గద్వాల లో ప్రభుత్వ టాయిలెట్లో అక్రమ బైక్ మెకానిక్ షాప్ మున్సిపల్ పరిధిలోని 20 వ వార్డు నల్లకుంట లో రాజీవ్ మార్గ్ వద్ద MRF టైర్స్ ముందు ప్రభుత్వ ధనంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ను అక్రమంగా బైక్ మెకానిక్ షాప్గా మార్చి నడుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన ఈ నిర్మాణాన్ని ప్రైవేట్ లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని, గతంలోనే ఫిర్యాదులు చేసినా స్థానిక నాయకుల ప్రభావంతో కొనసాగుతోందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రజా సౌకర్యాల కోసం ఖర్చు చేసిన డబ్బు వృథా అవుతోంది. ఈ టాయిలెట్ను బైక్ రిపేర్ షాప్గా మార్చడం వల్ల మహిళలు, పిల్లలు సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా మామూలు (బ్రైబ్) స్థానిక అధికారులు లేదా నాయకుల ఖాతాలోకి వెళ్తోందని సందేహాలున్నాయి. ఈ నిజాలు బయటకు రావాలి. ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణల మధ్య ఈ వివాదం మరింత ఉధృతమవుతోంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానిక సమాజం డిమాండ్ చేస్తోంది.
గద్వాల లో ప్రభుత్వ టాయిలెట్లో అక్రమ బైక్ మెకానిక్ షాప్ మున్సిపల్ పరిధిలోని 20 వ వార్డు నల్లకుంట లో రాజీవ్ మార్గ్ వద్ద MRF టైర్స్ ముందు ప్రభుత్వ ధనంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ను అక్రమంగా బైక్ మెకానిక్ షాప్గా మార్చి నడుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన ఈ నిర్మాణాన్ని ప్రైవేట్ లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని, గతంలోనే ఫిర్యాదులు చేసినా స్థానిక నాయకుల ప్రభావంతో కొనసాగుతోందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రజా సౌకర్యాల కోసం ఖర్చు చేసిన డబ్బు వృథా అవుతోంది. ఈ టాయిలెట్ను బైక్ రిపేర్ షాప్గా మార్చడం వల్ల మహిళలు, పిల్లలు సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా మామూలు (బ్రైబ్) స్థానిక అధికారులు లేదా నాయకుల ఖాతాలోకి వెళ్తోందని సందేహాలున్నాయి. ఈ నిజాలు బయటకు రావాలి. ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణల మధ్య ఈ వివాదం మరింత ఉధృతమవుతోంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానిక సమాజం డిమాండ్ చేస్తోంది.
- ఆదోనిలో జరిగే చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ పరిరక్షణ సమితి నాయకులు చీకోటి ప్రవీణ్ హాజరవుతున్నట్లు తెలిపారు.1
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు1
- పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం....... - ఇదేమిటి అని అడిగితే బూతు మాటలతో ఎదురుదాడి...... - ఇట్లనే చేస్తే హాల్ టికెట్ ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి...... వెల్దండ: మండల కేంద్రాల్లోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు వారం రోజుల నుండి ఉడికి ఉడకని పురువుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం,బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి ప్రిన్సిపాల్ డాం డాం అంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ స్వర్ణ రత్నం ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ, అడిగితే పురుగులను తీసేసి తినండి అంటున్నారని, సమస్య ఎవరికైన చెప్పిన మమ్మల్ని టార్గెట్ చేసేవారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేదని, ఎందుకు మేడం అంటే పాఠశాల లో మౌలిక వసతుల కోసమని చెప్పేది కానీ ఆ డబ్బులతో ఏమీ చేయకుండా సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకునేదని తెలిపారు. ఫెస్టివల్ పార్టీ కానీ, ఫ్రెషర్ పార్టీ కానీ ప్రిన్సిపల్ మైక్ లోనే దుర్భాషలాడేదని, పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నామని, మా ఆరోగ్యాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారని,ఈ ప్రిన్సిపల్ మాకొద్దని, వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తేనే మేము పాఠశాల వెళ్తామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కార్తీక్ కుమార్, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎస్సై కురుమూర్తి హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ఆగ్రహం.......... పురుగుల అన్నం తినలేక గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని దళిత సంఘాల నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్, జంగిలి ఆనంద్, సామెల్, కొయ్యల పుల్లయ్య, గోరటి సుధాకర్, గోరటి సంజీవ, జంగిల్ ప్రవీణ్, ఏకుల వెంకటేష్, దుళ్ల పెద్దయ్య లతో పాటు మరి కొంతమంది నాయకులు ఆగ్రం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారని, వారికి పురుగుల అన్నం ఎట్లా పెడతారని, ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శి గిరి, ఆయా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.6
- కాకునూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రభను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ప్రభను ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున వరకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగనున్నది.అనంతరం నిప్పుకణుకలపై నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, హారతులు, నాదస్వరాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- నస్కల్ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా... """"""""""""""""""""''''""""""""""""""""""""" పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ""'''''''''''""""""""""""""""'''''''""""""""""" కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం అని తెలిపిన 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు కుర్వ బాల్ రాజ్. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయామని,అందువల్లే ప్రమాణ స్వీకారం మిస్ అయ్యిందని ఒకటో వార్డు అభ్యర్థి అక్కమ్మ కుమారుడు తెలిపారు.ఈ విషయాన్ని ఎమ్మెల్యే సమక్షంలో వెల్లడించారు.అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, దీనిపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు.చిన్న తప్పిదం వల్లే ఈ గొడవ చోటుచేసుకుందని అక్కమ్మ కుమారుడు తెలిపారు.తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే కి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఎలాంటి అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు.నస్కల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.1
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar1
- కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కొందరు అనుమతి లేకుండా జేసీబీతో చెట్లు తొలగించారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వనాన్ని ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పనులు జరిపారని తెలిపారు. ఘటనపై పంచాయతీ కార్యదర్శి బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.1