logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా సాయుధ బలగాలు సీపీకి గౌరవ వందనం సమర్పించగా, ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం సీపీ కార్యాలయాన్ని, పెండింగ్ కేసులను, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం పలు కీలక ఆదేశాలు, వివరాలను వెల్లడించారు. గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసింగ్‌లో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రివెంటివ్ పోలీసింగ్, సీసీటీఎన్ఎస్ 2.0, ‘ఈ-సాక్ష్య’ యాప్‌లలో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15 లోగా తప్పనిసరిగా పొందుపరచాలని ఆదేశించారు. పాత పెండింగ్ కేసుల వివరాలతో పాటు, కొత్తగా నమోదయ్యే కేసుల డేటాను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని, కేసుల ఆధారాల సేకరణలో ‘ఈ-సాక్ష్య’ను సమర్థవంతంగా వినియోగించాలని ఆయన సూచించారు. గత నెలలో కరీంనగర్ పీఎంజే నగల షోరూంలో జరిగిన దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని, జిల్లా, మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేసినట్లు తెలిపారు. భద్రతా లోపాలు ఉన్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారించినట్లు సీపీ పేర్కొన్నారు. వలస కార్మికుల డేటాలో భాగంగా నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మైంటైన్ చేస్తున్నట్లు తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్‌లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలు, వాహన తనిఖీలను ముమ్మరం చేశామని, పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచినట్లు చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకై నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం 'షీ లీడ్స్', 'స్నేహిత' కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు, అలాగే నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల సీపీ గౌష్ ఆలం సంతోషం వ్యక్తం చేస్తూ “భేష్” అని అభినందించారు. ఈ సమీక్షలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, ఎస్సైలు స్వాతి, ఆవుల తిరుపతి మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

8 hrs ago
user_శాతవాహన కరీంనగర్
శాతవాహన కరీంనగర్
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
8 hrs ago

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా సాయుధ బలగాలు సీపీకి గౌరవ వందనం సమర్పించగా, ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం సీపీ కార్యాలయాన్ని, పెండింగ్ కేసులను, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం పలు కీలక ఆదేశాలు, వివరాలను వెల్లడించారు. గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసింగ్‌లో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రివెంటివ్ పోలీసింగ్, సీసీటీఎన్ఎస్ 2.0, ‘ఈ-సాక్ష్య’ యాప్‌లలో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15 లోగా తప్పనిసరిగా పొందుపరచాలని ఆదేశించారు. పాత పెండింగ్ కేసుల వివరాలతో పాటు, కొత్తగా నమోదయ్యే కేసుల డేటాను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని, కేసుల ఆధారాల సేకరణలో ‘ఈ-సాక్ష్య’ను సమర్థవంతంగా వినియోగించాలని ఆయన సూచించారు. గత నెలలో కరీంనగర్ పీఎంజే నగల షోరూంలో జరిగిన దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని, జిల్లా, మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేసినట్లు తెలిపారు. భద్రతా లోపాలు ఉన్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారించినట్లు సీపీ పేర్కొన్నారు. వలస కార్మికుల డేటాలో భాగంగా నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మైంటైన్ చేస్తున్నట్లు తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్‌లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలు, వాహన తనిఖీలను ముమ్మరం చేశామని, పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచినట్లు చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకై నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం 'షీ లీడ్స్', 'స్నేహిత' కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు, అలాగే నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల సీపీ గౌష్ ఆలం సంతోషం వ్యక్తం చేస్తూ “భేష్” అని అభినందించారు. ఈ సమీక్షలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, ఎస్సైలు స్వాతి, ఆవుల తిరుపతి మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక కుటుంబం మందు డబ్బాతో హల్ చల్ చేసి పోలీస్ కేసులో చిక్కుకుంది. అక్రమ ఇసుక తవ్వకాల కేసు విచారణలో భాగంగా, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఆత్మహత్యాయత్నం చేస్తానని పోలీసులను బెదిరించినందుకు మానకొండూరు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెల్ది గ్రామంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన పోలీసు విచారణ నేపథ్యంలో చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణలో భాగంగా, పోలీసులు వెల్ది గ్రామానికి చెందిన తాళ్లపల్లి అనిల్‌ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని కోరారు. అయితే, అనిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించారని, వారిని దూషించి విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసి తహసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. పోలీసులను బెదిరించడం, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక కుటుంబం మందు డబ్బాతో హల్ చల్ చేసి పోలీస్ కేసులో చిక్కుకుంది. అక్రమ ఇసుక తవ్వకాల కేసు విచారణలో భాగంగా, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఆత్మహత్యాయత్నం చేస్తానని పోలీసులను బెదిరించినందుకు మానకొండూరు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటన వెల్ది గ్రామంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన పోలీసు విచారణ నేపథ్యంలో చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణలో భాగంగా, పోలీసులు వెల్ది గ్రామానికి చెందిన తాళ్లపల్లి అనిల్‌ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని కోరారు. అయితే, అనిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించారని, వారిని దూషించి విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసి తహసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. పోలీసులను బెదిరించడం, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, చైర్‌పర్సన్ దండి లక్ష్మి నేతృత్వంలో ఎలక్ట్రీషియన్ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఈ కిట్లను అందజేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా, విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రీషియన్ సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు.
    1
    హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా, చైర్‌పర్సన్ దండి లక్ష్మి నేతృత్వంలో ఎలక్ట్రీషియన్ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఈ కిట్లను అందజేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా, విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రీషియన్ సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • కందుల సంధ్యారాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీమ్ KSR సభ్యులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా రోగులకు అండగా నిలవడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల పద్మ ప్రవీణ్, సరిత రాజయ్య, జక్కన బాలు, సిలారపు కళ్యాణ్ యాదవ్ సహా పలువురు పాల్గొన్నారు. రోగులు టీమ్ KSR సభ్యుల సేవాభావాన్ని ఎంతగానో అభినందించారు.
    2
    కందుల సంధ్యారాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీమ్ KSR సభ్యులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా రోగులకు అండగా నిలవడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల పద్మ ప్రవీణ్, సరిత రాజయ్య, జక్కన బాలు, సిలారపు కళ్యాణ్ యాదవ్ సహా పలువురు పాల్గొన్నారు. రోగులు టీమ్ KSR సభ్యుల సేవాభావాన్ని ఎంతగానో అభినందించారు.
    user_BANDARI VAMSHI KRISHNA
    BANDARI VAMSHI KRISHNA
    Local News Reporter ధర్మారం, పెద్దపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డు సంజీవయ్య నగర్‌లో నిన్న అర్ధరాత్రి కొంతమంది యువకులు మద్యం సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే పోలీస్ ఉన్నతాధికారులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    1
    సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డు సంజీవయ్య నగర్‌లో నిన్న అర్ధరాత్రి కొంతమంది యువకులు మద్యం సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే పోలీస్ ఉన్నతాధికారులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    user_VIJAY KUMAR KOMPELLY
    VIJAY KUMAR KOMPELLY
    వడ్డేపల్లె, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
  • మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని కామ్రేడ్ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన పత్రికా సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా దేశ ప్రయోజనాలను, కార్మిక ప్రయోజనాలను దెబ్బతీస్తూ, బహుళజాతి కంపెనీలకు, కార్పొరేషన్లకు దేశాన్ని తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ, సంఘటిత, అసంఘటిత కార్మికుల ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ, విదేశీ కంపెనీలపై ఆధారపడి దేశ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేసే కుతంత్రాలు పన్నుతోందని విమర్శించారు. వ్యాపారీకరణ పేరుతో ఆదానీలకు, అంబానీలకు దేశ ఖనిజ సంపదను దారదత్తం చేస్తూ, కార్పొరేట్ బందిపోట్లకు మోడీ కొమ్ముకాస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో, దేశంలో నిత్యావసర ధరలు పెరగడానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతోందని కేంద్ర ప్రభుత్వ చర్యలను సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని పత్రికా ప్రకటనలు చేస్తూనే, మరోవైపు వాటి ధరలను పెంచుతూనే ఉన్నారని ఆయన అన్నారు. ఈ ధరల పెరుగుదల కారణంగా చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను మూసివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోందని సీపీఐ విమర్శించింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల తరఫున ఆలోచన చేసి ధరలు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఈ ధరల పెరుగుదలను ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా, రేపు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది.
    1
    మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని కామ్రేడ్ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన పత్రికా సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా దేశ ప్రయోజనాలను, కార్మిక ప్రయోజనాలను దెబ్బతీస్తూ, బహుళజాతి కంపెనీలకు, కార్పొరేషన్లకు దేశాన్ని తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ, సంఘటిత, అసంఘటిత కార్మికుల ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ, విదేశీ కంపెనీలపై ఆధారపడి దేశ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేసే కుతంత్రాలు పన్నుతోందని విమర్శించారు. వ్యాపారీకరణ పేరుతో ఆదానీలకు, అంబానీలకు దేశ ఖనిజ సంపదను దారదత్తం చేస్తూ, కార్పొరేట్ బందిపోట్లకు మోడీ కొమ్ముకాస్తున్నారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో, దేశంలో నిత్యావసర ధరలు పెరగడానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతోందని కేంద్ర ప్రభుత్వ చర్యలను సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని పత్రికా ప్రకటనలు చేస్తూనే, మరోవైపు వాటి ధరలను పెంచుతూనే ఉన్నారని ఆయన అన్నారు. ఈ ధరల పెరుగుదల కారణంగా చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను మూసివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాకముందు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోందని సీపీఐ విమర్శించింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల తరఫున ఆలోచన చేసి ధరలు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఈ ధరల పెరుగుదలను ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా, రేపు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలంలో, ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు రిపోర్టర్ కొరివి నర్సింలు తెలిపారు. ఈ తనిఖీలో ఆయన ప్రతి ఒక్కరినీ పరిశీలించి, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే పనులు చేస్తూ ఉంటే, వారి కృషికి గుర్తింపు లభిస్తుందని ఎంపీడీవో చంద్రకుమార్ అన్నారు. ఉపాధి హామీ పనులు ప్రతి ఒక్కరికీ కొంత ఆసరా కల్పిస్తాయని, కొందరు వీటి ద్వారా వచ్చే డబ్బులను తమ చదువులకు ఉపయోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ పనిని ఎవరూ చిన్నతనంగా చూడవద్దని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పదో తరగతి చదువుకున్న వారికి కూడా ఉపాధి హామీలో పనులు చేస్తే, గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత శిక్షణ కూడా ఇస్తామని ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ తెలిపారు. బీబీపేట గ్రామ పంచాయతీ ఈవో రమేష్ మాట్లాడుతూ, గ్రామంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్ మాట్లాడుతూ, సైట్‌పై ఎలాంటి ఇబ్బందులు కలిగించబోనని పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ కూడా ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్‌కు అందరికీ పని కల్పించాలని, సమావేశాలకు అవగాహన కలిగించాలని కోరారు. ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ మాట్లాడుతూ, 9 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతుండగా, బీబీపేటలో 500కు పైగా పనులు చేయడం ఎంతో గౌరవంగా ఉందని ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్‌కు తెలియజేశారు. ఇలాంటి మంచి పనులు ప్రభుత్వం, ప్రజలు ఇద్దరికీ మేలు చేస్తాయని ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలంలో, ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు రిపోర్టర్ కొరివి నర్సింలు తెలిపారు. ఈ తనిఖీలో ఆయన ప్రతి ఒక్కరినీ పరిశీలించి, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే పనులు చేస్తూ ఉంటే, వారి కృషికి గుర్తింపు లభిస్తుందని ఎంపీడీవో చంద్రకుమార్ అన్నారు. ఉపాధి హామీ పనులు ప్రతి ఒక్కరికీ కొంత ఆసరా కల్పిస్తాయని, కొందరు వీటి ద్వారా వచ్చే డబ్బులను తమ చదువులకు ఉపయోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ పనిని ఎవరూ చిన్నతనంగా చూడవద్దని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

పదో తరగతి చదువుకున్న వారికి కూడా ఉపాధి హామీలో పనులు చేస్తే, గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత శిక్షణ కూడా ఇస్తామని ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ తెలిపారు. బీబీపేట గ్రామ పంచాయతీ ఈవో రమేష్ మాట్లాడుతూ, గ్రామంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్ మాట్లాడుతూ, సైట్‌పై ఎలాంటి ఇబ్బందులు కలిగించబోనని పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ కూడా ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్‌కు అందరికీ పని కల్పించాలని, సమావేశాలకు అవగాహన కలిగించాలని కోరారు.

ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ మాట్లాడుతూ, 9 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతుండగా, బీబీపేటలో 500కు పైగా పనులు చేయడం ఎంతో గౌరవంగా ఉందని ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్‌కు తెలియజేశారు. ఇలాంటి మంచి పనులు ప్రభుత్వం, ప్రజలు ఇద్దరికీ మేలు చేస్తాయని ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడారు.
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ రిపేరు పనులు జరుగుతుండగా ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. ట్రాక్ మరమ్మత్తులు చేస్తుండగా ట్రాకింగ్ మిషన్ పట్టాలు తప్పి, రైల్వే పట్టాలపై పనిచేస్తున్న కూలీలపైకి దూసుకొచ్చింది. అయితే, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో కూలీలు సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానప్పటికీ, రైలు పట్టాలు మాత్రం ధ్వంసమయ్యాయి. రైల్వే సిబ్బందికి ఈ పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, రైల్వే అధికారులు ధ్వంసమైన ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకున్నారు.
    4
    పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ రిపేరు పనులు జరుగుతుండగా ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. ట్రాక్ మరమ్మత్తులు చేస్తుండగా ట్రాకింగ్ మిషన్ పట్టాలు తప్పి, రైల్వే పట్టాలపై పనిచేస్తున్న కూలీలపైకి దూసుకొచ్చింది. అయితే, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో కూలీలు సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానప్పటికీ, రైలు పట్టాలు మాత్రం ధ్వంసమయ్యాయి. రైల్వే సిబ్బందికి ఈ పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, రైల్వే అధికారులు ధ్వంసమైన ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • మంగళవారం జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో, ఎఫ్.ఆర్.ఓ. లక్ష్మీనారాయణ ఆదివాసి, గిరిజన మహిళలు ఆర్థిక మరియు నైపుణ్యాభివృద్ధి వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇందన్‌పల్లిలోని CFC సెంటర్‌లో చేతితో తయారు చేసిన ఆభరణాలు, వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించారు. ఎఫ్.ఆర్.ఓ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆదివాసి మహిళలు రూపొందించే ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో HYTICOS జిల్లా కోఆర్డినేటర్ వెంకట్, దేవేందర్ కూడా పాల్గొన్నారు.
    1
    మంగళవారం జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో, ఎఫ్.ఆర్.ఓ. లక్ష్మీనారాయణ ఆదివాసి, గిరిజన మహిళలు ఆర్థిక మరియు నైపుణ్యాభివృద్ధి వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇందన్‌పల్లిలోని CFC సెంటర్‌లో చేతితో తయారు చేసిన ఆభరణాలు, వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించారు.

ఎఫ్.ఆర్.ఓ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆదివాసి మహిళలు రూపొందించే ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో HYTICOS జిల్లా కోఆర్డినేటర్ వెంకట్, దేవేందర్ కూడా పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను చదును చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి రావడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ క్రమంలో, 'మీ కాళ్లు మొక్కుతాం.. మా భూములను లాక్కోవద్దు, పంటలను నాశనం చేయొద్దు' అంటూ రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో అటవీ సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, స్థానిక అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. తమకు జీవనాధారమైన భూములను కాపాడుకోవడానికి రైతులు చేసిన ఈ పోరాటం స్థానికంగా కలకలం రేపింది.
    1
    కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను చదును చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి రావడంతో ఈ వివాదం రాజుకుంది.

ఈ క్రమంలో, 'మీ కాళ్లు మొక్కుతాం.. మా భూములను లాక్కోవద్దు, పంటలను నాశనం చేయొద్దు' అంటూ రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో అటవీ సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, స్థానిక అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. తమకు జీవనాధారమైన భూములను కాపాడుకోవడానికి రైతులు చేసిన ఈ పోరాటం స్థానికంగా కలకలం రేపింది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.