ద్రావిడ విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ సంప్రదాయం–ఆధునికతల మధ్య సాహిత్య విమర్శకు కొత్త దిశలు* సంప్రదాయం–ఆధునికతల మధ్య సాహిత్య విమర్శకు కొత్త దిశలు* *— జాతీయ సదస్సులో ప్రొ. నాటరాజ హూలియార్* ద్రావిడ విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మరియు నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో *“ద్రావిడ సాహిత్యం: సంప్రదాయం, ఆధునికత మరియు ఉద్భవిస్తున్న విమర్శనాత్మక దృక్పథాలు”* అన్న అంశంపై గురువారం రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశాన్ని వర్శిటీ ఎమెనో భవనం సెమినార్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వర్శిటీ ఉపకులపతి *ఆచార్య ఎల్. సి. మల్లయ్య* గారు మాట్లాడుతూ.. వార్ధాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం (MGAHV) 1997లో పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేకంగా స్థాపించబడిందని, దాని ఏకైక లక్ష్యం హిందీ భాష, సాహిత్యాన్ని బోధన, పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయడం, అలాగే హిందీని అంతర్జాతీయ భాషగా గుర్తింపు తెప్పించడమని అన్నారు. ఒక్క భాషకే, అదీ మొదటి నుండే, కేంద్ర విశ్వవిద్యాలయ హోదా ఇవ్వడానికి పార్లమెంటుకు ఎలాంటి సంకోచం కలగలేదని అన్నారు. అలాగే హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) చరిత్ర మరింత సూచనాత్మకమైనదని, ఇది 1958లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ (CIE) అనే చిన్న కేంద్ర సంస్థగా ప్రారంభమై 1972లో జర్మన్, రష్యన్, ఫ్రెంచ్ భాషలు చేరడంతో CIEFL (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్)గా విస్తరించిందని, చివరకు 2007లో పార్లమెంటు చట్టం సంఖ్య 7 of 2007 ద్వారా పూర్తి స్థాయి కేంద్ర విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయబడిందని అన్నారు. ఈ చట్టం ప్రకారం EFLU దక్షిణ ఆసియాలో భాషా అధ్యయనానికి మాత్రమే పూర్తిగా అంకితమైన ఏకైక కేంద్ర విశ్వవిద్యాలయంగా అధికారిక గుర్తింపు పొందిందన్నారు. అలాగే సంస్కృత భాషకు మూడు చోట్ల షిల్లాంగ్, ఢిల్లీ, తిరుపతిలలో కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ద్రావిడ భాషలన్నింటికి కూడా ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఉన్నట్లయితే పరిశోధనకు మరింత అవకాశం లభిస్తుందని అన్నారు. అలాగే ద్రావిడ భాషలన్నింటి మధ్య అంతరాలను తొలగించే విధంగా ప్రాచీనమైన మూల ద్రావిడ భాషను పునర్ నిర్మించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ జాతీయ సదస్సులో ప్రముఖ సాహితీవేత్త *ప్రొ. నటరాజ హూలియార్* కీలకోపన్యాసం చేస్తూ.. సంప్రదాయం, ఆధునికతల మధ్య సంబంధం అత్యంత సంక్లిష్టమైనదని, ఈ రెండింటినీ పరస్పర విరుద్ధ ధ్రువాలుగా కాకుండా నిరంతరం పరస్పరం ప్రభావితం చేసుకునే చలనశీల ప్రక్రియలుగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంప్రదాయం అనేది కేవలం గతానికి సంబంధించిన వారసత్వం కాదని, అది ప్రతి కాలంలోనూ పునర్నిర్మితమవుతూ కొత్త అర్థాలను సంతరించుకునే సజీవ సాంస్కృతిక ప్రక్రియ అని అన్నారు. అదే విధంగా ఆధునికత కూడా సంప్రదాయాన్ని పూర్తిగా నిరాకరించే ప్రక్రియ కాదని, సంప్రదాయంతో సంభాషిస్తూ, దానిని ప్రశ్నిస్తూ, పునర్వ్యాఖ్యానిస్తూ ముందుకు సాగే మేధోపరమైన పరిణామమని వివరించారు. సమకాలీన సాహిత్య విమర్శ పరిధి విస్తృతంగా మారిందని, విమర్శ ఇక కేవలం సాహిత్య గ్రంథంలోని భాష, శైలి, నిర్మాణం, సౌందర్యాన్ని విశ్లేషించడానికే పరిమితం కాదని, చరిత్ర, సమాజశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ సిద్ధాంతం, సాంస్కృతిక అధ్యయనాలు, లింగ అధ్యయనాలు, భాషాశాస్త్రం, మానవ శాస్త్రాలు, మీడియా అధ్యయనాలు వంటి అనేక విభాగాలతో సాహిత్య విమర్శ సంబంధాన్ని ఏర్పరుచుకుంటోందని పేర్కొన్నారు. “సాహిత్య విమర్శ నేడు అత్యంత అనువైన, విస్తృతమైన అంతరశాస్త్రీయ జ్ఞాన రంగంగా పరిణమించింది. ఒక సాహిత్య రచనను అర్థం చేసుకోవాలంటే ఆ రచన పుట్టిన సామాజిక, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరిశీలించాలి” అని ఆయన అన్నారు. సాహిత్య విమర్శకు సమాజంలోని అంతర్లీన వాస్తవాలను వెలికితీసే సామర్థ్యం ఉందని వివరించారు. “సంప్రదాయం నిలిచిపోయిన గతం కాదు; ఆధునికత సంప్రదాయానికి ముగింపు కాదు రెండింటి మధ్య జరిగే నిరంతర సంభాషణలోనే కొత్త సాహిత్య అర్థాలు, కొత్త విమర్శనాత్మక దృక్పథాలు, కొత్త సామాజిక ఊహలు పుడతాయి” అని ప్రొ. నాటరాజ హూలియార్ తన కీలకోపన్యాసంలో పేర్కొన్నారు. అనంతరం మొదటి సెషన్ లో “ద్రావిడ సాహిత్యం, సంప్రదాయం, ఆధునికత మరియు ఉద్భవిస్తున్న విమర్శనాత్మక దృక్పధాలు, నూతన స్వరాలు మరియు నూతన కథనాలు – కవిత్వం” అన్న అంశం పై తెలుగు లో ఆర్. సీతారామ్, కన్నడలో కె. సి. శివ రెడ్డి, తమిళంలో బి. రవికుమార్, మలయాళం లో పి. కె. జయరాజన్ లు ప్రసంగించారు. అదేవిధం రెండవ సెషన్ లో “ద్రావిడ సాహిత్యం: సంప్రదాయం, ఆధునికత మరియు ఆవిరభవిస్తున్న విమర్శనాత్మక దృక్కోణాలు, కొత్త స్వరాలు మరియు కొత్త కథనాలు, చిన్న కథ” అన్న అంశం పై తెలుగు లో శైలజ కాళ్లకూరి, కన్నడంలో గావిసిద్దప్ప హెచ్. పటేల్, తమిళంలో ఎస్. సెల్వకుమారం, మలయాళంలో ఏం. బినోయ్ లు ప్రసంగించారు . ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్, సెమినార్ కన్వీనర్ ఆచార్య కె. శారద, ఆచార్య సి. హెచ్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆచార్య కె శ్రీదేవి, కో కన్వీనర్లు ఆచార్య ఎన్. సుశీల, ఆచార్య బి. ఎస్. శివ కుమార్, ఆచార్య జయలలిత, ఆచార్య ఏం ఎస్ దుర్గాప్రవీణ , డా. పి. ఎస్. గణేష్ మూర్తి, అన్ని శాఖల శాఖాధిపతులు, బోధన సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థినీ విధ్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. - _డా. ఏం. హరికృష్ణ, పి ఆర్ ఓ, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం_
ద్రావిడ విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ సంప్రదాయం–ఆధునికతల మధ్య సాహిత్య విమర్శకు కొత్త దిశలు* సంప్రదాయం–ఆధునికతల మధ్య సాహిత్య విమర్శకు కొత్త దిశలు* *— జాతీయ సదస్సులో ప్రొ. నాటరాజ హూలియార్* ద్రావిడ విశ్వవిద్యాలయంలో కన్నడ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మరియు నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో *“ద్రావిడ సాహిత్యం: సంప్రదాయం, ఆధునికత మరియు ఉద్భవిస్తున్న విమర్శనాత్మక దృక్పథాలు”* అన్న అంశంపై గురువారం రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశాన్ని వర్శిటీ ఎమెనో భవనం సెమినార్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వర్శిటీ ఉపకులపతి *ఆచార్య ఎల్. సి. మల్లయ్య* గారు మాట్లాడుతూ.. వార్ధాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం (MGAHV) 1997లో పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేకంగా స్థాపించబడిందని, దాని ఏకైక లక్ష్యం హిందీ భాష, సాహిత్యాన్ని బోధన, పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయడం, అలాగే హిందీని అంతర్జాతీయ భాషగా గుర్తింపు తెప్పించడమని అన్నారు. ఒక్క భాషకే, అదీ మొదటి నుండే, కేంద్ర విశ్వవిద్యాలయ హోదా ఇవ్వడానికి పార్లమెంటుకు ఎలాంటి సంకోచం కలగలేదని అన్నారు. అలాగే హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) చరిత్ర మరింత సూచనాత్మకమైనదని, ఇది 1958లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ (CIE) అనే
చిన్న కేంద్ర సంస్థగా ప్రారంభమై 1972లో జర్మన్, రష్యన్, ఫ్రెంచ్ భాషలు చేరడంతో CIEFL (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్)గా విస్తరించిందని, చివరకు 2007లో పార్లమెంటు చట్టం సంఖ్య 7 of 2007 ద్వారా పూర్తి స్థాయి కేంద్ర విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయబడిందని అన్నారు. ఈ చట్టం ప్రకారం EFLU దక్షిణ ఆసియాలో భాషా అధ్యయనానికి మాత్రమే పూర్తిగా అంకితమైన ఏకైక కేంద్ర విశ్వవిద్యాలయంగా అధికారిక గుర్తింపు పొందిందన్నారు. అలాగే సంస్కృత భాషకు మూడు చోట్ల షిల్లాంగ్, ఢిల్లీ, తిరుపతిలలో కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ద్రావిడ భాషలన్నింటికి కూడా ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఉన్నట్లయితే పరిశోధనకు మరింత అవకాశం లభిస్తుందని అన్నారు. అలాగే ద్రావిడ భాషలన్నింటి మధ్య అంతరాలను తొలగించే విధంగా ప్రాచీనమైన మూల ద్రావిడ భాషను పునర్ నిర్మించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ జాతీయ సదస్సులో ప్రముఖ సాహితీవేత్త *ప్రొ. నటరాజ హూలియార్* కీలకోపన్యాసం చేస్తూ.. సంప్రదాయం, ఆధునికతల మధ్య సంబంధం అత్యంత సంక్లిష్టమైనదని, ఈ రెండింటినీ పరస్పర విరుద్ధ ధ్రువాలుగా కాకుండా నిరంతరం పరస్పరం ప్రభావితం చేసుకునే చలనశీల ప్రక్రియలుగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంప్రదాయం అనేది కేవలం గతానికి సంబంధించిన వారసత్వం కాదని, అది ప్రతి కాలంలోనూ పునర్నిర్మితమవుతూ కొత్త అర్థాలను
సంతరించుకునే సజీవ సాంస్కృతిక ప్రక్రియ అని అన్నారు. అదే విధంగా ఆధునికత కూడా సంప్రదాయాన్ని పూర్తిగా నిరాకరించే ప్రక్రియ కాదని, సంప్రదాయంతో సంభాషిస్తూ, దానిని ప్రశ్నిస్తూ, పునర్వ్యాఖ్యానిస్తూ ముందుకు సాగే మేధోపరమైన పరిణామమని వివరించారు. సమకాలీన సాహిత్య విమర్శ పరిధి విస్తృతంగా మారిందని, విమర్శ ఇక కేవలం సాహిత్య గ్రంథంలోని భాష, శైలి, నిర్మాణం, సౌందర్యాన్ని విశ్లేషించడానికే పరిమితం కాదని, చరిత్ర, సమాజశాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ సిద్ధాంతం, సాంస్కృతిక అధ్యయనాలు, లింగ అధ్యయనాలు, భాషాశాస్త్రం, మానవ శాస్త్రాలు, మీడియా అధ్యయనాలు వంటి అనేక విభాగాలతో సాహిత్య విమర్శ సంబంధాన్ని ఏర్పరుచుకుంటోందని పేర్కొన్నారు. “సాహిత్య విమర్శ నేడు అత్యంత అనువైన, విస్తృతమైన అంతరశాస్త్రీయ జ్ఞాన రంగంగా పరిణమించింది. ఒక సాహిత్య రచనను అర్థం చేసుకోవాలంటే ఆ రచన పుట్టిన సామాజిక, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరిశీలించాలి” అని ఆయన అన్నారు. సాహిత్య విమర్శకు సమాజంలోని అంతర్లీన వాస్తవాలను వెలికితీసే సామర్థ్యం ఉందని వివరించారు. “సంప్రదాయం నిలిచిపోయిన గతం కాదు; ఆధునికత సంప్రదాయానికి ముగింపు కాదు రెండింటి మధ్య జరిగే నిరంతర సంభాషణలోనే కొత్త సాహిత్య అర్థాలు, కొత్త విమర్శనాత్మక దృక్పథాలు, కొత్త సామాజిక ఊహలు పుడతాయి” అని ప్రొ. నాటరాజ హూలియార్ తన కీలకోపన్యాసంలో పేర్కొన్నారు. అనంతరం మొదటి సెషన్ లో “ద్రావిడ సాహిత్యం, సంప్రదాయం, ఆధునికత మరియు
ఉద్భవిస్తున్న విమర్శనాత్మక దృక్పధాలు, నూతన స్వరాలు మరియు నూతన కథనాలు – కవిత్వం” అన్న అంశం పై తెలుగు లో ఆర్. సీతారామ్, కన్నడలో కె. సి. శివ రెడ్డి, తమిళంలో బి. రవికుమార్, మలయాళం లో పి. కె. జయరాజన్ లు ప్రసంగించారు. అదేవిధం రెండవ సెషన్ లో “ద్రావిడ సాహిత్యం: సంప్రదాయం, ఆధునికత మరియు ఆవిరభవిస్తున్న విమర్శనాత్మక దృక్కోణాలు, కొత్త స్వరాలు మరియు కొత్త కథనాలు, చిన్న కథ” అన్న అంశం పై తెలుగు లో శైలజ కాళ్లకూరి, కన్నడంలో గావిసిద్దప్ప హెచ్. పటేల్, తమిళంలో ఎస్. సెల్వకుమారం, మలయాళంలో ఏం. బినోయ్ లు ప్రసంగించారు . ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్, సెమినార్ కన్వీనర్ ఆచార్య కె. శారద, ఆచార్య సి. హెచ్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆచార్య కె శ్రీదేవి, కో కన్వీనర్లు ఆచార్య ఎన్. సుశీల, ఆచార్య బి. ఎస్. శివ కుమార్, ఆచార్య జయలలిత, ఆచార్య ఏం ఎస్ దుర్గాప్రవీణ , డా. పి. ఎస్. గణేష్ మూర్తి, అన్ని శాఖల శాఖాధిపతులు, బోధన సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థినీ విధ్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. - _డా. ఏం. హరికృష్ణ, పి ఆర్ ఓ, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం_
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.1
- ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్” శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెబ్ సిరీస్లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.1
- నేపాల్ వరదలకు కారణం ఇదేనా..? బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..! నేపాల్, టిబెట్ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం... హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ భారీ మంచుకొండ ఏకంగా 4 వేల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది. అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో... భారీగా మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి... దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంచుకొండ పడిన ప్రాంతం... బాంబు పేలినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అంటే... ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా..? లేక... హిమాలయాల్లో భారీ మంచుకొండ విరిగిపడి... దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగిందా..? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం... మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద... హిమాలయాల్లో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.1