Shuru
Apke Nagar Ki App…
మొగల్తూరు మండలంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవములు ప్రారంభం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని ఉన్న అన్ని గ్రామాలలో సోమవారం వినాయక చవితి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. ప్రజలు ప్రతి ఇంటిలోనూ వినాయక మట్టి విగ్రహాలను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబంలోని సభ్యులందరూ కొత్త వస్త్రాలను ధరించి ఆనందంగా గడిపారు
నాగిడి దుర్గా నాగేశ్వరరావు
మొగల్తూరు మండలంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవములు ప్రారంభం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని ఉన్న అన్ని గ్రామాలలో సోమవారం వినాయక చవితి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. ప్రజలు ప్రతి ఇంటిలోనూ వినాయక మట్టి విగ్రహాలను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబంలోని సభ్యులందరూ కొత్త వస్త్రాలను ధరించి ఆనందంగా గడిపారు
More news from West Godavari and nearby areas
- ఫ్లెక్సీ చింతివేతపై వైసిపి శ్రేణులు ఆందోళన.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాయకులు తాడేపల్లిగూడెం పాతూరులో వైసీపీ నాయకుడు వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. దీంతో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని వైసీపీ పట్టణాధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందితులపై చర్య తీసుకోవాలని కోరుతూ పట్టణ ఎస్సై వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు సూర్యచంద్రరావు పాల్గొన్నారు.1
- చించినాడ గ్రామంలో.. విద్యార్థులకు సైకిల్ పంపిణీ అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు1
- పెనుగొండలో ఉధృతమైన వీఆర్ఏల సమ్మె న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వీఆర్ఏ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు బుధవారం పెనుగొండలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.గాంధీ బొమ్మల రోడ్డులోని కచేరి సెంటర్ వద్ద నరసాపురం డివిజన్ వీఆర్ఏల అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు కీలకంగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.తమ సమస్యలపై పలుమార్లు విన్నవించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో సహాయ నిరాకరణకు దిగాల్సి వచ్చిందన్నారు.డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. వీఆర్ఏలకు తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని ఏళ్లుగా నామిని వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్టైమ్ సెటిల్మెంట్ విధానంలో వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్ఓ,అటెండర్,నైట్వాచ్మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం ప్రతినిధులు,వివిధ గ్రామాల వీఆర్ఏలు,మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.1
- మాజీమంత్రి ఆళ్ల నాని కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాజీమంత్రి ఆళ్ల నాని కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, (ఆళ్ల నాని) భౌతికకాయానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆళ్ల నాని నాకు మంచి మిత్రుడు ఆయన లేరు అంటే చాలా జీర్ణించుకోలేని విషయం అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.2
- తాడేపల్లిగూడెం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భక్తిశ్రద్ధలతో గణపతి హోమం తాడేపల్లిగూడెం 11, 6వ వార్డుల మధ్య వేంచేసియున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణపతి హోమం నిర్వహించారు. దంపతులు పీఠలపై కూర్చుని హోమాన్ని జరిపించారు. ఆలయ ఇన్చార్జ్ మాదాసు రాజు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించి, కృపకు పాత్రులు కావాలని ఆకాక్షించారు. గౌరవాధ్యక్షుడు మాదాసు సత్యనారాయణ, ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఉన్నారు.4
- వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన *దంతాలపల్లి ఎస్సై రవికుమార్ వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళనకి దిగారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణకేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారుఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్స్టేషన్కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు గూగులోత్ రూప్సింగ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.1
- మీ ఎముకలు అత్యంత వహిస్తే, గుల్లగా తయారవుతాయి. అరిగిపోతాయి జాగ్రత్త వహించండి.. ఇప్పటి నుండే మంచి ఆహారం తీసుకోండి1
- NRI ఇంట్లో చోరీకి వెళ్లి.. గ్రిల్స్లో చిక్కుకున్న దొంగ NRI ఇంట్లో చోరీకి వెళ్లి.. గ్రిల్స్లో చిక్కుకున్న దొంగ గుజరాత్లోని సూరత్లో జరిగిన అనూహ్య ఘటన రాజారాంనగర్ సొసైటీలోని ఓ ఎన్నారై ఇంట్లో చోరీ చేసేందుకు లోనికి చొరబడ్డ దొంగ అక్కడి నుంచి పారిపోయే క్రమంలో.. వెనుక వైపు ఏర్పాటు చేసిన గ్రిల్లో చిక్కుకున్నాడు అటు వెళ్లలేక, ఇటు రాలేక.. గ్రిల్స్లో చిక్కుకుపోయి ఆ దొంగ నానా తంటాలు పడ్డాడు ఇంతలో ఆ దొంగను గమనించిన స్థానికులు.. కర్రలు, రాళ్లతో అతనిని చితకబాదారు మరోవైపు.. ఇంట్లో ఎలాంటి సామాన్లు చోరీకి గురవ్వలేదని క్లారిటీ ఇచ్చిన ఇంటి ఓనర్.1