ఎర్రారం గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్డిఓ కు వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రారం గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ మండల కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జీవరత్నం లు కలిసి ఈరోజు ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ప్రభాకర్ గారికి వినతి పత్రం అందజేశారు ఇప్పటివరకు ఎర్రారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం లేదని జలాల్ పూర్ వడ్ల కొనుగోలు కేంద్రం ద్వారానే వడ్లను కొనుగోలు చేయడం జరిగిందని ఇకనుండి ఎర్రారం గ్రామంలోనే నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు ఎల్లారెడ్డి ఆర్డీవో గారికి వినతిపత్రం అందజేశారు దీనిపై ఆర్డిఓ ప్రభాకర్ సానుకూలంగా స్పందించి రాబోయే ఖరీఫ్ సీజన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో భాగంగా ఎర్రారం గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు దీంతో గ్రామంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో ధాన్యం సేకరణ సులువై రైతుల కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ మండల కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జివరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఎర్రారం గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్డిఓ కు వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రారం గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ మండల కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జీవరత్నం లు కలిసి ఈరోజు ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ప్రభాకర్ గారికి వినతి పత్రం అందజేశారు ఇప్పటివరకు ఎర్రారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం లేదని జలాల్ పూర్ వడ్ల కొనుగోలు కేంద్రం ద్వారానే వడ్లను కొనుగోలు చేయడం జరిగిందని ఇకనుండి ఎర్రారం గ్రామంలోనే నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు ఎల్లారెడ్డి ఆర్డీవో గారికి వినతిపత్రం అందజేశారు దీనిపై ఆర్డిఓ ప్రభాకర్ సానుకూలంగా స్పందించి రాబోయే ఖరీఫ్ సీజన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో భాగంగా ఎర్రారం గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు దీంతో గ్రామంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో ధాన్యం సేకరణ సులువై రైతుల కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ మండల కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జివరత్నం తదితరులు పాల్గొన్నారు.
- హెల్మెట్.. ప్రాణాలకు రక్షణ కవచం వినాయకుడి దర్శనానికి వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్లాలి – ఎస్పీ రాజేష్ చంద్ కామారెడ్డి, సెప్టెంబర్ 15: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. ఎస్పీ వినూత్న ఆలోచనకు అనుగుణంగా కామారెడ్డి పోలీసులు చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ను వినాయక మండపంగా తీర్చిదిద్దారు. హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ‘హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు. “వినాయకుడి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాలి. వచ్చే ఏడాది కూడా స్వామివారి దర్శనానికి రావాలి. అందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, జాగ్రత్తగా ప్రయాణించాలి” అని ఎస్పీ పిలుపునిచ్చారు. పండుగల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తారని, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వేగ నియంత్రణ పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. భక్తి.. బాధ్యత.. భద్రత అనే సందేశంతో పట్టణంలోని వివిధ వినాయక మండపాల వద్ద కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు జరిమానాలు, కేసుల కోసమే కాదని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, డీఎస్పీ ఎస్. మధుసూదన్, పట్టణ ఎస్హెచ్ఓ బి. నరహరి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కంగ్టి మండలంలో. భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన గణనాథుడు SRD:మండల కేంద్రమైన కంగ్టి , తడ్కల్ పరిసరాల గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పురోహితులు, యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గణపతికి పూజలు, హారతులు నిర్వహించారు. వినాయకుడి విశిష్టత, విజయాన్ని పురోహితులు భక్తులకు వివరించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.1
- బోధన్ రకాసిపేట్లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్లు, ఆలిమ్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి ఎఫ్ఎల్ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు రాజీ వద్దు పాఠంలో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్, సెప్టెంబర్ 15 — మెతుకు సీమ టైమ్స్ ప్రతినిధి: “ప్రాథమిక దశలోనే విద్యార్థికి బలమైన పునాది వేస్తే.. భవిష్యత్తులో అతని విద్యా ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది” అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మంగళవారం రామాయంపేట, అక్కన్నపేట మండలాల్లోని ప్రీ-ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి క్లాస్రూమ్లో.. కేవలం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో సరిపెట్టకుండా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు? పిల్లలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? నేర్చుకున్న విషయాలను తిరిగి చెప్పగలుగుతున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారి పునాదే.. రేపటి భవిష్యత్తు ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లల్లో చదవడం, రాయడం, సంఖ్యలపై ప్రాథమిక అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. “ప్రతి చిన్నారి చదవాలి.. అర్థం చేసుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది” అనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.1
- రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం శివంపేట మండలం గూడూరు గ్రామంలోని ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత మేరకు వచ్చింది.. అందులో ఎంత ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అందించారు.. ప్రస్తుతం మిల్లులో ఎంత ధాన్యం నిల్వ ఉంది అనే వివరాలను అధికారులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేస్తూ క్షేత్రస్థాయి నిల్వలను లెక్కించారు. ధాన్యం కేటాయింపులు, బియ్యం సరఫరా, ప్రస్తుత నిల్వలకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.1
- కోనాపూర్కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- కాగజ్నగర్లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1