దీపావళి నాటికి వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ * 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు... వరంగల్ : వరంగల్ నగరంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్నెస్ సెంటర్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. దీపావళి నాటికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ అదేశాలతో అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య చొరవతో ఈ వెల్నెస్ సెంటర్ పనులు వేగం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా CGHS, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ పర్వీన్ బాలా, CGHS వైద్య బృందంతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేయూ క్రాస్ సమీపంలోని ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రాంగణంలోని ప్రతిపాదిత భవనాలను పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు అనువైన వసతులు, భవన పరిస్థితి, అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ప్రతిపాదన ఆర్థిక అనుమతి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ వద్ద పెండింగ్లో ఉండటాన్ని గుర్తించిన ఎంపీ, ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని కలిసి ఆర్థిక అనుమతిని త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర బృందం వరంగల్కు వచ్చి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, దీపావళి నాటికి CGHS వెల్నెస్ సెంటర్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు తన ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వరంగల్లో ఏర్పాటు కానున్న ఈ వెల్నెస్ సెంటర్ను కేవలం ప్రాథమిక వైద్య సేవలకే పరిమితం చేయకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు. ఇక్కడ ఓపీ సేవలతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు, వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలకు సంబంధించి రిఫరల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే మెడికవర్, లెనోవా ఆసుపత్రులతో ఎంప్యానల్మెంట్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఈ వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి వస్తే వరంగల్, హనుమకొండతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి ఆధారిత కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఎంపీ స్పష్టం చేశారు.
దీపావళి నాటికి వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ * 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు... వరంగల్ : వరంగల్ నగరంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) వెల్నెస్ సెంటర్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. దీపావళి నాటికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ అదేశాలతో అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య చొరవతో ఈ వెల్నెస్ సెంటర్ పనులు వేగం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపీ
నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా CGHS, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ పర్వీన్ బాలా, CGHS వైద్య బృందంతో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేయూ క్రాస్ సమీపంలోని ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రాంగణంలోని ప్రతిపాదిత భవనాలను పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు అనువైన వసతులు, భవన పరిస్థితి, అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ప్రతిపాదన ఆర్థిక అనుమతి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ వద్ద పెండింగ్లో ఉండటాన్ని గుర్తించిన ఎంపీ, ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని కలిసి ఆర్థిక అనుమతిని
త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర బృందం వరంగల్కు వచ్చి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, దీపావళి నాటికి CGHS వెల్నెస్ సెంటర్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు తన ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వరంగల్లో ఏర్పాటు కానున్న ఈ వెల్నెస్ సెంటర్ను కేవలం ప్రాథమిక వైద్య సేవలకే పరిమితం చేయకుండా కార్పొరేట్ స్థాయి
వైద్య సేవలు అందించేలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు. ఇక్కడ ఓపీ సేవలతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు, వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలకు సంబంధించి రిఫరల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే మెడికవర్, లెనోవా ఆసుపత్రులతో ఎంప్యానల్మెంట్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఈ వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి వస్తే వరంగల్, హనుమకొండతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి ఆధారిత కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఎంపీ స్పష్టం చేశారు.
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఎస్సై వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.2
- దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు ఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్స్టేషన్కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.2
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1