logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు ఏడాది కాలంలో బోటింగ్ రంగం ద్వారా రూ.1.48 కోట్లకు గండి తెలంగాణలోని 27 పర్యాటక కేంద్రాల్లో దాదాపు 99 బోట్లను నడిపిస్తున్న పర్యాటక శాఖ 2024లో బోటింగ్ ద్వారా రూ.14.60 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ.13.12 కోట్లకు పడిపోయిన ఆదాయం హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, నాగార్జున సాగర్, లక్నవరం లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరుగుతున్నా ఒక్క ఏడాదిలో రూ.1.48 కోట్ల ఆదాయం పడిపోవడంతో పర్యాటక శాఖలో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు బోటింగ్ కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌లు, మేనేజర్లు, సిబ్బందితో కుమ్మక్కయి, టిక్కెట్లు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే తక్కువ ధరలకు బోటింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు రూ.500 ఉన్న టికెట్‌ను, రూ.200కు టికెట్ లేకుండా బోట్లోకి అనుమతించడం, 10 ట్రిప్పులు తిరిగితే 8 ట్రిప్పులు తిరిగినట్లు చూపించి మిగతా 2 ట్రిప్పుల డబ్బులు తీసుకోవడం, ఒక్క ట్రిప్పుకు 3 లీటర్లు డీజిల్ అవసరం ఉండగా అదనంగా 2 లీటర్లు బిల్లులో రాయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు నాగార్జునసాగర్ బోటింగ్ కేంద్రంలో ఇన్‌ఛార్జి ఏకంగా నకిలీ టికెట్ బుక్కునే ప్రింట్ చేసి, ప్రభుత్వానికి రావలసిన లక్షల ఆదాయం కొల్లగొట్టాడని, అతన్ని విధుల నుండి తొలగించిన అధికారులు ప్రతీ బోటింగ్ కేంద్రంలో ఇలాంటి అవినీతి జరుగుతుందని, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికైనా ఇలాంటి అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు

15 hrs ago
user_Tagore
Tagore
Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
15 hrs ago
2b43d870-a43e-4950-8a06-64926d09fcc5

తెలంగాణ పర్యాటక శాఖలో బయటపడ్డ అక్రమాలు ఏడాది కాలంలో బోటింగ్ రంగం ద్వారా రూ.1.48 కోట్లకు గండి తెలంగాణలోని 27 పర్యాటక కేంద్రాల్లో దాదాపు 99 బోట్లను నడిపిస్తున్న పర్యాటక శాఖ 2024లో బోటింగ్ ద్వారా రూ.14.60 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ.13.12 కోట్లకు పడిపోయిన ఆదాయం హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, నాగార్జున సాగర్, లక్నవరం లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరుగుతున్నా ఒక్క ఏడాదిలో రూ.1.48 కోట్ల ఆదాయం పడిపోవడంతో పర్యాటక శాఖలో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు బోటింగ్ కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌లు, మేనేజర్లు, సిబ్బందితో కుమ్మక్కయి, టిక్కెట్లు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే తక్కువ ధరలకు బోటింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు రూ.500 ఉన్న టికెట్‌ను, రూ.200కు టికెట్ లేకుండా బోట్లోకి అనుమతించడం, 10 ట్రిప్పులు తిరిగితే 8 ట్రిప్పులు తిరిగినట్లు చూపించి మిగతా 2 ట్రిప్పుల డబ్బులు తీసుకోవడం, ఒక్క ట్రిప్పుకు 3 లీటర్లు డీజిల్ అవసరం ఉండగా అదనంగా 2 లీటర్లు బిల్లులో రాయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు నాగార్జునసాగర్ బోటింగ్ కేంద్రంలో ఇన్‌ఛార్జి ఏకంగా నకిలీ టికెట్ బుక్కునే ప్రింట్ చేసి, ప్రభుత్వానికి రావలసిన లక్షల ఆదాయం కొల్లగొట్టాడని, అతన్ని విధుల నుండి తొలగించిన అధికారులు ప్రతీ బోటింగ్ కేంద్రంలో ఇలాంటి అవినీతి జరుగుతుందని, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికైనా ఇలాంటి అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు

More news from తెలంగాణ and nearby areas
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    18 hrs ago
  • జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం
    1
    జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో అమానుష ఘటన 
చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్‌లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్
నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్
నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్
విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు
చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! ​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    1
    హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన!
​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్  బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో  బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు   అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    2
    తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు  మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • "Auto drivers struggling due to gas shortage." ​"No gas, no work: Auto drivers in distress." ​"Fuel crisis hitting auto drivers hard."
    1
    "Auto drivers struggling due to gas shortage."
​"No gas, no work: Auto drivers in distress."
​"Fuel crisis hitting auto drivers hard."
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు.
ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్  స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    1
    తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్!
చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్:
మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.