logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం - జిల్లా అగ్నిమాపక అధికారి అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ ఆస్తి నష్టాల నివారణకు అగ్ని భద్రత నియమాలు పాటించడం తప్పనిసరి అని పార్వతీపురం మన్యం జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ పంగ సింహాచలము పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా పాలకొండ అగ్నిమాపక కేంద్రం పరిధిలోని విద్యాసంస్థలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్ల యజమానులతో స్థానిక సి.ఎల్. నాయుడు ఫంక్షన్ హాల్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అధికారి మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న గౌరవ స్వప్నిల్ పవర్, ఐఏఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.ఏప్రిల్ 15న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, ఏప్రిల్ 16: వీరఘట్టంలో మహిళలకు ఎల్పీజీ భద్రతపై అవగాహనఏప్రిల్ 17: సత్య సాయి పాఠశాలలో మాక్ డ్రిల్ ఏప్రిల్ 18: శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీలో భద్రతా తనిఖీఏప్రిల్ 19: వీరఘట్టం కరోసా ఆసుపత్రిలో అగ్ని భద్రతపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు.ప్రతి సంస్థలో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, అవి ఎల్లప్పుడూ పని చేసే స్థితిలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర సమయాల్లో పరికరాలను వినియోగించే విధానంపై సిబ్బందికి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, కేంద్ర సిబ్బంది మరియు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

11 hrs ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago
9b089b00-01f3-4a0f-9bf9-33a970362bf0

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం - జిల్లా అగ్నిమాపక అధికారి అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ ఆస్తి నష్టాల నివారణకు అగ్ని భద్రత నియమాలు పాటించడం తప్పనిసరి అని పార్వతీపురం మన్యం జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ పంగ సింహాచలము పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా పాలకొండ అగ్నిమాపక కేంద్రం పరిధిలోని విద్యాసంస్థలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్ల యజమానులతో స్థానిక సి.ఎల్. నాయుడు ఫంక్షన్ హాల్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అధికారి మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న గౌరవ స్వప్నిల్ పవర్, ఐఏఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.ఏప్రిల్ 15న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, ఏప్రిల్ 16: వీరఘట్టంలో మహిళలకు ఎల్పీజీ భద్రతపై అవగాహనఏప్రిల్ 17: సత్య సాయి పాఠశాలలో మాక్ డ్రిల్ ఏప్రిల్ 18: శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీలో భద్రతా తనిఖీఏప్రిల్ 19: వీరఘట్టం కరోసా ఆసుపత్రిలో అగ్ని భద్రతపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు.ప్రతి సంస్థలో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, అవి ఎల్లప్పుడూ పని చేసే స్థితిలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర సమయాల్లో పరికరాలను వినియోగించే విధానంపై సిబ్బందికి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, కేంద్ర సిబ్బంది మరియు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామపంచాయతీ సెలగ పేట జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కు సంతబొమ్మాలి మండలం మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలలో 25 సంవత్సరాలు యువకుడిలా రాష్ట్రం కోసం రాత్రి పగలు రోజుకి 20 గంటలు నిద్ర హారాలు మాని పనిచేస్తున్నారని నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రిని చూశానని ఈ కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న పరిపాలన ఎన్నడు జరగలేదని అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడుకి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ సహకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు రాష్ట్రానికి చల్లగా ఉండే రాష్ట్రం మరింత ప్రగతి పదములు నడవాలని చంద్రబాబు నాయుడుకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు భగవంతుడు కలిగించాలని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామపంచాయతీ సెలగ పేట జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కు సంతబొమ్మాలి మండలం మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలలో 25 సంవత్సరాలు యువకుడిలా రాష్ట్రం కోసం రాత్రి పగలు రోజుకి 20 గంటలు నిద్ర హారాలు మాని పనిచేస్తున్నారని నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రిని చూశానని ఈ కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న పరిపాలన ఎన్నడు జరగలేదని  అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడుకి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ సహకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు రాష్ట్రానికి చల్లగా ఉండే రాష్ట్రం మరింత ప్రగతి పదములు నడవాలని చంద్రబాబు నాయుడుకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు భగవంతుడు కలిగించాలని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**
    1
    **“Wish you a blessed Akshaya Tritiya ✨
May prosperity and positivity fill your life.
Choose comfort that stays with you every day.
MGM Vests – Wear Prosperity.”**
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...
    4
    విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది...
జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం.
ఘటన స్థలాలనికి చేరుకున్న  గాజువాక ఫైర్ ఇంజన్లు 
దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... 
యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... 
అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... 
గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో  మంటలు చెలరేగుతున్నాయి...
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    1
    రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం     దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    user_వంతల శేఖర్
    వంతల శేఖర్
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • manasuloni mata
    1
    manasuloni mata
    user_Chinni. P
    Chinni. P
    రాజవొమ్మంగి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    1
    జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమదాలవలస నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పెద్ద ఎత్తున ప్రజలకు ఉచిత భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవాభావాన్ని ప్రదర్శించారు. అన్న క్యాంటీన్‌కు వచ్చిన పేద ప్రజలు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు స్వయంగా ఆహారం అందించి వారి మనసులను గెలుచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నిల్చొని భోజనం చేశారు సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేయడం ద్వారా వారి అభిప్రాయాలు భోజనం నాణ్యత తెలుసుకున్నారు . ప్రజలతో మమేకమై మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ద్వారా నాయకత్వం యొక్క నిజమైన విలువ వెలుగుచూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.
    4
    శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమదాలవలస నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పెద్ద ఎత్తున ప్రజలకు ఉచిత భోజనం అందించారు.
ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవాభావాన్ని ప్రదర్శించారు. అన్న క్యాంటీన్‌కు వచ్చిన పేద ప్రజలు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు స్వయంగా ఆహారం అందించి వారి మనసులను గెలుచుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే  ప్రజలతో కలిసి నిల్చొని  భోజనం చేశారు సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేయడం ద్వారా వారి  అభిప్రాయాలు భోజనం నాణ్యత   తెలుసుకున్నారు . ప్రజలతో మమేకమై మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ద్వారా నాయకత్వం యొక్క నిజమైన విలువ వెలుగుచూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.