కొండపల్లిలో సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. కొండపల్లి మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం. మహేష్ ఎర్రజెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు పిడికిలి బిగించి "సిఐటియు జిందాబాద్, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎం. మహేష్ మాట్లాడుతూ, 1970 మే 30న స్థాపించిన నాటి నుంచి సిఐటియు కార్మికుల హక్కులు, న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కోసం నిరంతరం పోరాడుతోందని గుర్తు చేశారు. 'ఐక్యత మరియు పోరాటం' అనే నినాదంతో లక్షలాది మంది కార్మికులను సంఘటితం చేసిందని తెలిపారు. నేడు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కాంట్రాక్టు విధానం, కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి, మతతత్వ రాజకీయాల ముసుగులో లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కార్మికులందరూ ఐక్యంగా నిలబడాలని మహేష్ పిలుపునిచ్చారు. సిఐటియు కేవలం కార్మికుల సమస్యలకే పరిమితం కాకుండా రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రమజీవుల సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాడుతోందని, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా సిఐటియు స్థాపక నాయకులకు, కార్మిక ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. కార్పొరేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్ల రద్దుకై మరింత ప్రతిఘటించాలని, బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు ఉద్యమించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు జి. సురేష్, కార్యదర్శి టి. కృష్ణ, కోశాధికారి బి. నవీన్, ఉపాధ్యక్షులు దేవుళ్ళు, అప్పారావు, రమణ, సహాయ కార్యదర్శి రత్నారావు, సూర్యలక్ష్మి, కమిటీ సభ్యులు లక్ష్మణ, నాగేశ్వరరావు, ఎస్. శ్రీను, ప్రసాద్, లోవా రాజు తదితరులు పాల్గొన్నారు.
కొండపల్లిలో సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. కొండపల్లి మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం. మహేష్ ఎర్రజెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు పిడికిలి బిగించి "సిఐటియు జిందాబాద్, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎం. మహేష్ మాట్లాడుతూ, 1970 మే 30న స్థాపించిన నాటి నుంచి సిఐటియు కార్మికుల హక్కులు, న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కోసం నిరంతరం పోరాడుతోందని గుర్తు చేశారు. 'ఐక్యత మరియు పోరాటం' అనే నినాదంతో లక్షలాది మంది కార్మికులను సంఘటితం చేసిందని తెలిపారు. నేడు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కాంట్రాక్టు విధానం, కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి, మతతత్వ రాజకీయాల ముసుగులో లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కార్మికులందరూ ఐక్యంగా నిలబడాలని మహేష్ పిలుపునిచ్చారు. సిఐటియు కేవలం కార్మికుల సమస్యలకే పరిమితం కాకుండా రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రమజీవుల సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాడుతోందని, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా సిఐటియు స్థాపక నాయకులకు, కార్మిక ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. కార్పొరేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్ల రద్దుకై మరింత ప్రతిఘటించాలని, బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు ఉద్యమించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు జి. సురేష్, కార్యదర్శి టి. కృష్ణ, కోశాధికారి బి. నవీన్, ఉపాధ్యక్షులు దేవుళ్ళు, అప్పారావు, రమణ, సహాయ కార్యదర్శి రత్నారావు, సూర్యలక్ష్మి, కమిటీ సభ్యులు లక్ష్మణ, నాగేశ్వరరావు, ఎస్. శ్రీను, ప్రసాద్, లోవా రాజు తదితరులు పాల్గొన్నారు.
- Post by SHOT NEWS1
- తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కుసుమంచి మండలంలోని గణపేశ్వర ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, అలాగే కొండాపురం నుంచి పొన్నెకల్లు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ కోరారు.1
- తల్లాడ మండల కేంద్రంలో గత 9 రోజులుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOA) చేస్తున్న దీక్షా శిబిరాన్ని AITUC ఖమ్మం జిల్లా నాయకులు మంకెన కృష్ణ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం VOAల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. VOAలకు నెలకు రూ.26,000 వేతనం, పీఎఫ్ సౌకర్యం, అలాగే రూ.20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని మంకెన కృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో మండల VOA అధ్యక్షురాలు సుజాతతో పాటు భానుశ్రీ, కళావతి మరియు ఇతర VOA నాయకులు పాల్గొన్నారు.1
- పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.1
- సత్తుపల్లి పట్టణంలోని 18వ వార్డులో ఉన్న డాల్ఫిన్స్ స్విమ్మింగ్ పూల్లో జరిగిన స్విమ్మింగ్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.2
- కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.1