దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిస్కారం చేయాలి. RVP డిమాండ్. ఆదిలాబాద్ : దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇసాక్ అలీ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో దివ్యాంగులకు ఇచ్చిన హామీల ప్రకారం 6 వేల పెన్షన్, ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం పై అధికారులకు, దివ్యాంగులకు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి దివ్యాంగుల హక్కులు కాపాడాలన్నారు. స్త్రీ సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖ వేరు చేసి దివ్యాంగులకు న్యాయం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత దివ్యాంగులకు సైతం వారి పెన్షన్ బ్యాంకుల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. చేయుత పథకం కింద ఇస్తున్న కొత్త పెన్షన్స్ వికలాంగులకు వెంటనే విడుదల జెయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్ట్లు వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్స్ పోస్టుల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ పాటించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లలలో దివ్యాంగులకు 5% ఇండ్లు ఇవ్వాలన్నారు. అర్హులైన వారందరికీ రెట్రో ఫిట్టెడ్ వాహనాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రీయ వికలాంగ్ పార్టీ అడిగిన డిమాండ్స్ ల పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి వారి హక్కులను సాధించుకుంటామని పిలుపునిచ్చారు. ఇందులో మొహమ్మద్ ఇమ్రాన్, ఫైసల్ అహ్మద్, శివ కుమార్ నిర్మల్ జిల్లా ఇంచార్జి పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిస్కారం చేయాలి. RVP డిమాండ్. ఆదిలాబాద్ : దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇసాక్ అలీ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో దివ్యాంగులకు ఇచ్చిన హామీల ప్రకారం 6 వేల పెన్షన్, ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం పై అధికారులకు, దివ్యాంగులకు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి దివ్యాంగుల హక్కులు కాపాడాలన్నారు. స్త్రీ సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖ వేరు చేసి దివ్యాంగులకు న్యాయం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత దివ్యాంగులకు సైతం వారి పెన్షన్ బ్యాంకుల్లో
జమ అయ్యేలా చూడాలన్నారు. చేయుత పథకం కింద ఇస్తున్న కొత్త పెన్షన్స్ వికలాంగులకు వెంటనే విడుదల జెయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్ట్లు వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్స్ పోస్టుల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ పాటించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లలలో దివ్యాంగులకు 5% ఇండ్లు ఇవ్వాలన్నారు. అర్హులైన వారందరికీ రెట్రో ఫిట్టెడ్ వాహనాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రీయ వికలాంగ్ పార్టీ అడిగిన డిమాండ్స్ ల పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి వారి హక్కులను సాధించుకుంటామని పిలుపునిచ్చారు. ఇందులో మొహమ్మద్ ఇమ్రాన్, ఫైసల్ అహ్మద్, శివ కుమార్ నిర్మల్ జిల్లా ఇంచార్జి పాల్గొన్నారు.
- తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.1
- Post by Vishwamber Rao1
- Post by Vodnala thirupthi1
- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోసోమవారంఉదయం ఘనంగా బసవేశ్వర జయంతి సాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ జ్యొతి ప్రజ్వలన చేసికార్యక్రమాన్ని ప్రారంబించారు. బసవేశ్వరచిత్రపటానికి పూలమాల వేసిపూజలు చేశారు.కొబ్బరికాయ కోట్టారు పుష్పాలువేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో లింగాయతచ సమాజం గౌరవ అద్యక్షులుపి డి ఆనందం, జిల్లా అధ్యక్షులు లింగన్న గారిమల్లప్ప, ప్రధాన కార్యదర్శి వీరేశం, డిసిసి అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంతప్ప, మెదక్ మున్సపల్ కౌన్సిలర్లు లలిత విశ్వం, స్వరూప పంతులు మహలింగంతదితరులుపాల్గోన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులు వర్షం కురిసింది. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధమైంది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం, వడగళ్ల వాన ప్రజల్ని ఉక్కిరి బిక్కిరికి గురిచేసింది. జోరుగా కురిసిన వర్షం, పిడుగులతో ప్రజలు భయాందోళన చెందారు.1
- Post by Merugu Rajitha1
- బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... రైతులకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని, ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1
- గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.1