Shuru
Apke Nagar Ki App…
బ్యాంకు సేవలతో ప్రజలకు మేలు బ్యాంకు సేవలతో ప్రజలకు మేలు జరుగుతుంది దండేపల్లి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సిఎఫ్ఎల్ కౌన్సిలర్ వేల్పుల రవీందర్ అన్నారు. శనివారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం డ్వాక్రా మహిళలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు సేవింగ్స్, ఇన్సూరెన్స్, వాహనాలు, వ్యవసాయం రుణాలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy
బ్యాంకు సేవలతో ప్రజలకు మేలు బ్యాంకు సేవలతో ప్రజలకు మేలు జరుగుతుంది దండేపల్లి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సిఎఫ్ఎల్ కౌన్సిలర్ వేల్పుల రవీందర్ అన్నారు. శనివారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం డ్వాక్రా మహిళలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు సేవింగ్స్, ఇన్సూరెన్స్, వాహనాలు, వ్యవసాయం రుణాలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు టెన్త్ విద్యార్థులు చేరుకుంటున్నారు. అధికారుల సూచనల మేరకు శనివారం ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా తమ హాల్ టికెట్ నెంబర్లను సరిచూసుకొని వారి కేటాయించిన పరీక్ష గదులలోకి వెళ్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.1
- జగిత్యాల : 👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.1
- నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కె హరితకు వినతిపత్రం సమర్పించారు. సిఎస్సి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను రద్దు చేసి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, జీవో నెం.12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ క్లెయిమ్స్కు నిధులు విడుదల చేయాలని, లేబర్ కార్డుల రెన్యువల్ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ధర్నాలో యూనియన్ నాయకులు బాలకిషన్, ధర్మాయి రవి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.1
- पुलिस ने वारंगल SR नगर में अपनी पत्नी अनीता की हत्या करने वाले पति राजू को गिरफ्तार कर लिया है। राजू शराबी था और उसकी पत्नी अनीता के बीच अक्सर झगड़े होते रहते थे। इसी वजह से राजू ने अपनी पत्नी की हत्या कर दी। CI जवाजी सुरेश ने बताया कि मृतका की बहन सुनीता की शिकायत पर केस दर्ज किया गया और आरोपी को हिरासत में ले लिया गया है।1
- నేరడిగొండ మండలం వడ్డుర్ గ్రామంలో మైనారిటీ సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వీరితో పాటు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు మైనారిటీ సోదరులు తదితరులు ఉన్నారు..4
- Post by KR NEWS 3692
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.1
- ఆత్మవిశ్వాసంతో టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్షలు మైలురాయి వంటివి అన్నారు. భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా వెళ్లేందుకు టెన్త్ పరీక్షలు నిచ్చెనగా ఉపయోగపడతాయన్నారు. పిల్లల భవిష్యత్తును బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందన్నారు. పరీక్షలను కష్టంగా కాకుండా ఇష్టపడి బాగా రాస్తే మంచి ర్యాంకు సాధించడం ఖాయమన్నారు. శనివారం నుండి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.1