6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక కామెంట్లు. ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. *మార్చి 23వ తేదీన ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడి.* *కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...* • అమరావతి ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, పూలతో రోడ్లు అత్యంత రమణీయంగా ఉన్నాయి. • ఇతర ప్రాంతాలు కూడా అందంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. • పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ. • డేటా డ్రివెన్ గవర్నెన్సు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలి. • డిజిటల్ లిటరసీని పెంచేలా ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకుందాం. • మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోండి. • సెప్టెంబరులో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందరి ముందు పెడతామని చెప్పాం. • దానికి అనుగుణంగా కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. • ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయ్యే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. • *మార్చి 23వ తేదీన అర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నాం* • *రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి.* • *2028 మార్చిలోగా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించాం* • కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లుగా తయారు కావాలి. • 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నాం. • ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి. • పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై చర్చ జరగాలి. • పీ4 కూడా ఓ గేమ్ చేంజర్. ఇది టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుంది కానీ మంచి ప్రయోజనాలు వస్తాయి. • కలెక్టర్లు పీ4ను మానిటర్ చేయాలని కోరుతున్నాను. • 2047కి రూ.55 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా చూడాలి. • *ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదు... పేదల కోసం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.* • *మహిళ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్ తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టండి* • ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోంది. • ప్రవాసాంధ్రులు వేర్వేరు దేశాల్లో విస్తరించి ఉన్నారు. • గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తుల ధరలు ఈ కారణంగా పడిపోతున్నాయి. • ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకోవాలి.
6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక కామెంట్లు. ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. *మార్చి 23వ తేదీన ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడి.* *కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...* • అమరావతి ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, పూలతో రోడ్లు అత్యంత రమణీయంగా ఉన్నాయి. • ఇతర ప్రాంతాలు కూడా అందంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. • పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ. • డేటా డ్రివెన్ గవర్నెన్సు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలి. • డిజిటల్ లిటరసీని పెంచేలా ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకుందాం. • మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోండి. • సెప్టెంబరులో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందరి ముందు పెడతామని చెప్పాం. • దానికి అనుగుణంగా కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. • ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయ్యే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. • *మార్చి 23వ తేదీన అర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నాం* • *రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి.* • *2028 మార్చిలోగా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించాం* • కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లుగా తయారు కావాలి. • 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నాం. • ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి. • పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై చర్చ జరగాలి. • పీ4 కూడా ఓ గేమ్ చేంజర్. ఇది టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుంది కానీ మంచి ప్రయోజనాలు వస్తాయి. • కలెక్టర్లు పీ4ను మానిటర్ చేయాలని కోరుతున్నాను. • 2047కి రూ.55 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా చూడాలి. • *ప్రభుత్వం పని చేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదు... పేదల కోసం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.* • *మహిళ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్ తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టండి* • ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోంది. • ప్రవాసాంధ్రులు వేర్వేరు దేశాల్లో విస్తరించి ఉన్నారు. • గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తుల ధరలు ఈ కారణంగా పడిపోతున్నాయి. • ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకోవాలి.
- Hi1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- hi2