logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఆయన నూతన వస్త్రాలను అందజేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని సామ రుపేష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

2 hrs ago
user_Mallaiah Potta
Mallaiah Potta
ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
2 hrs ago
23ad8e7e-8912-4606-91ed-c7218accd57a

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఆయన నూతన వస్త్రాలను అందజేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని సామ రుపేష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

More news from Telangana and nearby areas
  • భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరడంతో దేశం ఆత్మనిర్భర రక్షణ తయారీ, సముద్ర భద్రత దిశగా మరో పెద్ద అడుగు వేసింది. అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ అయిన ఈ యుద్ధనౌక భారత్ యొక్క పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యానికి, ప్రపంచ రక్షణ రంగంలో బలపడుతున్న గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక యుద్ధనౌక తయారీలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించగా, దీని నిర్మాణంలో 200కు పైగా భారతీయ పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈల (MSMEs) భాగస్వామ్యం ఉంది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. బలమైన నౌకాదళం, సురక్షితమైన సముద్రం మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధన దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలిచింది.
    1
    భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరడంతో దేశం ఆత్మనిర్భర రక్షణ తయారీ, సముద్ర భద్రత దిశగా మరో పెద్ద అడుగు వేసింది. అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ అయిన ఈ యుద్ధనౌక భారత్ యొక్క పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యానికి, ప్రపంచ రక్షణ రంగంలో బలపడుతున్న గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక యుద్ధనౌక తయారీలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించగా, దీని నిర్మాణంలో 200కు పైగా భారతీయ పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈల (MSMEs) భాగస్వామ్యం ఉంది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తి రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. బలమైన నౌకాదళం, సురక్షితమైన సముద్రం మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధన దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలిచింది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    1 hr ago
  • ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కాలనీని ఎంచుకుని, సొసైటీ స్థాపకుడు ఇర్షాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తి చేయిస్తున్నారు. ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను పరిశీలించుకుని, అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇర్షాన్, ఫహీమ్, ఆఫ్రిన్, మహీం, రజాక్ తదితరులు పాల్గొంటున్నారు.
    1
    ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక కాలనీని ఎంచుకుని, సొసైటీ స్థాపకుడు ఇర్షాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తి చేయిస్తున్నారు.

ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను పరిశీలించుకుని, అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇర్షాన్, ఫహీమ్, ఆఫ్రిన్, మహీం, రజాక్ తదితరులు పాల్గొంటున్నారు.
    user_SIDDU.ASR
    SIDDU.ASR
    నిర్మల్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రధాన రాజగోపురం తొలగింపు పనులను ప్రారంభించగా, ప్రస్తుతం గర్భగుడి పరిసరాలు మరియు పాత గోపురాల కూల్చివేత పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు, సంప్రదాయ శిల్పకళకు అనుగుణంగా ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టడం విశేషం. ఈ నిర్మాణ పనుల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సూర్యమనేని సునంద్, పద్మ ప్రియ దంపతులు సుమారు 31 కోట్ల రూపాయలకు పైగా సొంత నిధులతో అమ్మవారి ఆలయ గర్భగుడి పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. గర్భగుడి నిర్మాణం పూర్తయిన తర్వాత, రెండవ విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు ₹225 కోట్ల నిధులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా బాసర క్షేత్రం మరింత అభివృద్ధి పథంలోకి అడుగులు వేయనుంది. ఈ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్ నిరంతరం అభివృద్ధి పనులను సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో అవసరమైన సూచనలు అందిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
    1
    తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రధాన రాజగోపురం తొలగింపు పనులను ప్రారంభించగా, ప్రస్తుతం గర్భగుడి పరిసరాలు మరియు పాత గోపురాల కూల్చివేత పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు, సంప్రదాయ శిల్పకళకు అనుగుణంగా ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టడం విశేషం. ఈ నిర్మాణ పనుల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన సూర్యమనేని సునంద్, పద్మ ప్రియ దంపతులు సుమారు 31 కోట్ల రూపాయలకు పైగా సొంత నిధులతో అమ్మవారి ఆలయ గర్భగుడి పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. గర్భగుడి నిర్మాణం పూర్తయిన తర్వాత, రెండవ విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు ₹225 కోట్ల నిధులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా బాసర క్షేత్రం మరింత అభివృద్ధి పథంలోకి అడుగులు వేయనుంది.

ఈ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్ నిరంతరం అభివృద్ధి పనులను సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో అవసరమైన సూచనలు అందిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    1
    జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    38 min ago
  • కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గత కొంతకాలంగా విధులు నిర్వహించి, ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్న ఎస్‌ఐ శ్రీ టీ. నరేష్, ఏఎస్‌ఐ శ్రీ రెనుకానందం మరియు మహిళా కానిస్టేబుల్ శ్రీమతి శ్రవంతి గార్లకు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని, బదిలీపై వెళ్తున్న అధికారులను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీ ఎ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న అధికారులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అప్పగించిన ప్రతి విధిని సమర్థవంతంగా, అంకితభావంతో నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత, క్రమశిక్షణ, తోటి సిబ్బందితో కలిసి మెలిసి పనిచేసిన తీరును ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు పలికి, వారు కొత్త విధి నిర్వహణ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన సేవా భావంతో ప్రజలకు సేవలందిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
    2
    కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గత కొంతకాలంగా విధులు నిర్వహించి, ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్న ఎస్‌ఐ శ్రీ టీ. నరేష్, ఏఎస్‌ఐ శ్రీ రెనుకానందం మరియు మహిళా కానిస్టేబుల్ శ్రీమతి శ్రవంతి గార్లకు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని, బదిలీపై వెళ్తున్న అధికారులను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీ ఎ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న అధికారులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అప్పగించిన ప్రతి విధిని సమర్థవంతంగా, అంకితభావంతో నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత, క్రమశిక్షణ, తోటి సిబ్బందితో కలిసి మెలిసి పనిచేసిన తీరును ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు పలికి, వారు కొత్త విధి నిర్వహణ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన సేవా భావంతో ప్రజలకు సేవలందిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    21 min ago
  • ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'లఖపతి దీదీ' చొరవ కింద గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాలలో (SHGs) భాగస్వాములవుతున్నారు. తద్వారా వారు సంవత్సరానికి రూ. 1 లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యాన్ని విజయవంతంగా సాధించి, తమ కలలకు కొత్త రెక్కలు తొడుగుతున్నారు. ఈ మహిళలు కేవలం తమ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చడమే కాకుండా, దేశంలో ఆత్మనిర్భర్ భారత్‌కు బలమైన పునాదిని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశ గ్రామాల మట్టి నుండి స్వావలంబన యొక్క సరికొత్త సువాసనలు వెదజల్లుతున్నాయి.
    1
    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'లఖపతి దీదీ' చొరవ కింద గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాలలో (SHGs) భాగస్వాములవుతున్నారు. తద్వారా వారు సంవత్సరానికి రూ. 1 లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యాన్ని విజయవంతంగా సాధించి, తమ కలలకు కొత్త రెక్కలు తొడుగుతున్నారు. ఈ మహిళలు కేవలం తమ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చడమే కాకుండా, దేశంలో ఆత్మనిర్భర్ భారత్‌కు బలమైన పునాదిని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశ గ్రామాల మట్టి నుండి స్వావలంబన యొక్క సరికొత్త సువాసనలు వెదజల్లుతున్నాయి.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.