logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జులై 8న ఉదయం 10:30 గంటల సమయంలో, ఉప్పల్ నుండి ఘట్‌కేసర్‌లోని ఆసుపత్రికి వెళ్లేందుకు ఒక మహిళ ఆటో ఎక్కింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ భరత్‌నగర్‌లోని తాటికల్లు డిపో వద్ద ఆగి కల్లు పార్శిల్ తీసుకున్నాడు. అనంతరం ఆటోను ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, స్ప్రైట్ బాటిల్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. దీనివల్ల స్పృహ కోల్పోయిన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అఘాయిత్యం జరిగిన అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్ మరియు నగదును దోచుకుని నిందితుడు పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు ఆంగోతు జేత్యను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు.

1 day ago
user_Telangana news
Telangana news
మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
1 day ago
a1ca02a8-1067-4655-9262-ea212df943ab

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జులై 8న ఉదయం 10:30 గంటల సమయంలో, ఉప్పల్ నుండి ఘట్‌కేసర్‌లోని ఆసుపత్రికి వెళ్లేందుకు ఒక మహిళ ఆటో ఎక్కింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ భరత్‌నగర్‌లోని తాటికల్లు డిపో వద్ద ఆగి కల్లు పార్శిల్ తీసుకున్నాడు. అనంతరం ఆటోను ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, స్ప్రైట్ బాటిల్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. దీనివల్ల స్పృహ కోల్పోయిన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అఘాయిత్యం జరిగిన అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్ మరియు నగదును దోచుకుని నిందితుడు పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు ఆంగోతు జేత్యను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
    user_Hanumadri Srinivas Goud
    Hanumadri Srinivas Goud
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.
    1
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో బయోటెక్ పరిశ్రమ కోసం టాప్సే (Topse) సంస్థ తన అధునాతన టర్న్‌కీ ప్రాసెస్ సొల్యూషన్స్‌ను ప్రదర్శించింది.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ప్రయాణికుల సహనం పరీక్షకు గురైంది. సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆగ్రహించిన ప్రయాణికులు మొదట బస్టాండ్ ప్రాంగణంలోనే ధర్నాకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచూ బస్సులు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బస్సులను సమయపాలనతో నడిపించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.
    1
    మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ప్రయాణికుల సహనం పరీక్షకు గురైంది. సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిబ్బంది నిర్లక్ష్యంతో ఆగ్రహించిన ప్రయాణికులు మొదట బస్టాండ్ ప్రాంగణంలోనే ధర్నాకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచూ బస్సులు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బస్సులను సమయపాలనతో నడిపించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    24 min ago
  • Post by Assalamualikumjj
    3
    Post by Assalamualikumjj
    user_Assalamualikumjj
    Assalamualikumjj
    ఆసిఫ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్‌ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.
    1
    సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని బొల్లారం ప్రాంతంలో ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక పరిశీలన (SIR – Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఈ ఫారం ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ ఫారాలను అందుకున్న ఓటర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. బీఎల్‌ఓల నుంచి ఫారం అందుకున్న రెండు రోజుల్లోపు దానిని పూర్తిగా పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే సహాయం అందుబాటులో ఉంది. దీని కోసం బొల్లారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లేదా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాలను సంప్రదించి సహాయం పొందవచ్చు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    4 hrs ago
  • బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
    1
    బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.

ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    3 hrs ago
  • గోదావరిలో కళ్ల ముందే లక్ష క్యూసెక్కుల నీరు వరదలా కిందకు పోతుంటే, అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవని చెప్పడం బుర్రతక్కువతనం అని కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం ఈ పని చేయమన్నవాళ్లు తెలివిలేనివాళ్లా అని ఆయన ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుంచే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంటే, కళ్లుండి కూడా చూడలేని రేవంత్ రెడ్డి తెలివిలేనివాడా, లేక వాస్తవాలు చూపిస్తున్న తాము తెలివిలేనివాళ్లమా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే భద్రాచలాన్ని పట్టుకొని, మేడిగడ్డ వల్లే మునిగిపోతోందని అంటున్న రేవంత్ రెడ్డికి అస్సలు బుర్రలేదని కేటీఆర్ మండిపడ్డారు. రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్లివ్వాలని అడుగుతుంటే పట్టించుకోని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లేక లుచ్చా అనాలా అని ప్రశ్నించారు. తన గురువు కోసం నీళ్లను కిందకు వదులుతున్నావా అని రైతులు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ అనాలా లేక దరిద్రుడు అనాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
    1
    గోదావరిలో కళ్ల ముందే లక్ష క్యూసెక్కుల నీరు వరదలా కిందకు పోతుంటే, అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవని చెప్పడం బుర్రతక్కువతనం అని కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం ఈ పని చేయమన్నవాళ్లు తెలివిలేనివాళ్లా అని ఆయన ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల నుంచే నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకున్న రేవంత్ రెడ్డి బుర్రతక్కువ వాడో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 97 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంటే, కళ్లుండి కూడా చూడలేని రేవంత్ రెడ్డి తెలివిలేనివాడా, లేక వాస్తవాలు చూపిస్తున్న తాము తెలివిలేనివాళ్లమా అని నిలదీశారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే భద్రాచలాన్ని పట్టుకొని, మేడిగడ్డ వల్లే మునిగిపోతోందని అంటున్న రేవంత్ రెడ్డికి అస్సలు బుర్రలేదని కేటీఆర్ మండిపడ్డారు. రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్లివ్వాలని అడుగుతుంటే పట్టించుకోని వాడిని బుర్రతక్కువ వాడు అనాలా లేక లుచ్చా అనాలా అని ప్రశ్నించారు. తన గురువు కోసం నీళ్లను కిందకు వదులుతున్నావా అని రైతులు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ అనాలా లేక దరిద్రుడు అనాలా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
    user_Hanumadri Srinivas Goud
    Hanumadri Srinivas Goud
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • మెదక్ జిల్లా చేగుంటలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఒక తల్లి కన్నుమూయగా, ఆ విషయం తెలియని ఆమె ఇద్దరు చిన్న పిల్లలు (ఒక బాబు, ఒక పాప) రోజంతా ఆమె మృతదేహం పక్కనే కూర్చుండిపోయారు. ఎవరైనా వచ్చి తమకు సహాయం చేస్తారేమోనని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూశారు. ఈ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వీరి తండ్రి ఇదివరకే మరణించడంతో, ఇప్పుడు తల్లి కూడా దూరమై ఆ చిన్నారులు పూర్తిగా అనాథలయ్యారు. ఆసుపత్రిలో తక్షణమే ఆదుకునేందుకు బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చిన్నారులు మృతదేహం వద్దే దిక్కుతోచని స్థితిలో నిరీక్షించాల్సి వచ్చింది.
    1
    మెదక్ జిల్లా చేగుంటలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఒక తల్లి కన్నుమూయగా, ఆ విషయం తెలియని ఆమె ఇద్దరు చిన్న పిల్లలు (ఒక బాబు, ఒక పాప) రోజంతా ఆమె మృతదేహం పక్కనే కూర్చుండిపోయారు. ఎవరైనా వచ్చి తమకు సహాయం చేస్తారేమోనని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూశారు.

ఈ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వీరి తండ్రి ఇదివరకే మరణించడంతో, ఇప్పుడు తల్లి కూడా దూరమై ఆ చిన్నారులు పూర్తిగా అనాథలయ్యారు. ఆసుపత్రిలో తక్షణమే ఆదుకునేందుకు బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ చిన్నారులు మృతదేహం వద్దే దిక్కుతోచని స్థితిలో నిరీక్షించాల్సి వచ్చింది.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer Chegunta, Medak•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.