6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక కామెంట్లు. ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. *మార్చి 23వ తేదీన ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడి.* *కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...* • అమరావతి ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, పూలతో రోడ్లు అత్యంత రమణీయంగా ఉన్నాయి. • ఇతర ప్రాంతాలు కూడా అందంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. • పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ. • డేటా డ్రివెన్ గవర్నెన్సు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలి. • డిజిటల్ లిటరసీని పెంచేలా ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకుందాం. • మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోండి. • సెప్టెంబరులో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందరి ముందు పెడతామని చెప్పాం. • దానికి అనుగుణంగా కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. • ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయ్యే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. • *మార్చి 23వ తేదీన అర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నాం* • *రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి.* • *2028 మార్చిలోగా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించాం* • కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లుగా తయారు కావాలి. • 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నాం. • ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి. • పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై చర్చ జరగాలి. • పీ4 కూడా ఓ గేమ్ చేంజర్. ఇది టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుంది కానీ మంచి ప్రయోజనాలు వస్తాయి. • కలెక్టర్లు పీ4ను మానిటర్ చేయాలని కోరుతున్నాను. • 2047కి రూ.55 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా చూడాలి. • *ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదు... పేదల కోసం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.* • *మహిళ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్ తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టండి* • ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోంది. • ప్రవాసాంధ్రులు వేర్వేరు దేశాల్లో విస్తరించి ఉన్నారు. • గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తుల ధరలు ఈ కారణంగా పడిపోతున్నాయి. • ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకోవాలి.
6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక కామెంట్లు. ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. *మార్చి 23వ తేదీన ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడి.* *కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...* • అమరావతి ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, పూలతో రోడ్లు అత్యంత రమణీయంగా ఉన్నాయి. • ఇతర ప్రాంతాలు కూడా అందంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. • పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ. • డేటా డ్రివెన్ గవర్నెన్సు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలి. • డిజిటల్ లిటరసీని పెంచేలా ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకుందాం. • మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోండి. • సెప్టెంబరులో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందరి ముందు పెడతామని చెప్పాం. • దానికి అనుగుణంగా కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. • ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయ్యే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. • *మార్చి 23వ తేదీన అర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నాం* • *రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి.* • *2028 మార్చిలోగా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించాం* • కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లుగా తయారు కావాలి. • 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నాం. • ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి. • పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై చర్చ జరగాలి. • పీ4 కూడా ఓ గేమ్ చేంజర్. ఇది టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుంది కానీ మంచి ప్రయోజనాలు వస్తాయి. • కలెక్టర్లు పీ4ను మానిటర్ చేయాలని కోరుతున్నాను. • 2047కి రూ.55 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా చూడాలి. • *ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదు... పేదల కోసం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.* • *మహిళ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్ తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టండి* • ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోంది. • ప్రవాసాంధ్రులు వేర్వేరు దేశాల్లో విస్తరించి ఉన్నారు. • గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తుల ధరలు ఈ కారణంగా పడిపోతున్నాయి. • ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకోవాలి.
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.2
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4