logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు : డిఇఓ రాజు కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు : డిఇఓ రాజు కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కలియుగ ది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల ఆధ్వర్యంలో పల్లెకిసేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు పల్లకిని మోస్తూ ఐదు ప్రదిక్షణాలు చేశారు. అరేయ్ పూజారి నరేంద్ర శర్మ భక్తుల పేర్ల గోత్రనామాలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధు తీర్థప్రసాద విథరణ గావించారు.
    1
    కలియుగ ది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల ఆధ్వర్యంలో పల్లెకిసేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు పల్లకిని మోస్తూ ఐదు ప్రదిక్షణాలు చేశారు. అరేయ్ పూజారి నరేంద్ర శర్మ భక్తుల పేర్ల గోత్రనామాలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధు తీర్థప్రసాద విథరణ గావించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    1
    మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం  మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల  బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా శివంపేట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు భారీగా చేరుకున్నారు. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులు సెంటర్‌కు చేరుకుని హాల్ టికెట్లు తనిఖీ చేయించుకున్నారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రం పరిసరాలు రద్దీగా మారాయి. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    1
    పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా శివంపేట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు భారీగా చేరుకున్నారు. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులు సెంటర్‌కు చేరుకుని హాల్ టికెట్లు తనిఖీ చేయించుకున్నారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రం పరిసరాలు రద్దీగా మారాయి. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.
    2
    గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Solanke Ravi
    3
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • నాగారం డివిజన్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    3
    నాగారం డివిజన్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నర్సరీ పనులను పరిశీలించిన డీఎల్పీఓ, జుక్కల్ ఉపాధి హామీ నర్సరీని జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్ శనివారం సందర్శించి, సాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా నర్సరీలోని మొక్కలు, నారుమడులను ప్రతిరోజూ నీటితో సంరక్షించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మారుతికి సూచించారు. కూలీల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నర్సరీ పనులను పరిశీలించిన డీఎల్పీఓ, జుక్కల్ ఉపాధి హామీ నర్సరీని జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్ శనివారం సందర్శించి, సాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా నర్సరీలోని మొక్కలు, నారుమడులను ప్రతిరోజూ నీటితో సంరక్షించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మారుతికి సూచించారు. కూలీల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    1
    పదవ తరగతి పరీక్ష కేంద్రాలను
క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం సమీపంలోని చాకరిమెట్లలో ఉన్న శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నర్సాపూర్–తూప్రాన్ రహదారి మార్గంలో అడవి మధ్యలో కొలువై ఉన్న ఈ ఆలయానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
    1
    శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం సమీపంలోని చాకరిమెట్లలో ఉన్న శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నర్సాపూర్–తూప్రాన్ రహదారి మార్గంలో అడవి మధ్యలో కొలువై ఉన్న ఈ ఆలయానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.