్రమాణించిన ఈ విలువలు నేటికీ
మార్గదర్శమని. అలాగే అంబేద్కర్ సిద్ధాంతాలే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి అని, పేదల కోసం—పల్లె ప్రజల కోసం విద్యావంతమైన సమాజం కోసం ప్రతి రోజు కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొని అంబేద్కర్ తత్వాన్ని స్మరించుకున్నారు. అనంతరం కల్లూరు రోడ్డులో గల ఎమ్మెల్యే భవనం సమీపంలో స్థానికులతో కలిసి టిఫిన్ చేసి పలువురుని ఆప్యాయతతో పలకరించి సమస్యలు తెలుసుకున్నారు.
- గ్రామాభివృద్ధికి నిధులు దండేపల్లి మండలం లోని నంబాల గ్రామ అభివృద్ధికి రూ 10 లక్షల సహాయం అందిస్తానని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంగా ఆదివారం నంబాల గ్రామంలో బిజెపి నాయకులు తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బిజెపి మద్దతుదారుడు రాయమల్లును గెలిపిస్తే రూ. 10 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని తెలిపారు. ఆ నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2
- నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.1
- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- Post by KLakshmi Devi2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- అభివృద్ధికి అందరూ సహకరించాలి జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గ్రామంలోని పలు కాలనీలలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తమను ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.1