*ఘనంగా పెరియార్ రామస్వామి జయంతి*. వాంకిడి, సెప్టెంబరు 17 : దళిత ఆత్మగౌరవ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామి 147వ జయంతిని గురువారం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ద విహార్ లో భారతీయ బౌద్ద మహా సభ,అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం 1925 తర్వాత ఉద్యమాన్ని కుల వ్యవస్థ నిర్మూలన, మూఢనమ్మకాల వ్యతిరేకత, హేతువాదం మరియు స్త్రీ సమానత్వం కోసం ప్రారంభించారని భారతీయ బౌద్ద మహా సభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహూల్కర్,సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్ లు అన్నారు.సామాజిక సంస్కరణల కోసం జీవితాంతం పోరాడారని,బ్రాహ్మణ ఆధిపత్యానికి, అసమానతలకు వ్యతిరేకంగా ద్రావిడ కజగం పార్టీని స్థాపించారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు దుర్గం దుర్గాజి, అర్ పి ఐ జిల్లా అధ్యక్షులు,వర్ష వాస్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామ్ రావు,బౌద్ధ సమజ్ అధ్యక్షులు శ్యామ్ రావు లహుజి దుర్గే, ఉప్రే, రాజేశ్వర్,బౌద్ధ ఉపాసకులు పాండు,కుమార్,నాయకులు, బలవంత్, మనోజ్,లడ్డు,బుద్ధ జి, ఉపేందర్, చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.
*ఘనంగా పెరియార్ రామస్వామి జయంతి*. వాంకిడి, సెప్టెంబరు 17 : దళిత ఆత్మగౌరవ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామి 147వ జయంతిని గురువారం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ద విహార్ లో భారతీయ బౌద్ద మహా సభ,అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం 1925 తర్వాత ఉద్యమాన్ని కుల వ్యవస్థ నిర్మూలన, మూఢనమ్మకాల వ్యతిరేకత, హేతువాదం మరియు స్త్రీ సమానత్వం కోసం ప్రారంభించారని భారతీయ బౌద్ద మహా సభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహూల్కర్,సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్ లు అన్నారు.సామాజిక సంస్కరణల కోసం జీవితాంతం పోరాడారని,బ్రాహ్మణ ఆధిపత్యానికి, అసమానతలకు వ్యతిరేకంగా ద్రావిడ కజగం పార్టీని స్థాపించారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు దుర్గం దుర్గాజి, అర్ పి ఐ జిల్లా అధ్యక్షులు,వర్ష వాస్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామ్ రావు,బౌద్ధ సమజ్ అధ్యక్షులు శ్యామ్ రావు లహుజి దుర్గే, ఉప్రే, రాజేశ్వర్,బౌద్ధ ఉపాసకులు పాండు,కుమార్,నాయకులు, బలవంత్, మనోజ్,లడ్డు,బుద్ధ జి, ఉపేందర్, చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.
- మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్కు పయనమయ్యారు.1
- ఉట్నూర్లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.1
- కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.1
- జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.1