చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి* నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని 9వ వార్డు బలరాం నగర్ కాలనీ చౌకధరల దుకాణం (రేషన్ షాప్) వద్ద మంగళవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక వార్డు కౌన్సిలర్ చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్ తో పాటుగా అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రతా కార్డులను స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ,వార్డులోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సమస్య తీరడం సంతోషకరమని అన్నారు. కార్డులు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వివరాలను లింక్ చేసుకుని, ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.తమకు రేషన్ కార్డులు అందేలా చొరవ చూపినందుకు కాలనీ మహిళలు, నిరుపేదలు కౌన్సిలర్కు అధికార ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ బలరాం నగర్ కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి* నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని 9వ వార్డు బలరాం నగర్ కాలనీ చౌకధరల దుకాణం (రేషన్ షాప్) వద్ద మంగళవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక వార్డు కౌన్సిలర్ చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్ తో పాటుగా అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రతా కార్డులను స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ,వార్డులోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సమస్య తీరడం సంతోషకరమని అన్నారు. కార్డులు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వివరాలను లింక్ చేసుకుని, ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.తమకు రేషన్ కార్డులు అందేలా చొరవ చూపినందుకు కాలనీ మహిళలు, నిరుపేదలు కౌన్సిలర్కు అధికార ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ బలరాం నగర్ కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.1
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- మంగంపేటలో సీసీ రోడ్డుకు ఎంపీ నిధులు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం మహమ్మదాబాద్: మండలంలోని మారుమూల ప్రాంతమైన మంగంపేట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటాయించిన నిధులతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న తండా ప్రజలకు ఊరట లభించింది.మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కృష్ణ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు రహదారి సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మంగంపేట తండా గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, రహదారి నిర్మాణానికి కృషి చేసిన బీజేపీ నాయకులకు గ్రామస్థులు, మహిళలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- బేగంపేట్ ప్రకాష్నగర్లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్లోని ప్రకాష్నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1
- హైదరాబాద్లో రౌడీ షీటర్ దారుణ హత్య.. నగరంలో భయాందోళనలు లైవ్ మర్డర్ వీడియో..! ప్రాణ స్నేహితుడినే హతమార్చిన రౌడీషీటర్ సెటిల్మెంట్ డబ్బుల వివాదమే హత్యకు కారణమా..? నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో నాగోల్ పోలీసుల గాలింపు హైదరాబాద్, సెప్టెంబర్ 15 హైదరాబాద్ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నహీమ్ బండ్లగూడలోని సహభావన అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. మూడు నెలలుగా వివాదం.. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా మహేష్, నహీమ్ మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు, ముఠా విభేదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరువురిపైనా గతంలో పలు హత్య కేసులు ఉన్నట్లు, ఇల్లెందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు నమోదైనట్లు సమాచారం. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ అండ్ టీం కోసం గాలింపు హత్య అనంతరం నిందితులు పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. హత్యకు అసలు కారణం, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో హత్యకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.1
- కాగజ్నగర్లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1