సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వినుకొండ స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినుకొండ పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా, పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. సీఎం వినుకొండ విచ్చేస్తున్న సందర్భంగా నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రజా వేదిక కార్యక్రమానికి అవసరమైన అన్ని సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలు సమర్థవంతంగా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీఎం వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించనున్నారని, ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఏరియా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన, ఆర్డీవో మధులత, మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి షకీలా, ఆర్టీసీ, పోలీసు, మున్సిపల్, మెడికల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వినుకొండ స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినుకొండ పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా, పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. సీఎం వినుకొండ విచ్చేస్తున్న సందర్భంగా నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రజా వేదిక కార్యక్రమానికి అవసరమైన అన్ని సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలు సమర్థవంతంగా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీఎం వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించనున్నారని, ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఏరియా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన, ఆర్డీవో మధులత, మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి షకీలా, ఆర్టీసీ, పోలీసు, మున్సిపల్, మెడికల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు
- Post by ఉంగరాల కార్తీక్1
- *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.* కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో రోడ్డుకి ప్రక్కల ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకున్న వారి ఆక్రమణలను మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజామున సిబ్బందితో కలిసి తొలగించారు. ఫుట్పాత్ ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని వెంటనే తొలగించేశారు.1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి.కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించగా, 5 భారతీయ జనతా పార్టీ,మూడు బి ఆర్ ఎస్,ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోడెల లలిత గణేష్ యాదవ్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 14 కు చేరుకుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ రిజర్వ్ జనరల్ మహిళ రావడంతో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సతీమణి రత్నమాల చైర్ పర్సన్ గా,వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు.1
- తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.1
- Post by ఉంగరాల కార్తీక్1