ములుగు 9వ వార్డులో విద్యుత్ సమస్యలు తీర్చాలి: AEకి వినతిపత్రం అందజేత MLG:ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కృష్ణ కాలనీ, లక్ష్మీ నగర్, శ్రీ మంజునాథపురం, ప్రేమ్ నగర్ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ ఆధ్వర్యంలో కాలనీవాసులు విద్యుత్ శాఖ ఏఈ (AE) రవికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. వార్డులో తీవ్ర లో-వోల్టేజ్ సమస్య వేధిస్తోందని, దీనివల్ల తరచూ షార్ట్ సర్క్యూట్లు జరిగి ఇళ్లలోని ఫ్యాన్లు, ఫ్రిజ్జులు, టీవీలు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య నివారణకు కృష్ణ కాలనీ, మంజునాథపురం, ప్రేమ్ నగర్లలో నూతనంగా మూడు అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాన డిమాండ్లు: 11 కేవీ లైన్ల తరలింపు: కృష్ణ కాలనీలో ఇళ్ల పైకప్పుల మీదుగా ప్రమాదకరంగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్లు, 14 స్తంభాలను తొలగించి, వేరే ప్రాంతానికి మార్చాలి. గతంలో ఈ లైన్ల వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. కొత్త స్తంభాల ఏర్పాటు: వార్డులో పాత 8 మీటర్ల స్తంభాల స్థానంలో 9.1 మీటర్ల స్తంభాలను ఏర్పాటు చేయాలి. 33 కేవీ లైన్ల వద్ద భద్రత: దూరభారం ఎక్కువై బాటసారులకు తగిలేలా ప్రమాదకరంగా వేలాడుతున్న 33 కేవీ విద్యుత్ తీగల కింద అదనంగా కొత్త స్తంభాలను నాటాలి. విరిగిపోయిన పాత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్తో పాటు నాయకులు, కాలనీవాసులు గోలి రాజిరెడ్డి, చుంచు రమేష్, తక్కల్లపల్లి నాగేశ్వరరావు, తడక సుధాకర్, మాట్ల సంపత్, కొత్తపల్లి బాబురావు, తుల సుదర్శన్, మోత్కూరి శంకర్, మారబోయిన సంపత్, బండి ప్రవీణ్, బండి కిషన్, ఇక్బాల్, గూడెపు కొమురయ్య, ఎనగందుల ప్రేమ్ కుమార్, ఎం.డి. సలీం, బరుపటి మిథున్, చిదురాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు 9వ వార్డులో విద్యుత్ సమస్యలు తీర్చాలి: AEకి వినతిపత్రం అందజేత MLG:ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కృష్ణ కాలనీ, లక్ష్మీ నగర్, శ్రీ మంజునాథపురం, ప్రేమ్ నగర్ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ ఆధ్వర్యంలో కాలనీవాసులు విద్యుత్ శాఖ ఏఈ (AE) రవికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. వార్డులో తీవ్ర లో-వోల్టేజ్ సమస్య వేధిస్తోందని, దీనివల్ల తరచూ షార్ట్ సర్క్యూట్లు జరిగి ఇళ్లలోని ఫ్యాన్లు, ఫ్రిజ్జులు, టీవీలు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య నివారణకు కృష్ణ కాలనీ, మంజునాథపురం, ప్రేమ్ నగర్లలో నూతనంగా మూడు అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాన డిమాండ్లు: 11 కేవీ లైన్ల తరలింపు: కృష్ణ కాలనీలో ఇళ్ల పైకప్పుల మీదుగా ప్రమాదకరంగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్లు, 14 స్తంభాలను తొలగించి, వేరే ప్రాంతానికి మార్చాలి. గతంలో ఈ లైన్ల వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. కొత్త స్తంభాల ఏర్పాటు: వార్డులో పాత 8 మీటర్ల స్తంభాల స్థానంలో 9.1 మీటర్ల స్తంభాలను ఏర్పాటు చేయాలి. 33 కేవీ లైన్ల వద్ద భద్రత: దూరభారం ఎక్కువై బాటసారులకు తగిలేలా ప్రమాదకరంగా వేలాడుతున్న 33 కేవీ విద్యుత్ తీగల కింద అదనంగా కొత్త స్తంభాలను నాటాలి. విరిగిపోయిన పాత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్తో పాటు నాయకులు, కాలనీవాసులు గోలి రాజిరెడ్డి, చుంచు రమేష్, తక్కల్లపల్లి నాగేశ్వరరావు, తడక సుధాకర్, మాట్ల సంపత్, కొత్తపల్లి బాబురావు, తుల సుదర్శన్, మోత్కూరి శంకర్, మారబోయిన సంపత్, బండి ప్రవీణ్, బండి కిషన్, ఇక్బాల్, గూడెపు కొమురయ్య, ఎనగందుల ప్రేమ్ కుమార్, ఎం.డి. సలీం, బరుపటి మిథున్, చిదురాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
- సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు1
- గోవిందరావుపేటలో వాన దేవుని కరుణ కోసం కప్పతల్లి ఆట..... MLG:అడపా దడపా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి భరోసా ఇవ్వట్లేదు. లక్నవరం చెరువులో ఉన్న నీరు ఈ సీజను సరిపోయేలా లేదు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 80%వరి సాగుపై ఆధారపడ్డ గోవిందరావుపేట మండల రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసుకున్న అన్నదాతలు పైరుకు తడికోసం తండ్లాడుతున్నారు. ఈ క్రమంలో మండలకేంద్రంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురిపించాలని దైవాలను వేడుకున్నారు.1
- గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం - 4 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు - వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి 3 కోట్ల 11 లక్షల రూపాయలు - పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి,ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం సీఆర్ఆర్–ప్లెయిన్ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ..మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఓనం వేడుకల్లో ఘనంగా అయ్యప్ప స్వామికి మహా పడిపూజ కార్యక్రమం MLG: గోవిందరావుపేటలోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా స్వామివారికి శుభయాత్ర, కోనేరులో చక్రస్నానం, అభిషేకం, మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యుల ఆధ్వర్యంలో ధూపాటి సమ్మక్క–అంతయ్య కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ పీఎంకే గాంధీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క ప్రారంభోత్సవం అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు. మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.4
- నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- కమలాపూర్లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.2
- ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యత - రూ: 4 కోట్ల 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు : మంత్రి సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (భారత శక్తి): గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం సీఆర్ఆర్–ప్లెయిన్ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.1