Shuru
Apke Nagar Ki App…
అరకు: పోలీసుల 'మహిళా భద్రత-మన బాధ్యత' సదస్సులో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర, డీఎస్పీ నవజ్యోతి మిశ్రా పాల్గొన్నారు. "మహిళలకు గౌరవం, రక్షణ ఇంటి నుంచే మొదలవ్వాలి. చట్టాలతో పాటు ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే స్త్రీలకు నిజమైన రక్షణ లభిస్తుంది. మగపిల్లలకు ఆడవారిని గౌరవించడం తల్లిదండ్రులు నేర్పాలి" అని దొన్ను దొర స్పష్టం చేశారు. ఆపదలో 'శ్రీ శక్తి' యాప్ వాడాలని సూచించారు.
Shyam
అరకు: పోలీసుల 'మహిళా భద్రత-మన బాధ్యత' సదస్సులో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర, డీఎస్పీ నవజ్యోతి మిశ్రా పాల్గొన్నారు. "మహిళలకు గౌరవం, రక్షణ ఇంటి నుంచే మొదలవ్వాలి. చట్టాలతో పాటు ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే స్త్రీలకు నిజమైన రక్షణ లభిస్తుంది. మగపిల్లలకు ఆడవారిని గౌరవించడం తల్లిదండ్రులు నేర్పాలి" అని దొన్ను దొర స్పష్టం చేశారు. ఆపదలో 'శ్రీ శక్తి' యాప్ వాడాలని సూచించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3
- అరసవల్లి , ఏప్రిల్,20: ఆహార పదార్థాల్లో హానికారక రంగులు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అరసవెల్లి అసిరి తల్లి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ అసిరీతల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా, ప్రదర్శనశాల ప్రాంతంలో దాని పరిసరాల్లో 11 ఆహార భద్రతా తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు. స్టాళ్లలో ఫాస్ట్ ఫుడ్ (మంచూరియా, నూడుల్స్), ఐస్ క్రీమ్ , మస్కా బన్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తనిఖీ సమయంలో కనుగొన్న విషయాలు: షుగర్ క్యాండీని అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేశారు.ఆ ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి,వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీచేశారు. కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్లను ఉపయోగించవద్దు: గడువు ముగిసిన లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దు సరైన పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. ప్రజారోగ్యం భద్రతను నిర్ధారించడానికి, విక్రేతలందరూ FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. . ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని ఎటువంటి నిషేధిత రంగులని, ప్రామాణికము కానీ ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కే .లక్ష్మీ పాల్గొన్నారు1
- శ్రీకాకుళం జిల్లాలోనేరేడు బ్యారేజీ మరియు పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదు ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. అచ్చం నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డిగోవిందరావు ,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర. వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర .ప్రకాష్ మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు స్థానిక సిపిఎం కార్యాలయంలో నేరేడు బ్యారేజీకి మరియు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా అన్ని లిఫ్టుల్ని మరమ్మత్తులు చేసి నీరు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి.మోహనరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పట్ల పాలకులు చేసిన నిర్లక్ష్యమే జిల్లాకు శాపం గా మారిందని వారు అన్నారు. వంశధార రిజర్వాయర్ కు 200 కోట్లు ఆఫ్షోర్ రిజర్వాయర్ కి 300 కోట్లు వంశధార రిజర్వాయర్ లిఫ్ట్ కోసం 176 కోట్లు, పైడిగాం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే పని పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ప్రజలకు నీరు ఇవ్వకుండా జలదార పేరుతో మోసంచేస్తుందనివిమర్శించారు .రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించకుండా మాయ మాటలు చెబుతుందని విమర్శించారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసుకోవచ్చని 2021లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని వామపక్షాలు ప్రజా సంఘాలు పోరాట ఫలితంగా గజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయిందని నేరెడ్ బ్యారేజీ నిర్మాణం కోసం 1000 కోట్లు అవుతుందని దానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసి చివరి భూముల వరకు రెండు పంటలకు నీరు ఇస్తే జిల్లాలో తలసరి ఆదాయము రెట్టింపు అవుతుందని ప్రజల ఆదాయాల పెరిగి అనేక వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయని తద్వారా ఉపాధి దొరుకుతుందని వలసలు నివారించబడతాయని అన్నారు. గొట్టా బ్యారేజీ పూర్తయి 50 సంవత్సరాలు కావస్తుందని దాని మరమ్మత్తుల కోసం 1500 కోట్లు అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు .రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర సంస్థ సింపు నుండి ఎందుకు నిధులు మంజూరు చేయించలేదని వారు ప్రశ్నించారు. గొట్టా బ్యారేజీ కాలువ ఆధునికరణ చేస్తే చివర భూముల వరకు నీరు ఇ వ్వడంతో పాటు మరో 30 వేల ఎకరాలకు అదనంగా నీరు ఇవ్వొచ్చని అన్నారు. మన జిల్లాలో నదులు, వాగులు ద్వారా నీరు పుష్కలంగా ఉందనిదానినివినియోగించుకోకాపోవడంతో వృధాగా సముద్రంలో కలుస్తుందనిదాన్నివినియోగించడానికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జల దార పేరుతో ఇంకుడు గోతులు తవ్వండని ప్రసారం చేయడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 2009లో షర్టుల కుంభకోణం జరిగిన తర్వాత నేటికీ షర్టులు బిగించకపోవడంతో కాలువలో నీరు వెళ్లకుండా వృధాగా పోతుందని షట్టర్ ఎప్పుడు లోగా బిగిస్తారు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడిని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. కొండపేట లిఫ్ట్ తో సహా జిల్లాలో అన్ని లిఫ్టులు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు . అచ్చంనాయుడు గారు కోటబొమ్మాలి మండలంలో కొండ పేట లిఫ్ట్ మరమ్మత్తులు చేస్తామని రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదని వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించక పోతే ఈ ఏడాది కూడా 22 గ్రామాల ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురవుతారని అన్నారు. నారాయణపురం కాలువ మరమ్మతు చేయకపోవడం చివరి భూముల వరకు నీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికి నేరేడు బ్యారేజ్ కి 1000 కోట్లు, ఆఫ్షోర్ కి 300 కోట్లు, వంశధార రిజర్వాయర్ మరియు లిఫ్ట్ 500 కోట్లు, గొట్టా బ్యారేజ్ ఆధునికరణకు 1500 కోట్లు, పలాస నుండి ఇచ్చాపురం వరకు నీరు ఇవ్వడం కోసం 500 కోట్లు, సుమారు 3000 కోట్ల కేటాయిస్తే జిల్లా సస్యశ్యామలమవుతుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా వెనుకబాటుకి గురవుతుందని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించాలని కోరుతూ దశ లు వారి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.1
- 🙏😭1
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.3
- శ్రీకాకుళం జిల్లాఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస లో గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యా విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ స్వయంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామం లో ప్రధాన వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత విద్య, ఉన్నత ప్రమాణాలు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఆధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని వివరించారు.4
- 🙏😭1