Shuru
Apke Nagar Ki App…
చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.
P.G.Murthy
చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.
More news from Mancherial and nearby areas
- పార్టీ నాయకులను కాపాడుకుంటా బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటానని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజ జనార్ధన్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అన్నీ తెలుసునని, పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ బిఆర్ఎస్ ను పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2
- Post by KLakshmi Devi2
- Post by Omnamashivaya S1
- బీసీ సంక్షేమానికి భాగస్వామ్యమే కీలకం ప్రిన్సిపల్ సెక్రెటరీ సత్యనారాయణ శ్రీకాకుళంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో సమీక్ష శ్రీకాకుళం, డిసెంబర్ 07: వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాల పూర్తి విజయానికి వారి భాగస్వామ్యమే అత్యంత కీలకమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో విజయవంతమైన 'ఆదరణ 1, 2' కార్యక్రమాలకు కొనసాగింపుగా 'ఆదరణ 3' కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, ఇందులో భాగంగా కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని గతంలో కంటే మెరుగైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారని తెలిపారు. దానికి అనుగుణంగానే జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తున్నామని సత్యనారాయణ వివరించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 550 వృత్తిపరమైన పరికరాలను గుర్తించడం జరిగిందని, వృత్తిపరంగా ఆధునిక పరికరాలను, నైపుణ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీసీల జనాభాను అనుసరించి పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా తయారీ వెనుకబడిన తరగతుల రక్షణ కోసం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా తయారవుతోందని సత్యనారాయణ వెల్లడించారు. బీసీలకు విద్యా, సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పలు కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు ఆధునిక ధోభీ ఘాట్ల నిర్మాణాన్ని కోరగా, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పిలి జగదీశ్వర్ రావు యాదవులకు బంజరు భూములు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కమ్మరి, కలుస్తులకు టార్పాలిన్లు సరఫరా చేయాలని, విశ్వబ్రాహ్మణులకు ఇంటి దగ్గర కలపకు కొంతవరకు అనుమతిస్తే అధికారుల వేధింపులు తగ్గుతాయని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. పలు కుల సంఘాల ప్రతినిధులు బీసీలకు పింఛన్ వయస్సును 50 సంవత్సరాలకు తగ్గించాలని అభ్యర్థించారు. నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆసుపత్రులు, దేవాలయాల్లో ప్రత్యేక పోస్ట్లు, బ్యూటీ పార్లర్, స్పా ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని కోరగా, పొందర కూరాకుల కులాల వారు మోపెడ్స్, బోర్ వెల్స్, రైతు బజార్లలో షాపులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అవసరాలకు తగిన పరికరాలు అందజేయాలని కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణం నాయుడు మాట్లాడుతూ అన్నారు. స్థానిక అవసరాలకు పనికొచ్చే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను బీసీలకు అందజేయాలని కోరారు. కుల వృత్తుల యూనిట్లకు విద్యుత్ రాయితీ కల్పించాలి అని కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎస్.వి. లక్ష్మణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి అనురాధ, బీసీ కార్పొరేషన్ ఈడీ gaddemma, జిల్లా ప్రత్యేకాధికారి మారెళ్ళ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.1
- Post by User85021
- క్షతగాత్రున్ని ఆసుపత్రికి పంపిన బిజెపి నాయకులు దండేపల్లి మండలంలోని నేల్కి వెంకటాపూర్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని బిజెపి నాయకులు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఆ స్టేజి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి గాయపడ్డారు. ప్రచారం ముగించుకుని వెళ్తున్న బిజెపి నాయకులు హరిగోపాలరావు, సామ వెంకటరమణ దాన్ని గమనించి 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించి బాధిత కుటుంబ సభ్యులకు వివరాలు అందజేశారు.1
- చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య రూపంలో చక్కటి సందేశాన్ని అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతపై చిన్నారులు చక్కటి పాటపై నృత్యాన్ని ప్రదర్శించారు.1