చట్టి గ్రామపంచాయతీలో వారాంతపు పశువుల మరియు రోజువారి మార్కెట్ ఆసిల్ బహిరంగ వేలం పాటలు పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీలో సర్పంచ్ రవ్వ. భద్రమ్మ అధ్యక్షతన జరిగిన వారాంతపు పశువుల ( మేకల సంత పాట)వేలం పాటలో గ్రామపంచాయతీ వారి పాట 60 వేల రూపాయలతో మొదలు పాటలో పాల్గొన్న సభ్యుల ద్వారా సంవత్సరానికి మొత్తంగా 84,700 రూపాయలు చట్టి గ్రామానికి చెందిన రవ్వ వీరేంద్ర దక్కించుకున్నారు. అలాగే గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిరోజు వ్యాపార నిమిత్తం వచ్చు వాహనాలకు రోజువారి మార్కెట్ ఆసిల్ బహిరంగ వేలం పాట ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా పంచాయతీ వారి పాట 20వేల రూపాయలుగా నిర్ణయించగా పాటలో పాల్గొన్న సభ్యుల ద్వారా సంవత్సరానికి 50వేల రూపాయలుగా గ్రామానికి చెందిన తుర్రం. నీలయ్య వేలంపాటను ధకి చుకున్నారు ఈ కార్యక్రమంలో చింతూరు డిప్యూటీ ఎంపీడీవో శ్రీ ఆర్. వీర్రాజు చట్టి గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీ షేక్ మహమ్మద్ అలీ పెసా కమిటీ సభ్యులు తుర్రం. చిన్న ముత్తయ్య, పొడియం.రామకృష్ణ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.
చట్టి గ్రామపంచాయతీలో వారాంతపు పశువుల మరియు రోజువారి మార్కెట్ ఆసిల్ బహిరంగ వేలం పాటలు పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీలో సర్పంచ్ రవ్వ. భద్రమ్మ అధ్యక్షతన జరిగిన వారాంతపు పశువుల ( మేకల సంత పాట)వేలం పాటలో గ్రామపంచాయతీ వారి పాట 60 వేల రూపాయలతో మొదలు పాటలో పాల్గొన్న సభ్యుల ద్వారా సంవత్సరానికి మొత్తంగా 84,700 రూపాయలు చట్టి గ్రామానికి చెందిన రవ్వ వీరేంద్ర దక్కించుకున్నారు. అలాగే గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిరోజు వ్యాపార నిమిత్తం వచ్చు వాహనాలకు రోజువారి మార్కెట్ ఆసిల్ బహిరంగ వేలం పాట ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా పంచాయతీ వారి పాట 20వేల రూపాయలుగా నిర్ణయించగా పాటలో పాల్గొన్న సభ్యుల ద్వారా సంవత్సరానికి 50వేల రూపాయలుగా గ్రామానికి చెందిన తుర్రం. నీలయ్య వేలంపాటను ధకి చుకున్నారు ఈ కార్యక్రమంలో చింతూరు డిప్యూటీ ఎంపీడీవో శ్రీ ఆర్. వీర్రాజు చట్టి గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీ షేక్ మహమ్మద్ అలీ పెసా కమిటీ సభ్యులు తుర్రం. చిన్న ముత్తయ్య, పొడియం.రామకృష్ణ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.1
- Post by Shyam1
- శాసనమండలి శాసనసభ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా హైదరాబాదులో జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నా అభినయంతో ఆటపాటలతో ఆకట్టుకున్నారు ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు పాటకు శోభన్ బాబును అనుకరిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎమ్మెల్యే స్టెప్పులను చూసిన ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు1
- గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.1
- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- 30/03/2026 కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్.. రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు.. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు.. నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు.. రామప్ప - రంగాయి చెరువు - పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు.. రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 TMC నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తి చేసాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 2ఏండ్లు పూర్తి ఐనా నేటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు.. గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది.. సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది. తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు 32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది రీ డిజైన్ చేసి ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము 87శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు... ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి ... దొంతి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి 40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి, నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది... దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు , ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ, అనుమతులు తెచ్చే పరిస్థితి లేదు, రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువనిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.. కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు.. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది. నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం.. లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది.. తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి.. ఈ నిరసన ఆరంభం మాత్రమే.. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం.. నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.. నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి.. నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త రూపంలో3
- కొత్తగూడెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగించాలని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ గ్రీవెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు జాతీయ ప్రధాన రహదారుల సెంటర్ పోల్స్ కు అడ్డగోలుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణం అవుతున్న ఫ్లెక్సీ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని,విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మూలంగా పర్యావరణానికి హాని కలిగించే విధంగా వారి చర్యలు ఉన్నాయన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని వివిధ మండలాలలో ఏ విధమైన అనుమతులు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేసినా సంబంధిత మున్సిపల్ మరియు పంచాయితీ సిబ్బంది చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఏ విధమైన అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సదరు ప్లెక్సీ ప్రింటింగ్ యజమానులపై చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని కోరారు.గతంలో ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుదీప్ జిల్లా అంతటా ఫ్లెక్సీ హోర్డింగ్ లను తొలగించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.తక్షణమే స్పందించి కొత్తగూడెం కార్పొరేషన్ మరియు జిల్లాలోని వివిధ మండలాలలో పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్లాస్టిక్ తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని అనుమతులకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.1