రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో నిరంతరం ప్రజాసేవను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆయుష్ హోమంతో పాటు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తోలేటి శిరీష, ప్రత్యేక ఆహ్వానితులు గంజి గోవిందరాజు, పత్తిపాడు జనసేన పార్టీ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ వెన్నా జగదీష్, జనసేన పార్టీ నాయకులు అడపా శివరామకృష్ణ, కొండపల్లి శివ, తుని ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కర్ణం సుబ్రమణ్యంతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని హృదయపూర్వకంగా ప్రార్థించినట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో నిరంతరం ప్రజాసేవను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆయుష్ హోమంతో పాటు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు
సభ్యురాలు తోలేటి శిరీష, ప్రత్యేక ఆహ్వానితులు గంజి గోవిందరాజు, పత్తిపాడు జనసేన పార్టీ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ వెన్నా జగదీష్, జనసేన పార్టీ నాయకులు అడపా శివరామకృష్ణ, కొండపల్లి శివ, తుని
ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కర్ణం సుబ్రమణ్యంతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని హృదయపూర్వకంగా ప్రార్థించినట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
- 😭🙏1
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.1
- కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ ఆలయంలో ఆదివారం నాడు భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో సుమారుగా 32 వేల మందికి పైగా భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గొర్ల భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజుతో కలిసి క్యూ లైన్లలో నిలబడిన భక్తుల వద్దకు వెళ్లి ఆలయంలో కల్పించిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల రాకతో ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. వాహన పూజలు, ప్రసాదాలు, రూములు, కేశఖండన మరియు వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ. 12,13,758 (12 లక్షల 13 వేల 758) ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో విశ్వనాథరాజు వెల్లడించారు.1
- 🙏🙏1
- 🙏🙏1
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని రహదారుల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగోలేవని, వీటిని ఎవరూ గుర్తించడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ దారుల గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కింద పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎవరిలోనూ చలనం లేదని, తాము చెప్పాల్సింది చెప్పేశామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.2
- 😭🙏1
- ఓటర్లకు అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ అయింది. మీ ఓటు భద్రంగా ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారమ్ (EF) ను జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన ఫారమ్ను మీ ప్రాంత బీఎల్ఓ (BLO) కు అందజేయాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా దీనిని సమర్పించకపోతే, జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇంకా ఈ ఫారమ్ అందనట్లయితే, ఈసీఐ (ECI) ఓటర్ పోర్టల్ లేదా ఈసీఐ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో సమర్పించవచ్చు. లేదా మీ పరిధిలోని బీఎల్ఓను సంప్రదించి కూడా ఫారమ్ పొందవచ్చు. మీ ఓటు భద్రంగా ఉండాలంటే జూలై 14 లోపు ఈ ఎన్యూమరేషన్ ఫారమ్ను సమర్పించడం తప్పనిసరి.1