Shuru
Apke Nagar Ki App…
తొలకరి పలకరింపుతో పుడమి పులకించిందని, మృగశిర కార్తె ఆరంభంతో రైతన్న ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. ఈ రుతుపవనాలు అన్నదాతకు అండగా నిలిచి, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి రైతు కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతు రాజులందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేశారు.
KHADEER REPORTER
తొలకరి పలకరింపుతో పుడమి పులకించిందని, మృగశిర కార్తె ఆరంభంతో రైతన్న ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. ఈ రుతుపవనాలు అన్నదాతకు అండగా నిలిచి, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి రైతు కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతు రాజులందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- తొలకరి పలకరింపుతో పుడమి పులకించిందని, మృగశిర కార్తె ఆరంభంతో రైతన్న ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. ఈ రుతుపవనాలు అన్నదాతకు అండగా నిలిచి, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి రైతు కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతు రాజులందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేశారు.1
- సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పరిధిలో గల అంగడిపేట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం ఘనంగా అన్నదాన (పులిహోర) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వాణి మెడికల్స్ అధినేత రుక్మయ్య - సంతోషి దంపతులు తమ కుమార్తె యశశ్రీ మరియు కుమారుడు అభినవ్ ల పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపిన అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థాన డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అందరిపై నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి భక్తిశ్రద్ధలతో కూడిన సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తిని, సేవాగుణాన్ని అలవర్చుకోవాలని నొక్కి చెప్పారు. ఈ రకమైన మంచి కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ భక్తిరస కార్యక్రమం మరియు పులిహోర పంపిణీలో లయన్ దొంతుల సత్యనారాయణ, కాశీనాథ్ దూబకుంట లక్ష్మణ్, కైలాస ప్రశాంత్, ఉమేష్, సాంబయ్య, కాసం లక్ష్మయ్య, గందె సంతోష్ తో సహా పలువురు స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో కుండపోత వాన పడటంతో, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే క్రమంలో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్లో కూడా భారీ వర్షం నమోదైంది.1
- ఈరోజు ఘట్కేసర్లో ఆకస్మిక వర్షం కురిసింది. ఈ అనూహ్య వర్షం కారణంగా రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.4
- సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డు సంజీవయ్య నగర్లో నిన్న అర్ధరాత్రి కొంతమంది యువకులు మద్యం సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే పోలీస్ ఉన్నతాధికారులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.1
- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ కార్యక్రమం ఈ రాత్రి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే వేలాది మంది ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నారు.1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించనున్న కీలకమైన జిల్లా ప్రశిక్షణ కార్యశాల లొ పాల్గొనేందుకు ఆహ్వానం పలకబడింది. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026లో భాగంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ పాల్గొననున్నారు.1
- కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను చదును చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి రావడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ క్రమంలో, 'మీ కాళ్లు మొక్కుతాం.. మా భూములను లాక్కోవద్దు, పంటలను నాశనం చేయొద్దు' అంటూ రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో అటవీ సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, స్థానిక అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. తమకు జీవనాధారమైన భూములను కాపాడుకోవడానికి రైతులు చేసిన ఈ పోరాటం స్థానికంగా కలకలం రేపింది.1