రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించడానికి పోలీస్ శాఖ సరికొత్త కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం అన్ని కమీషనరేట్లు, విభాగాలు, జిల్లాల ఎస్సై మరియు అంతకంటే పైస్థాయి అధికారులతో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నుండి సీపీ గౌష్ ఆలం కమీషనరేట్ అధికారులతో కలిసి ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సాంప్రదాయ నేరాల కంటే ప్రస్తుతం సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెను సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో దొంగతనాలు, దోపిడీల ద్వారా ₹500 కోట్లు నష్టం వాటిల్లితే, ఒక్క సైబర్ నేరాల ద్వారానే ఏకంగా ₹15 వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతీ విద్యాసంస్థలో తప్పనిసరిగా 'యాంటీ డ్రగ్ సేఫ్టీ కమిటీలు' ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు రోడ్ సేఫ్టీ బ్యూరో’తో పాటు, ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్ కోసం ‘విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్’ రాష్ట్రస్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ ప్రకటించారు. మహిళలు, పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ డీజీపీ కార్యాలయంలో టెక్ టీం ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నామని, సీసీటీఎన్ఎస్ (CCTNS) లో కేసుల డేటాను పూర్తిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దీనిపై టెక్నికల్ సర్వీసెస్ డీజీపీ వీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో డేటా నమోదు అత్యంత కీలకమని, ఇతర ప్రాంతాల నుండి వచ్చే ‘జీరో ఎఫ్ ఐ ఆర్’లను వెంటనే నమోదు చేయాలన్నారు. పోలీసింగ్ విధానంలో మార్పులు రావాలని, బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ను అవలంబిస్తూనే, నేరస్థులు, సంఘవిద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడి, క్రమశిక్షణతో, అంతర్గత సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. యూనిట్ అధికారులు నాయకుడిగా ముందుండి సిబ్బందిని నడిపించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కమీషనరేట్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి బాధితులు, కిందిస్థాయి సిబ్బంది నుండి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) మహేష్ భగవత్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్ స్కానర్లను విరివిగా ఉపయోగించాలని సూచించగా, సీఐడీ డీజీపీ చారు సిన్హా నెలవారీ నేర సమీక్షల డేటాను క్రోడీకరించి డీజీపీకి సమర్పిస్తామని తెలిపారు. ఐజీపీ (పర్సనల్) మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోయే నూతన హెల్త్ స్కీమ్ కొరకు సిబ్బంది వివరాలను త్వరితగతిన నమోదు చేయాలని కోరారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న అంశాలపై అప్రమత్తంగా ఉంటూనే, పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భూవివాదాల విషయంలో ఇరువర్గాల వాదనలు విని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించడానికి పోలీస్ శాఖ సరికొత్త కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం అన్ని కమీషనరేట్లు, విభాగాలు, జిల్లాల ఎస్సై మరియు అంతకంటే పైస్థాయి అధికారులతో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నుండి సీపీ గౌష్ ఆలం కమీషనరేట్ అధికారులతో కలిసి ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సాంప్రదాయ నేరాల కంటే ప్రస్తుతం సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెను సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో దొంగతనాలు, దోపిడీల ద్వారా ₹500 కోట్లు నష్టం వాటిల్లితే, ఒక్క సైబర్ నేరాల ద్వారానే ఏకంగా ₹15 వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని
పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతీ విద్యాసంస్థలో తప్పనిసరిగా 'యాంటీ డ్రగ్ సేఫ్టీ కమిటీలు' ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు రోడ్ సేఫ్టీ బ్యూరో’తో పాటు, ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్ కోసం ‘విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్’ రాష్ట్రస్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ ప్రకటించారు. మహిళలు, పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ డీజీపీ కార్యాలయంలో టెక్ టీం ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నామని, సీసీటీఎన్ఎస్ (CCTNS) లో కేసుల డేటాను పూర్తిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దీనిపై టెక్నికల్ సర్వీసెస్ డీజీపీ వీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..
రానున్న రోజుల్లో డేటా నమోదు అత్యంత కీలకమని, ఇతర ప్రాంతాల నుండి వచ్చే ‘జీరో ఎఫ్ ఐ ఆర్’లను వెంటనే నమోదు చేయాలన్నారు. పోలీసింగ్ విధానంలో మార్పులు రావాలని, బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ను అవలంబిస్తూనే, నేరస్థులు, సంఘవిద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడి, క్రమశిక్షణతో, అంతర్గత సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. యూనిట్ అధికారులు నాయకుడిగా ముందుండి సిబ్బందిని నడిపించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కమీషనరేట్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి బాధితులు, కిందిస్థాయి సిబ్బంది నుండి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) మహేష్ భగవత్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్ స్కానర్లను విరివిగా
ఉపయోగించాలని సూచించగా, సీఐడీ డీజీపీ చారు సిన్హా నెలవారీ నేర సమీక్షల డేటాను క్రోడీకరించి డీజీపీకి సమర్పిస్తామని తెలిపారు. ఐజీపీ (పర్సనల్) మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోయే నూతన హెల్త్ స్కీమ్ కొరకు సిబ్బంది వివరాలను త్వరితగతిన నమోదు చేయాలని కోరారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న అంశాలపై అప్రమత్తంగా ఉంటూనే, పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భూవివాదాల విషయంలో ఇరువర్గాల వాదనలు విని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో గల ఇల్లంతకుంట మండల కేంద్రంలో వీఓఏల (గ్రామ సంఘ సహాయకులు) సమ్మె నేటి శనివారం, 30/05/2026 నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కేంద్రంలోని వీఓఏలు బతుకమ్మలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వీఓఏల అధ్యక్షురాలు బాలలక్ష్మి, కార్యదర్శి బంగారు అంజలి, కోశాధికారి మహంకాళి ఉమారాణి పాల్గొన్నారు. వారితో పాటు వివిధ గ్రామాల నుండి రాణి, వినోద, దేవేంద్ర, లావణ్య, స్వప్న, రజిత, రాజశ్రీ, అంజలి, వనిత, జ్యోతి, వజ్రవ్వ, సంధ్య, రేణుక, నిర్మల, ఇందిరా, సంధ్య అరుణ, రాజశ్రీ, అనిత తదితర వీఓఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న 'ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ'ని తక్షణమే మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అకాడమీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా SFI కోరింది. ఈ మేరకు శనివారం SFI ఆధ్వర్యంలో రేకుర్తిలోని ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, అకాడమీల పేరుతో, కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మించి, ఒక లాడ్జి కింద రూములను అద్దెకు తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అపార్ట్మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ విద్యాధికారి ఇప్పటికైనా స్పందించి, జిల్లాలో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోసపూరిత అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని SFI కోరింది. అధికారులు ఇప్పటికీ స్పందించకపోతే, ఈ అకాడమీలపై ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని SFI హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి అసంపల్లి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సన్నీ, రాకేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.2
- భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ శనివారం రేకుర్తిలోని 'ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ' ముందు ధర్నా నిర్వహించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న ఈ అకాడమీని తక్షణమే మూసివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, అకాడమీల పేరుతో, కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మిస్తూ, ఒక లాడ్జి కింద రూములను అద్దెకు తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ సాగిస్తున్నారని ఆయన వివరించారు. అపార్ట్మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ విద్యాధికారి స్పందించి, జిల్లాలో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మోసపూరిత అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శ్రీకాంత్ అన్నారు. అధికారులు ఇప్పటికీ స్పందించకపోతే 'అకాడమీల అకాడమీ పైన' ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అసంపల్లి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సన్నీ, రాకేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.2
- లేబర్ కార్డు ఉన్న కార్మికులకు శుభవార్త అందుబాటులోకి వచ్చింది. భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం లేబర్ కార్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఈ పథకాల ద్వారా కార్మికులకు ప్రమాద బీమా కింద లక్షల రూపాయల ఆర్థిక భద్రత లభిస్తుంది. సహజ మరణం సంభవించినప్పుడు ఆర్థిక సహాయం, మహిళలకు ప్రసూతి సహాయం, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు, అలాగే పెళ్లి కానుకలు వంటి పలు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త సేవలను కూడా ప్రారంభించారు. అంతేకాకుండా, కార్మికుల కోసం ప్రత్యేకంగా 'లేబర్ అడ్డాలు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.1
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహిళా సంక్షేమ వారోత్సవాల కింద సిరిసిల్లలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహ (సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్ మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడో లేస్సెంట్) సంఘాల సభ్యులు ఈ మాక్ పార్లమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పాల్గొన్నారు. ఈ మాక్ పార్లమెంట్లో స్నేహ సంఘాల విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా ఏర్పడి, స్పీకర్ సమక్షంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికల హక్కులు, విద్య, వివిధ సామాజిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, అందరికీ ఆయా అంశాలపై అవగాహన కల్పించేలా చక్కగా వివరించారు. కార్యక్రమం ప్రారంభంలో జయ జయహే తెలంగాణ పాటను ఆలపించారు. అమ్మకు అక్షరమాల పథకం కింద చదువు నేర్చుకున్న వారిని ఈ సందర్భంగా సన్మానించారు. మాక్ పార్లమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతితో పాటు షీల్డును అందజేసి అభినందనలు తెలియజేశారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో వివోఏల (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) నిరవధిక సమ్మెకు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) నాయకులు సంఘీభావం తెలిపారు.1
- చెన్నూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదుట గోల్డ్ లోన్ ఖాతాదారులు శనివారం నిరాహార దీక్షకు దిగారు. బ్యాంకులో తాము తనఖా పెట్టిన బంగారం చోరీకి గురై నెలలు గడుస్తున్నా, అధికారులు తమ సొమ్మును తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఇప్పుడు నోటీసుల పేరిట తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలో పాల్గొన్న మహిళా ఖాతాదారులు, “మా బంగారం పోయి నష్టపోయింది మేము. పైగా మమ్మల్నే బెదిరిస్తున్నారు” అని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ బంగారాన్ని తక్షణమే ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.1
- కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం ఎదురుగా ఉన్న శ్రీ తిరుమల థియేటర్లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో థియేటర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 200 సీట్లు, ఫాల్ సీలింగ్, స్క్రీన్, సౌండ్ సిస్టమ్, ప్రొజెక్టర్ రూమ్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు థియేటర్ మేనేజింగ్ పార్టనర్ ఎం. మల్లేశం వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.4