*దుమ్ము,ధూళి నుంచి అరుణ నగర్ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలి* _ఎమ్మెల్యే వసంత స్పందించాలి_ _3వ రోజు నిరసనలో పాల్గొని మద్దతు తెలిపిన సీపీఎం కొండపల్లి పట్టణ కార్యదర్శి యం మహేష్_ *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* కొండపల్లి మున్సిపాలిటీ 29వ వార్డు పరిధిలో అరుణానగర్ వాసులు గత 3 రోజుల నుంచి దుమ్ము ధూళి నుంచి అరుణ నగర్ కాలనీ వాసులను ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీవాసుల దగ్గరికి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు,వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ వి వెంకటరత్నం తో కలిసి కాలనీవాసులతో సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి సిపిఎం పట్టణ కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ అరుణ నగర్ దుమ్ము దూళి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని,క్వారీ,క్రషర్ లారీలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ లేఔట్ లోకి అనుమతి లేకుండా ఇతర వాహనాలను అనుమతి ఇవ్వకూడదని దీని వల్లనే అరుణ నగర్ లో దుమ్ము దూళి కి కారణమై ప్రజారోగ్యం దెబ్బతింటుందని లారీలు ఆపినందుకు క్వారీ,క్రషర్ యాజమాన్యాలు అరుణ నగర్ ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని క్వారీ,క్రషర్ యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు పి శేషగిరి జి రమణ బి నర్సయ్య ఎన్ నారాయణ పి సీతారామయ్య జి వెంకటేశ్వరరావు బి సాంబయ్య కే లక్ష్మీనారాయణ ఎస్ వెంకటేశ్వరావు కె బాలస్వామి పి సురేషు భూలక్ష్మి లక్ష్మీ రాధికా నందిని తదితరులు పాల్గొన్నారు.
*దుమ్ము,ధూళి నుంచి అరుణ నగర్ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలి* _ఎమ్మెల్యే వసంత స్పందించాలి_ _3వ రోజు నిరసనలో పాల్గొని మద్దతు తెలిపిన సీపీఎం కొండపల్లి పట్టణ కార్యదర్శి యం మహేష్_ *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* కొండపల్లి మున్సిపాలిటీ 29వ వార్డు పరిధిలో అరుణానగర్ వాసులు గత 3 రోజుల నుంచి దుమ్ము ధూళి నుంచి అరుణ నగర్ కాలనీ వాసులను ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీవాసుల దగ్గరికి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు,వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ వి వెంకటరత్నం తో కలిసి కాలనీవాసులతో సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి సిపిఎం పట్టణ కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ అరుణ నగర్ దుమ్ము దూళి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని,క్వారీ,క్రషర్ లారీలు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ లేఔట్ లోకి అనుమతి లేకుండా ఇతర వాహనాలను అనుమతి ఇవ్వకూడదని దీని వల్లనే అరుణ నగర్ లో దుమ్ము దూళి కి కారణమై ప్రజారోగ్యం దెబ్బతింటుందని లారీలు ఆపినందుకు క్వారీ,క్రషర్ యాజమాన్యాలు అరుణ నగర్ ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని క్వారీ,క్రషర్ యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు పి శేషగిరి జి రమణ బి నర్సయ్య ఎన్ నారాయణ పి సీతారామయ్య జి వెంకటేశ్వరరావు బి సాంబయ్య కే లక్ష్మీనారాయణ ఎస్ వెంకటేశ్వరావు కె బాలస్వామి పి సురేషు భూలక్ష్మి లక్ష్మీ రాధికా నందిని తదితరులు పాల్గొన్నారు.
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.* కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.3
- Post by ఉంగరాల కార్తీక్1
- *కొండపల్లి అరుణ నగర్ లో నిరసన* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* కొండపల్లిలోని అరుణ నగర్ కాలనీ వాసులు క్వారీ, క్రషర్ లారీల రాకపోకల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.లారీల వల్ల వెలువడే దుమ్ము, ధూళి కారణంగా నివాసం ఉండలేని పరిస్థితి నెలకొందని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, అధికారులు వెంటనే స్పందించి కాలనీలోకి లారీల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.1