logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు. -వందరోజుల విద్యా ప్రణాళిక. సారవకోట, డిసెంబర్ 07: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఉన్నత పాఠశాలలో ఆదివారం కూడా పదో తరగతి విద్యార్థులకు ,ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వంద రోజులు విద్యా ప్రణాళికలో భాగంగా ఆదివారం (7) తేదీన పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుందని ప్రభుత్వం ఆదేశించింది. సారవకోట మండలంలో ఆదివారం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మండల విద్యాశాఖ అధికారి మడ్డు వెంకటరమణ పరిశీలించి విద్యార్థులు, అడిగిన ప లు ప్రశ్నలకు ఆయన జవాబులు వెల్లడించారు. సక్రమంగా చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కోరారు.

8 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
Journalist Srikakulam, Andhra Pradesh•
8 hrs ago
77f71940-dd7d-4a68-b8df-9fcc764ff7d3

ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు. -వందరోజుల విద్యా ప్రణాళిక. సారవకోట, డిసెంబర్ 07: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఉన్నత పాఠశాలలో ఆదివారం కూడా పదో తరగతి విద్యార్థులకు ,ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వంద రోజులు విద్యా ప్రణాళికలో భాగంగా ఆదివారం (7) తేదీన పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుందని ప్రభుత్వం ఆదేశించింది. సారవకోట మండలంలో ఆదివారం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మండల విద్యాశాఖ అధికారి మడ్డు వెంకటరమణ పరిశీలించి విద్యార్థులు, అడిగిన ప లు ప్రశ్నలకు ఆయన జవాబులు వెల్లడించారు. సక్రమంగా చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కోరారు.

More news from Andhra Pradesh and nearby areas
  • బీసీ సంక్షేమానికి భాగస్వామ్యమే కీలకం ప్రిన్సిపల్ సెక్రెటరీ సత్యనారాయణ శ్రీకాకుళంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో సమీక్ష శ్రీకాకుళం, డిసెంబర్ 07: వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాల పూర్తి విజయానికి వారి భాగస్వామ్యమే అత్యంత కీలకమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో విజయవంతమైన 'ఆదరణ 1, 2' కార్యక్రమాలకు కొనసాగింపుగా 'ఆదరణ 3' కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, ఇందులో భాగంగా కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని గతంలో కంటే మెరుగైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారని తెలిపారు. దానికి అనుగుణంగానే జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తున్నామని సత్యనారాయణ వివరించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 550 వృత్తిపరమైన పరికరాలను గుర్తించడం జరిగిందని, వృత్తిపరంగా ఆధునిక పరికరాలను, నైపుణ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీసీల జనాభాను అనుసరించి పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా తయారీ వెనుకబడిన తరగతుల రక్షణ కోసం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా తయారవుతోందని సత్యనారాయణ వెల్లడించారు. బీసీలకు విద్యా, సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పలు కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు ఆధునిక ధోభీ ఘాట్‌ల నిర్మాణాన్ని కోరగా, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పిలి జగదీశ్వర్ రావు యాదవులకు బంజరు భూములు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కమ్మరి, కలుస్తులకు టార్పాలిన్లు సరఫరా చేయాలని, విశ్వబ్రాహ్మణులకు ఇంటి దగ్గర కలపకు కొంతవరకు అనుమతిస్తే అధికారుల వేధింపులు తగ్గుతాయని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. పలు కుల సంఘాల ప్రతినిధులు బీసీలకు పింఛన్ వయస్సును 50 సంవత్సరాలకు తగ్గించాలని అభ్యర్థించారు. నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆసుపత్రులు, దేవాలయాల్లో ప్రత్యేక పోస్ట్‌లు, బ్యూటీ పార్లర్, స్పా ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని కోరగా, పొందర కూరాకుల కులాల వారు మోపెడ్స్, బోర్ వెల్స్, రైతు బజార్లలో షాపులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అవసరాలకు తగిన పరికరాలు అందజేయాలని కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణం నాయుడు మాట్లాడుతూ అన్నారు. స్థానిక అవసరాలకు పనికొచ్చే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను బీసీలకు అందజేయాలని కోరారు. కుల వృత్తుల యూనిట్లకు విద్యుత్ రాయితీ కల్పించాలి అని కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎస్.వి. లక్ష్మణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి అనురాధ, బీసీ కార్పొరేషన్ ఈడీ gaddemma, జిల్లా ప్రత్యేకాధికారి మారెళ్ళ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
    1
    బీసీ సంక్షేమానికి భాగస్వామ్యమే కీలకం
ప్రిన్సిపల్ సెక్రెటరీ సత్యనారాయణ
శ్రీకాకుళంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో సమీక్ష
శ్రీకాకుళం, డిసెంబర్ 07: వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాల పూర్తి విజయానికి వారి భాగస్వామ్యమే అత్యంత కీలకమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో విజయవంతమైన 'ఆదరణ 1, 2' కార్యక్రమాలకు కొనసాగింపుగా 'ఆదరణ 3' కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, ఇందులో భాగంగా కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని గతంలో కంటే మెరుగైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారని తెలిపారు. దానికి అనుగుణంగానే జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తున్నామని సత్యనారాయణ వివరించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 550 వృత్తిపరమైన పరికరాలను గుర్తించడం జరిగిందని, వృత్తిపరంగా ఆధునిక పరికరాలను, నైపుణ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీసీల జనాభాను అనుసరించి పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా తయారీ వెనుకబడిన తరగతుల రక్షణ కోసం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా తయారవుతోందని సత్యనారాయణ వెల్లడించారు.
బీసీలకు విద్యా, సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పలు కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు ఆధునిక ధోభీ ఘాట్‌ల నిర్మాణాన్ని కోరగా, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పిలి జగదీశ్వర్ రావు యాదవులకు బంజరు భూములు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కమ్మరి, కలుస్తులకు టార్పాలిన్లు సరఫరా చేయాలని, విశ్వబ్రాహ్మణులకు ఇంటి దగ్గర కలపకు కొంతవరకు అనుమతిస్తే అధికారుల వేధింపులు తగ్గుతాయని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. పలు కుల సంఘాల ప్రతినిధులు బీసీలకు పింఛన్ వయస్సును 50 సంవత్సరాలకు తగ్గించాలని అభ్యర్థించారు. నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆసుపత్రులు, దేవాలయాల్లో ప్రత్యేక పోస్ట్‌లు, బ్యూటీ పార్లర్, స్పా ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని కోరగా, పొందర కూరాకుల కులాల వారు మోపెడ్స్, బోర్ వెల్స్, రైతు బజార్లలో షాపులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అవసరాలకు తగిన పరికరాలు అందజేయాలని కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణం నాయుడు మాట్లాడుతూ అన్నారు. స్థానిక అవసరాలకు పనికొచ్చే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను బీసీలకు అందజేయాలని కోరారు. కుల వృత్తుల యూనిట్లకు విద్యుత్ రాయితీ కల్పించాలి అని కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎస్.వి. లక్ష్మణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి అనురాధ, బీసీ కార్పొరేషన్ ఈడీ gaddemma, జిల్లా ప్రత్యేకాధికారి మారెళ్ళ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    3 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    23 hrs ago
  • Post by KLakshmi Devi
    2
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Guntur East, Andhra Pradesh•
    13 hrs ago
  • నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.
    1
    నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు....  నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    22 hrs ago
  • పార్టీ నాయకులను కాపాడుకుంటా బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటానని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజ జనార్ధన్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అన్నీ తెలుసునని, పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ బిఆర్ఎస్ ను పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    పార్టీ నాయకులను కాపాడుకుంటా 
బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటానని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజ జనార్ధన్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అన్నీ తెలుసునని, పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ బిఆర్ఎస్ ను పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    2 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kavali, Spsr Nellore•
    41 min ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    2
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    11 hrs ago
  • SKLM: డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపండి ..! శ్రీకాకుళం నగరం బలగ సమీపంలో ప్రధాన రహదారి పక్కన కాలువలో మురుగునీరు నిలిచిపోయింది. కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకు సాగేందుకు వీలులేక ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన వస్తుందని, అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్య కు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
    1
    SKLM: డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపండి ..!
శ్రీకాకుళం నగరం బలగ సమీపంలో ప్రధాన రహదారి పక్కన కాలువలో మురుగునీరు నిలిచిపోయింది.
కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకు సాగేందుకు వీలులేక ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన వస్తుందని, అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్య కు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.