చెక్కుచెదరని వైసీపీ కంచుకోట! - ముప్పై ఏళ్లుగా వైకాపాదే ఏకపక్ష ఆధిపత్యం - పులివెందుల తరహాలోనే మారిన బద్వేల్ - టీడీపీకి కొరకరాని కొయ్యగా రాజకీయం - కొత్త ఇన్ఛార్జితో సైకిల్ వ్యూహాలు - విశ్వనాథరెడ్డి వెంటే బలమైన క్యాడర్ - ఐదు మండలాల్లో తిరుగులేని ప్రాబల్యం - ఫ్యాన్ ఓటు బ్యాంకు భద్రం - అధికార కూటమికి అతిపెద్ద సవాల్ బద్వేలు,ఆగస్టు 01: కడప జిల్లా రాజకీయాల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం పసుపు రంగుకు ఏమాత్రం లొంగని వైకాపా అభేద్యమైన కోటగా నిలిచింది. గత ముప్పై ఏళ్లుగా, అంటే వరుసగా ఆరు దఫాలుగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలకు కనీసం గెలిచే అవకాశమే ఇవ్వకుండా ఓటర్లు ఏకపక్ష తీర్పు ఇస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి హయాం తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకుని జెండా పాతలేకపోయింది. కూటమి హవాలో రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి తగ్గినప్పటికీ, పులివెందుల తరహాలోనే బద్వేల్లో మాత్రం వైకాపా తన ప్రభావాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంది. వరుస పరాజయాలతో కుదేలైన టీడీపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలనే పట్టుదలతో మంచూరు సూర్యనారాయణ రెడ్డిని సమన్వయకర్తగా బరిలోకి దింపింది. అయితే, వైకాపాకు క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్, ద్వితీయ శ్రేణి నేత విశ్వనాథరెడ్డి రాజకీయ చతురత పసుపు దళానికి పెద్ద ప్రతిబంధకంగా మారాయి. అధికారంలో లేకపోయినా, ప్రజా సమస్యల పరిష్కారంలో విశ్వనాథరెడ్డి నిరంతరం ప్రజలు, కార్యకర్తల మధ్యే ఉంటూ బాసటగా నిలుస్తున్నారు. ఐదు మండలాల్లో ఏకంగా 30 వేల ఓటర్లపై ఆయనకున్న వ్యక్తిగత పట్టు ఈ నియోజకవర్గంలో వైకాపాకు కొండంత అండగా మారింది. వైకాపా శ్రేణులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలిచే ఆయన తీరు, ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా పరిణమించింది. - మూడు దశాబ్దాల సుదీర్ఘ ఆధిపత్యం కడప జిల్లా రాజకీయ చిత్రపటంలో పులివెందుల తర్వాత అంతటి రాజకీయ ప్రాధాన్యత, స్పష్టమైన ఓటింగ్ సరళి ఉన్న నియోజకవర్గం బద్వేలు. పూర్వపు కాంగ్రెస్ రోజులనుంచి నేటి వైకాపా వరకు ఇక్కడి ఓటర్లు వైఎస్ కుటుంబం, ఆ పార్టీ పక్షానే పటిష్టంగా నిలబడుతూ వస్తున్నారు. పచ్చజెండాకు ఇక్కడ విజయం దక్కక మూడు దశాబ్దాలు కావొస్తుండటం ఇక్కడి రాజకీయ తీవ్రతకు నిదర్శనం. ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు వ్యూహాలు మార్చినా, ఎంతటి బలమైన అభ్యర్థులను దింపినా టీడీపీకి ఓటమి పరంపర తప్పడం లేదు. - మంచూరు సమన్వయంతో సైకిల్ కొత్త వ్యూహం వరుస పరాజయాలతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పసుపు శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు తెలుగుదేశం అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్తగా మంచూరు సూర్యనారాయణ రెడ్డిని నియమించి, నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన వేళ, ఈ ఒక్క నియోజకవర్గాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. - క్షేత్రస్థాయిలో చెక్కుచెదరని ఫ్యాన్ ఓటు బ్యాంకు రాష్ట్రస్థాయి రాజకీయాల్లో వైకాపా ఒకింత ఆత్మరక్షణలో పడినా, బద్వేల్ నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీ ఓటు బ్యాంకు ఏమాత్రం చెదిరిపోలేదని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకుడు విశ్వనాథరెడ్డి చాకచక్యం వైకాపా పాలిట రక్షక కవచంగా మారింది. అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజాసమస్యల పరిష్కారంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ, వరస పర్యటనలతో కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. - ఐదు మండలాల్లో ముప్పై వేల ఓట్ల పట్టు బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఏడు మండలాల్లో ఐదు మండలాల పై విశ్వనాథరెడ్డికి ఉన్న పట్టు సామాన్యమైనది కాదు. కేవలం తన రాజకీయ చతురతతో సుమారు 30 వేల మంది ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధించారు. కార్యకర్తలను, ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తే ఏ రాజ్యమెదురైనా పోరాడతాననే ఆయన ధిక్కార స్వరం, క్షేత్రస్థాయిలో వైకాపా క్యాడర్కు పెద్ద కొండంత అండగా నిలుస్తోంది.
చెక్కుచెదరని వైసీపీ కంచుకోట! - ముప్పై ఏళ్లుగా వైకాపాదే ఏకపక్ష ఆధిపత్యం - పులివెందుల తరహాలోనే మారిన బద్వేల్ - టీడీపీకి కొరకరాని కొయ్యగా రాజకీయం - కొత్త ఇన్ఛార్జితో సైకిల్ వ్యూహాలు - విశ్వనాథరెడ్డి వెంటే బలమైన క్యాడర్ - ఐదు మండలాల్లో తిరుగులేని ప్రాబల్యం - ఫ్యాన్ ఓటు బ్యాంకు భద్రం - అధికార కూటమికి అతిపెద్ద సవాల్ బద్వేలు,ఆగస్టు 01: కడప జిల్లా రాజకీయాల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం పసుపు రంగుకు ఏమాత్రం లొంగని వైకాపా అభేద్యమైన కోటగా నిలిచింది. గత ముప్పై ఏళ్లుగా, అంటే వరుసగా ఆరు దఫాలుగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలకు కనీసం గెలిచే అవకాశమే ఇవ్వకుండా ఓటర్లు ఏకపక్ష తీర్పు ఇస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి హయాం తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకుని జెండా పాతలేకపోయింది. కూటమి హవాలో రాష్ట్రమంతటా ఫ్యాన్ గాలి తగ్గినప్పటికీ, పులివెందుల తరహాలోనే బద్వేల్లో మాత్రం వైకాపా తన ప్రభావాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంది. వరుస పరాజయాలతో కుదేలైన టీడీపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలనే పట్టుదలతో మంచూరు సూర్యనారాయణ రెడ్డిని సమన్వయకర్తగా బరిలోకి దింపింది. అయితే, వైకాపాకు క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్, ద్వితీయ శ్రేణి నేత విశ్వనాథరెడ్డి రాజకీయ చతురత పసుపు దళానికి పెద్ద ప్రతిబంధకంగా మారాయి. అధికారంలో లేకపోయినా, ప్రజా సమస్యల పరిష్కారంలో విశ్వనాథరెడ్డి నిరంతరం ప్రజలు, కార్యకర్తల మధ్యే ఉంటూ బాసటగా నిలుస్తున్నారు. ఐదు మండలాల్లో ఏకంగా 30 వేల ఓటర్లపై ఆయనకున్న వ్యక్తిగత పట్టు ఈ నియోజకవర్గంలో వైకాపాకు కొండంత అండగా మారింది. వైకాపా శ్రేణులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలిచే ఆయన తీరు, ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా పరిణమించింది. - మూడు దశాబ్దాల సుదీర్ఘ ఆధిపత్యం కడప జిల్లా రాజకీయ చిత్రపటంలో పులివెందుల తర్వాత అంతటి రాజకీయ ప్రాధాన్యత, స్పష్టమైన ఓటింగ్ సరళి ఉన్న నియోజకవర్గం
బద్వేలు. పూర్వపు కాంగ్రెస్ రోజులనుంచి నేటి వైకాపా వరకు ఇక్కడి ఓటర్లు వైఎస్ కుటుంబం, ఆ పార్టీ పక్షానే పటిష్టంగా నిలబడుతూ వస్తున్నారు. పచ్చజెండాకు ఇక్కడ విజయం దక్కక మూడు దశాబ్దాలు కావొస్తుండటం ఇక్కడి రాజకీయ తీవ్రతకు నిదర్శనం. ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు వ్యూహాలు మార్చినా, ఎంతటి బలమైన అభ్యర్థులను దింపినా టీడీపీకి ఓటమి పరంపర తప్పడం లేదు. - మంచూరు సమన్వయంతో సైకిల్ కొత్త వ్యూహం వరుస పరాజయాలతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పసుపు శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు తెలుగుదేశం అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్తగా మంచూరు సూర్యనారాయణ రెడ్డిని నియమించి, నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన వేళ, ఈ ఒక్క నియోజకవర్గాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. - క్షేత్రస్థాయిలో చెక్కుచెదరని ఫ్యాన్ ఓటు బ్యాంకు రాష్ట్రస్థాయి రాజకీయాల్లో వైకాపా ఒకింత ఆత్మరక్షణలో పడినా, బద్వేల్ నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీ ఓటు బ్యాంకు ఏమాత్రం చెదిరిపోలేదని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకుడు విశ్వనాథరెడ్డి చాకచక్యం వైకాపా పాలిట రక్షక కవచంగా మారింది. అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజాసమస్యల పరిష్కారంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ, వరస పర్యటనలతో కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. - ఐదు మండలాల్లో ముప్పై వేల ఓట్ల పట్టు బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఏడు మండలాల్లో ఐదు మండలాల పై విశ్వనాథరెడ్డికి ఉన్న పట్టు సామాన్యమైనది కాదు. కేవలం తన రాజకీయ చతురతతో సుమారు 30 వేల మంది ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధించారు. కార్యకర్తలను, ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తే ఏ రాజ్యమెదురైనా పోరాడతాననే ఆయన ధిక్కార స్వరం, క్షేత్రస్థాయిలో వైకాపా క్యాడర్కు పెద్ద కొండంత అండగా నిలుస్తోంది.
- బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.1
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.1
- కోవూరు ఏఎంసీ చైర్మన్ ని బెజవాడ వంశీ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు, అభినందన వెల్లువ కోవూరు ఏఎంసీ చైర్మన్ ని బెజవాడ వంశీ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు కోవూరు నియోజకవర్గం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని మిడవలూరు మండలం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని శాలువాతో సత్కరించి, పూలమాలవేసి బాణాసంచా పేల్చి శుభాకాంక్షలు తెలపటం జరిగింది. టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి నాయకులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు పార్టీ కోసం కష్టపడుతుంటాడనిఇలాంటి పదవి ఇవ్వటం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.4
- వర్షాభావంతో రైతు కన్నీరు: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర అయితే ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరికి చేసేదేమీ లేక ట్రాక్టర్తో దున్నవలసి వచ్చిందని రైతు వాపోయాడు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయానని రైతు విలపించాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ (యం ఎల్) నేత వెంకటేశ్వర్లు కోరారు1
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1
- ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం.. నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని,ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి "నివృత్తి సంగమేశ్వరాలయం" గా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించగా, ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాకపోవడంతో,రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు.దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు.భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి,భీమలింగంగా దానికి పేరు పెట్టాడు.భక్తులు భీమలింగాన్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని స్థల పురాణం చెప్తోంది.ఈ ఆలయం శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది.2003 తరువాత శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేక వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన "వేపదారులింగం" ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ,భద్ర,కృష్ణ,వేణి,భీమ,మలాపహరిణి,భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరమని పిలుస్తున్నారు.ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడు పేరున్న నది,మిగిలినవన్నీ స్త్రీల పేర్లున్న నదులే.భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.నంద్యాల జిల్లాలోని నందికోట్కూరు,ఆత్మకూరు మండలాల మీదుగా బస్సులు,ఆటోలు,జీపులలో సంగమేశ్వరానికి చేరుకోవచ్చు.1