#సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు #కేంద్ర బడ్జెట్ పై సిపిఎం నిరసన #ఎపి కి తీవ్ర అన్యాయంపై స్పందించని అధిక, ప్రతిపక్ష పార్టీ నేతలు రాజమహేంద్రవరం :- సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు, సామాన్యులకు మాటల్లో .. కార్పొరేట్లకు కోట్లలో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించింది అని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై సిపిఎం తూరజిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక శ్యామల సెంటర్ లొ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సామాన్యులకు ఉత్త మాటలే దక్కాయి అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభలో ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్లో అధికభాగం కార్పొరేట్ల వైపే పరుగులు పెట్టింది. ఫలితంగా అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కింది. నిరుద్యోగ నిర్మూలనకోసమంటూ అట్టహాసంగా ప్రకటించిన నూతన పథకాలను సైతం కార్పొరేట్ల ఖజనాలను నింపే వనరులుగా మార్చివేయడం మోడీ సర్కారు ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఈ పథకాల్లోనూ కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు శూన్యం! ఇంటర్న్షిప్లనే సర్వస్వంగా చిత్రించే ప్రయత్నించారు. గరీబ్, మహిళా, యువ, అన్నదాత.. అని మాటలు చెబుతూనే, వారికిచ్చే సబ్సిడీలలో భారీగా కోతలు పెట్టి వంచనాశిల్ప విద్యను కేంద్రం ప్రదర్శించింది. పెరిగిన ధరలతో నిరుపేదలు కుంగిపోతున్నా ఉపాధి హామీ నిధుల్లో అడ్డగోలు కోతను మోడీ సర్కారు కొనసాగించింది. అది చాలదన్నట్లు ఆహార సబ్సిడీ మీద 7,082 కోట్ల రూపాయల కోత పెట్టింది. అంగన్వాడీలతో పాటు మాతా శిశు పథకాలకు అరకొర కేటాయింపులే దక్కాయి. ఇక విద్య, వైద్యం గ్రామీణాభివృద్ధి రంగాలకు కూడా ద్రవ్యోల్బణాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా విదిలింపులతో సరిపెట్టారు. వేతన జీవులకు పెద్దగా ఊరట లభించలేదు. పేదలకిచ్చే సబ్సిడీలపై కోతలు పెట్టిన మోడీ ప్రభుత్వం అదే సమయంలో సంపదపైనా, వారసత్వపు ఆస్తులపైనా నామమాత్రపు పన్ను విధించడానికి కూడా సిద్దపడలేదు. ఫలితంగా రానున్న రోజుల్లో అంతరాల భారతం మరింత పెరగనుంది. సామాన్యులకు మరిన్ని కష్టాలు, కన్నీళ్లు తప్పని స్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది అని, ఆర్థిక లోటు తగ్గించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు లేవు అని అన్నారు. మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది, మహిళలకు సంబంధించి ప్రతి బడ్జెట్లోనూ ప్రకటనలున్నా, కేటాయింపులు పెరగడం లేదు, ఉన్న వాటినీ అమలు చేయడం లేదు అని తెలిపారు. మాటలు ఘనం.. నిధులు స్వల్పం #ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లొ తీవ్రఅన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని, మాటలు ఘనం.. చేతులు శూన్యం అన్నట్లుగా ఉందని అరుణ్ విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాల అమలుకు నిధులు ఇస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందని పేర్కొన్నారు. పైగా సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకోకపోగా గత సంవత్సరం కన్నా రూ.63 కోట్లు తగ్గించారని తెలిపారు. విశాఖ పోర్టుకు రూ.125 కోట్లు కోత పడిందని వివరించారు. రాష్ట్రం పట్ల బిజెపికి సవతి తల్లి ప్రేమకు ఇది నిదర్శమని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు పలుసార్లు ప్రస్తావించారని, కానీ నిధులు కేటాయింపు నిరాశ కలిగించిందని తెలిపారు. చెప్పిన మాటల్లో కూడా స్పష్టత లేదని, ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రజలను మోసగించడానికి కేంద్రం ప్రయత్నించిందని వివరించారు. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు పలు ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామని మంత్రి పేర్కొనవడం వల్ల రాష్ట్రానికి రాజధానికి మేలు జరగదని తెలిపారు. రూ.15 వేల కోట్లను నేరుగా గ్రాంటుగా ప్రకటించాలని కోరారు. వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇప్పించడం వల్ల రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని, రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి అవగాహన ఉన్నా, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధులు ప్రస్తావన లేదని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రస్తావించిన రెండు పారిశ్రామిక కారిడార్లకు నిధులు గురించి ప్రస్తావన లేదని పేర్కొన్నారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్లో స్పందన లేదని, నిర్వాసితులను గాలికి వదిలేశారని వివరించారు. ప్రత్యేక హోదా ఉసేలేదని, రైల్వేజోన్, కడప ఉక్కు, మెట్రో, విద్య, వైద్య సంస్థలు తదితర చట్టబద్ధమైన హామీలు బడ్జెట్లో చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. గత పదేళ్ల నుండి విభజన చట్ట ప్రకారం నిధులు కేటాయించకుండా బిజెపి నిర్లక్ష్యం చేసిందని, ఈ బడ్జెట్లోనూ ఆశించిన రీతిలో కేటాయింపులు లేవని తెలిపారు. పుణ్యక్షేత్రాల టూరిజం, వరద నివారణ చర్యలు తదితర విషయాల్లో అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయించినా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రం పైనా బిజెపి పైనా రాజకీయ ఒత్తిడి తేవాలని సూచించారు. బడ్జెట్లో మాటలతో సంతృప్తి పడకుండా స్పష్టమైన నిధులు సాధించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రాన్ని, బిజెపిని నిలదీయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీల పైన ఒత్తిడి తేవాలని, పార్లమెంటులో మన రాష్ట్ర ఎంపిలు న్యాయం కోసం పోరాడాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలొ సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్, నాయకులు ఎస్.ఎస్.మూర్తి, టి.ఎస్.ప్రకాష్, సావిత్రి,తులసి, పి.వెంకటేశ్వరావు, కె.రామకృష్ణ, బి.పూర్ణిమరాజు, సోమేశ్వరావు, వెంకటేశ్వరావు, పి.రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాజా, రాంబాబు, తాతరావు, మోహన్, మురళి, స్రవంతి, జరినా, భాస్కర్ తదితరులు పాల్గున్నారు.
#సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు #కేంద్ర బడ్జెట్ పై సిపిఎం నిరసన #ఎపి కి తీవ్ర అన్యాయంపై స్పందించని అధిక, ప్రతిపక్ష పార్టీ నేతలు రాజమహేంద్రవరం :- సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు, సామాన్యులకు మాటల్లో .. కార్పొరేట్లకు కోట్లలో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించింది అని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై సిపిఎం తూరజిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక శ్యామల సెంటర్ లొ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సామాన్యులకు ఉత్త మాటలే దక్కాయి అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభలో ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్లో అధికభాగం కార్పొరేట్ల వైపే పరుగులు పెట్టింది. ఫలితంగా అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కింది. నిరుద్యోగ నిర్మూలనకోసమంటూ అట్టహాసంగా ప్రకటించిన నూతన పథకాలను సైతం కార్పొరేట్ల ఖజనాలను నింపే వనరులుగా మార్చివేయడం మోడీ సర్కారు ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఈ పథకాల్లోనూ కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు శూన్యం! ఇంటర్న్షిప్లనే సర్వస్వంగా చిత్రించే ప్రయత్నించారు. గరీబ్, మహిళా, యువ, అన్నదాత.. అని మాటలు చెబుతూనే, వారికిచ్చే సబ్సిడీలలో భారీగా కోతలు పెట్టి వంచనాశిల్ప విద్యను కేంద్రం ప్రదర్శించింది. పెరిగిన ధరలతో నిరుపేదలు కుంగిపోతున్నా ఉపాధి హామీ నిధుల్లో అడ్డగోలు కోతను మోడీ సర్కారు కొనసాగించింది. అది చాలదన్నట్లు ఆహార సబ్సిడీ మీద 7,082 కోట్ల రూపాయల కోత పెట్టింది. అంగన్వాడీలతో పాటు మాతా శిశు పథకాలకు అరకొర కేటాయింపులే దక్కాయి. ఇక విద్య, వైద్యం గ్రామీణాభివృద్ధి రంగాలకు కూడా ద్రవ్యోల్బణాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా విదిలింపులతో సరిపెట్టారు. వేతన జీవులకు పెద్దగా ఊరట లభించలేదు. పేదలకిచ్చే సబ్సిడీలపై కోతలు పెట్టిన మోడీ ప్రభుత్వం అదే సమయంలో సంపదపైనా, వారసత్వపు ఆస్తులపైనా నామమాత్రపు పన్ను విధించడానికి కూడా సిద్దపడలేదు. ఫలితంగా రానున్న రోజుల్లో అంతరాల భారతం మరింత పెరగనుంది. సామాన్యులకు మరిన్ని కష్టాలు, కన్నీళ్లు తప్పని స్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది అని, ఆర్థిక లోటు తగ్గించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు లేవు అని అన్నారు. మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది, మహిళలకు సంబంధించి ప్రతి బడ్జెట్లోనూ ప్రకటనలున్నా, కేటాయింపులు పెరగడం లేదు, ఉన్న వాటినీ అమలు చేయడం లేదు అని తెలిపారు. మాటలు ఘనం.. నిధులు స్వల్పం #ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లొ తీవ్రఅన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని, మాటలు ఘనం.. చేతులు శూన్యం అన్నట్లుగా ఉందని అరుణ్ విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాల అమలుకు నిధులు ఇస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందని పేర్కొన్నారు. పైగా సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకోకపోగా గత సంవత్సరం కన్నా రూ.63 కోట్లు తగ్గించారని తెలిపారు. విశాఖ పోర్టుకు రూ.125 కోట్లు కోత పడిందని వివరించారు. రాష్ట్రం పట్ల బిజెపికి సవతి తల్లి ప్రేమకు ఇది నిదర్శమని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు పలుసార్లు ప్రస్తావించారని, కానీ నిధులు కేటాయింపు నిరాశ కలిగించిందని తెలిపారు. చెప్పిన మాటల్లో కూడా స్పష్టత లేదని, ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రజలను మోసగించడానికి కేంద్రం ప్రయత్నించిందని వివరించారు. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు పలు ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామని మంత్రి పేర్కొనవడం వల్ల రాష్ట్రానికి రాజధానికి మేలు జరగదని తెలిపారు. రూ.15 వేల కోట్లను నేరుగా గ్రాంటుగా ప్రకటించాలని కోరారు. వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇప్పించడం వల్ల రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని, రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి అవగాహన ఉన్నా, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధులు ప్రస్తావన లేదని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రస్తావించిన రెండు పారిశ్రామిక కారిడార్లకు నిధులు గురించి ప్రస్తావన లేదని పేర్కొన్నారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్లో స్పందన లేదని, నిర్వాసితులను గాలికి వదిలేశారని వివరించారు. ప్రత్యేక హోదా ఉసేలేదని, రైల్వేజోన్, కడప ఉక్కు, మెట్రో, విద్య, వైద్య సంస్థలు తదితర చట్టబద్ధమైన హామీలు బడ్జెట్లో చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. గత పదేళ్ల నుండి విభజన చట్ట ప్రకారం నిధులు కేటాయించకుండా బిజెపి నిర్లక్ష్యం చేసిందని, ఈ బడ్జెట్లోనూ ఆశించిన రీతిలో కేటాయింపులు లేవని తెలిపారు. పుణ్యక్షేత్రాల టూరిజం, వరద నివారణ చర్యలు తదితర విషయాల్లో అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయించినా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రం పైనా బిజెపి పైనా రాజకీయ ఒత్తిడి తేవాలని సూచించారు. బడ్జెట్లో మాటలతో సంతృప్తి పడకుండా స్పష్టమైన నిధులు సాధించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రాన్ని, బిజెపిని నిలదీయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీల పైన ఒత్తిడి తేవాలని, పార్లమెంటులో మన రాష్ట్ర ఎంపిలు న్యాయం కోసం పోరాడాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలొ సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్, నాయకులు ఎస్.ఎస్.మూర్తి, టి.ఎస్.ప్రకాష్, సావిత్రి,తులసి, పి.వెంకటేశ్వరావు, కె.రామకృష్ణ, బి.పూర్ణిమరాజు, సోమేశ్వరావు, వెంకటేశ్వరావు, పి.రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాజా, రాంబాబు, తాతరావు, మోహన్, మురళి, స్రవంతి, జరినా, భాస్కర్ తదితరులు పాల్గున్నారు.
- అద్దంలా🪞 మారిన 🥰🤗కడప రోడ్లు ఏమ్మన్నా ఉందా..🥰🥰🤗 క్లైమేట్ అసలు..1
- Today maa inti Kadapa muggu1
- Kadapa Kiran drums party 🥁6305371597🥁1
- పీర్ల పండుగ,లావనూరు,పులివెందుల కడప జిల్లా,20July 20241
- Basetty Suresh is live పుష్పగిరి పుణ్యక్షేత్రం చరిత్ర ఇన్ కడప జిల్లా1
- పవన్ మాట్లాడుతుండగా కడప రెడ్డమ్మా నవ్వులు | Pawan Kalyan Speech At AP Assembly | Kadapa Reddamma1
- కడప రెడ్డమ్మ అలక..! | Kadapa MLA Madhavi Reddy Angry | CM Chandrababu | RTV Kadapa1
- కడప జిల్లా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మిక చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన1