చలో హైదరాబాద్కు ఉమ్మడి వరంగల్ ఉర్దూ జర్నలిస్టుల బృందానికి ఎమ్మెల్యే నాయిని సెండ్ఆఫ్ లోకల్ న్యూస్,హనుమకొండ, ఆగస్టు 1 హైదరాబాద్లో జరుగుతున్న తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) రాష్ట్ర వార్షికోత్సవానికి బయలుదేరిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ జర్నలిస్టుల బృందానికి హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ఘనంగా సెండ్ఆఫ్ చేశారు. ఈ సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, వారి సంక్షేమం కోసం ఫెడరేషన్ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో TUWJ(IJU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెళ్లి మధు, ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్, సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ షఫీ ఉర్ రెహ్మాన్ పాల్గొన్నారు. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సాజిద్ పాషా ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. నయీం, కోశాధికారి మహమ్మద్ అమీర్ ఖాన్తో పాటు జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు, ఉర్దూ జర్నలిస్టుల బృందం హైదరాబాద్కు బయలుదేరింది. రాష్ట్ర వార్షికోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
చలో హైదరాబాద్కు ఉమ్మడి వరంగల్ ఉర్దూ జర్నలిస్టుల బృందానికి ఎమ్మెల్యే నాయిని సెండ్ఆఫ్ లోకల్ న్యూస్,హనుమకొండ, ఆగస్టు 1 హైదరాబాద్లో జరుగుతున్న తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) రాష్ట్ర వార్షికోత్సవానికి బయలుదేరిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ జర్నలిస్టుల బృందానికి హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ఘనంగా సెండ్ఆఫ్ చేశారు. ఈ సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, వారి సంక్షేమం కోసం ఫెడరేషన్ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో TUWJ(IJU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెళ్లి మధు, ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్, సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ షఫీ ఉర్ రెహ్మాన్ పాల్గొన్నారు. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సాజిద్ పాషా ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. నయీం, కోశాధికారి మహమ్మద్ అమీర్ ఖాన్తో పాటు జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు, ఉర్దూ జర్నలిస్టుల బృందం హైదరాబాద్కు బయలుదేరింది. రాష్ట్ర వార్షికోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- ఆలేరు రెవెన్యూ డివిజన్పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది1