logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సంతబొమ్మాలి మండలం తీరప్రాంత గ్రామమైన జగన్నాధపురంలో పార్క్ పేరుతో తన జీడి చెట్లను టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పుక్కళ్ల శ్రీనివాసరావు ధ్వంసం చేయించారని అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత కోడ షణ్ముఖరావు ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంతంలో గ్రామస్తులందరితో పాటు తన ఆధీనంలో ఉన్న సుమారు 30 సెంట్ల అటవీ భూమిలో 2004 నుండి ఆయన జీడి చెట్లను సాగు చేసుకుంటున్నారు. అయితే, ఒకే పార్టీలో ఉంటూ, 15 సంవత్సరాలుగా సర్పంచ్ గా పనిచేసిన పుక్కల్ల శ్రీనివాసరావుతో తనకు ఏర్పడిన రాజకీయ వైరం కారణంగానే తనపై ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని షణ్ముఖరావు ఆరోపించారు. తాము ఎవరూ లేని సమయంలో అటవీ శాఖ అనుమతి లేకుండా, పొక్లైన్‌తో తన ఆధీనంలోని భూమిలోని జీడి చెట్లను తొలగించి మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారని షణ్ముఖరావు పేర్కొన్నారు. దీనిపై శనివారం జిల్లా అటవీశాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు సొంత పార్టీ నేతలపైనే మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు కక్ష సాధించడం ఎంతవరకు సమంజసమని షణ్ముఖరావు, ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తూ, పార్టీ పెద్దలు దీనిని పరిశీలించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

1 hr ago
user_Karri Sankara Reddy
Karri Sankara Reddy
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
dec2b1e1-eeee-4861-a34a-038e5a6ac381

సంతబొమ్మాలి మండలం తీరప్రాంత గ్రామమైన జగన్నాధపురంలో పార్క్ పేరుతో తన జీడి చెట్లను టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పుక్కళ్ల శ్రీనివాసరావు ధ్వంసం చేయించారని అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత కోడ షణ్ముఖరావు ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంతంలో గ్రామస్తులందరితో పాటు తన ఆధీనంలో ఉన్న సుమారు 30 సెంట్ల అటవీ భూమిలో 2004 నుండి ఆయన జీడి చెట్లను సాగు చేసుకుంటున్నారు. అయితే, ఒకే పార్టీలో ఉంటూ, 15 సంవత్సరాలుగా సర్పంచ్ గా పనిచేసిన పుక్కల్ల శ్రీనివాసరావుతో తనకు ఏర్పడిన రాజకీయ వైరం కారణంగానే తనపై

6472a473-17cc-406e-b443-1814d8ac70ee

ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని షణ్ముఖరావు ఆరోపించారు. తాము ఎవరూ లేని సమయంలో అటవీ శాఖ అనుమతి లేకుండా, పొక్లైన్‌తో తన ఆధీనంలోని భూమిలోని జీడి చెట్లను తొలగించి మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారని షణ్ముఖరావు పేర్కొన్నారు. దీనిపై శనివారం జిల్లా అటవీశాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు సొంత పార్టీ నేతలపైనే మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు కక్ష సాధించడం ఎంతవరకు సమంజసమని షణ్ముఖరావు, ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తూ, పార్టీ పెద్దలు దీనిని పరిశీలించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పలాస నియోజకవర్గంలో జనసేన కార్యకర్తపై జరిగిన దాడి ఘటన తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై జనసేన నాయకులు, ముఖ్య కార్యకర్తలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ సంయమనం పాటిస్తున్న తమను బలహీనంగా చూడటం ప్రమాదకరమని, ఆధిపత్య ప్రదర్శనలు సహించేది లేదని జనసేన నాయకులు హెచ్చరించారు. గతంలో స్థానిక టీడీపీ నాయకుడిపై దాడి జరిగినప్పుడు మానవత్వంతో అండగా నిలిచిన జనసేన కార్యకర్తలపైనే ఇప్పుడు దాడులకు దిగడం రాజకీయ విలువలను అవమానించడమేనని సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా పలాసలో లిక్కర్ సిండికేట్, అక్రమ మట్టి, కంకర తవ్వకాలు మరియు భూ అక్రమాలపై జనసేన నాయకులు ప్రశ్నిస్తుండటంతోనే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక కూటమి భాగస్వామ్య పార్టీ నాయకుడిపై దాడి జరిగినా స్థానిక ఎమ్మెల్యే మౌనంగా ఉండటం విచారకరమని, పోలీసు వ్యవస్థ సమర్థంగా స్పందించకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులపై మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి మరియు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. సంయమనాన్ని బలహీనతగా భావించి అహంకారంతో దాడులకు పాల్పడితే, 2029 ఎన్నికల్లో పలాస ప్రజలే తుది తీర్పు చెబుతారని జనసైనికులు హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    2
    పలాస నియోజకవర్గంలో జనసేన కార్యకర్తపై జరిగిన దాడి ఘటన తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై జనసేన నాయకులు, ముఖ్య కార్యకర్తలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ సంయమనం పాటిస్తున్న తమను బలహీనంగా చూడటం ప్రమాదకరమని, ఆధిపత్య ప్రదర్శనలు సహించేది లేదని జనసేన నాయకులు హెచ్చరించారు.

గతంలో స్థానిక టీడీపీ నాయకుడిపై దాడి జరిగినప్పుడు మానవత్వంతో అండగా నిలిచిన జనసేన కార్యకర్తలపైనే ఇప్పుడు దాడులకు దిగడం రాజకీయ విలువలను అవమానించడమేనని సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యంగా పలాసలో లిక్కర్ సిండికేట్, అక్రమ మట్టి, కంకర తవ్వకాలు మరియు భూ అక్రమాలపై జనసేన నాయకులు ప్రశ్నిస్తుండటంతోనే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక కూటమి భాగస్వామ్య పార్టీ నాయకుడిపై దాడి జరిగినా స్థానిక ఎమ్మెల్యే మౌనంగా ఉండటం విచారకరమని, పోలీసు వ్యవస్థ సమర్థంగా స్పందించకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ పరిస్థితులపై మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి మరియు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. సంయమనాన్ని బలహీనతగా భావించి అహంకారంతో దాడులకు పాల్పడితే, 2029 ఎన్నికల్లో పలాస ప్రజలే తుది తీర్పు చెబుతారని జనసైనికులు హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ratnala Ramesh
    Ratnala Ramesh
    Teacher పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని సచివాలయం వద్ద సీపీఎం పార్టీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే మరో నెల రోజుల పాటు పొడిగించాలని, అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, సిబ్బంది కొరత మరియు అధికారులపై ఉన్న పని ఒత్తిడి కారణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం మరియు రైతులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడం వల్ల వెరిఫికేషన్ ఫారాలు సకాలంలో అందడం లేదని, దీనివల్ల బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 78 శాతం మ్యాపింగ్ మాత్రమే పూర్తయిందని, వలస వెళ్లిన ఓటర్లు మరియు కొత్తగా వివాహమైన మహిళలు ధ్రువపత్రాలు సమర్పించడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో, గడువు పొడిగించని పక్షంలో జిల్లాలో లక్షన్నర నుండి రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కొమరాడ మండల సచివాలయంలో 11 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారని, ఇంజినీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీసు, సర్వేయర్, ఏఎన్‌ఎం వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పనితీరుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి గడువును పెంచాలని సీపీఎం కోరింది.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని సచివాలయం వద్ద సీపీఎం పార్టీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే మరో నెల రోజుల పాటు పొడిగించాలని, అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, సిబ్బంది కొరత మరియు అధికారులపై ఉన్న పని ఒత్తిడి కారణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం మరియు రైతులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడం వల్ల వెరిఫికేషన్ ఫారాలు సకాలంలో అందడం లేదని, దీనివల్ల బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 78 శాతం మ్యాపింగ్ మాత్రమే పూర్తయిందని, వలస వెళ్లిన ఓటర్లు మరియు కొత్తగా వివాహమైన మహిళలు ధ్రువపత్రాలు సమర్పించడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.

ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో, గడువు పొడిగించని పక్షంలో జిల్లాలో లక్షన్నర నుండి రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కొమరాడ మండల సచివాలయంలో 11 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారని, ఇంజినీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీసు, సర్వేయర్, ఏఎన్‌ఎం వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పనితీరుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి గడువును పెంచాలని సీపీఎం కోరింది.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చట్టాలను, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రశ్న రావణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా మద్దతు పలకడం బాధాకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టం ముందు అందరూ సమానమేనని మరియు ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో న్యాయ ప్రక్రియలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఎంతైనా ఉందని ఆయన గుర్తుచేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి చట్టపరమైన అంశాలకు రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అప్పలనాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, చట్టాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విచారణ సంస్థలు తమ విధులను ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులను కాపాడేందుకు చట్టాలను విమర్శించడం ఎంతమాత్రం సరికాదని, ప్రజలు ఈ వాస్తవాలను గుర్తించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.
    1
    చట్టాలను, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రశ్న రావణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా మద్దతు పలకడం బాధాకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టం ముందు అందరూ సమానమేనని మరియు ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో న్యాయ ప్రక్రియలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఎంతైనా ఉందని ఆయన గుర్తుచేశారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి చట్టపరమైన అంశాలకు రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అప్పలనాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, చట్టాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విచారణ సంస్థలు తమ విధులను ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులను కాపాడేందుకు చట్టాలను విమర్శించడం ఎంతమాత్రం సరికాదని, ప్రజలు ఈ వాస్తవాలను గుర్తించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    4 hrs ago
  • రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు జాతీయ రహదారిపై సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (CSDT) అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం పట్టుబడింది. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 6,080 కిలోల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తనిఖీ చేసిన AP 39 UE సిరీస్ ఐసర్ వ్యాన్‌లో ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. ఘటన సమయంలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ వ్యాన్ గొల్లప్రోలుకు చెందిన ఆకుల రవికి చెందినదిగా నిర్ధారించారు. నిందితులపై 6A మరియు 7(1) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బియ్యం ఎక్కడి నుండి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది మరియు రవాణా ఉద్దేశం ఏమిటనే అంశాలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
    3
    రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు జాతీయ రహదారిపై సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (CSDT) అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం పట్టుబడింది. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 6,080 కిలోల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు తనిఖీ చేసిన AP 39 UE సిరీస్ ఐసర్ వ్యాన్‌లో ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. ఘటన సమయంలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ వ్యాన్ గొల్లప్రోలుకు చెందిన ఆకుల రవికి చెందినదిగా నిర్ధారించారు. నిందితులపై 6A మరియు 7(1) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ బియ్యం ఎక్కడి నుండి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది మరియు రవాణా ఉద్దేశం ఏమిటనే అంశాలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని, ఆ పార్టీకి 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా కనీసం 7 స్థానాలు కూడా రావని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించి, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం పక్కా అని ధీమా వ్యక్తమవుతోంది.
    1
    తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని, ఆ పార్టీకి 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా కనీసం 7 స్థానాలు కూడా రావని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించి, మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం పక్కా అని ధీమా వ్యక్తమవుతోంది.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా పలాసలో విధి నిర్వహణలో ఉన్న బీఆర్‌కే న్యూస్ రిపోర్టర్ యవ్వారీ తిరుమలపై దాడి జరిగింది. గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో పలాస సమీపంలోని గరుడుకండి వద్ద పెట్రోల్ బంక్ వెనుక ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో జర్నలిస్ట్ అక్కడికి చేరుకున్నారు. వీడియో చిత్రీకరిస్తుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి, ఆ తవ్వకాలు టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజుకు సంబంధించినవని పేర్కొన్నట్లు బాధితుడు తెలిపారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, బూర్లె యోగేశ్వర్ మరియు మరికొందరు తనపై, తనతో ఉన్న జనసేన నాయకుడు ప్రదీప్‌పై దాడి చేశారని జర్నలిస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు తమ స్కూటీని కిందకు తోసేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడు 112 అత్యవసర సేవలకు సమాచారం అందించి, ఆపై పలాస-కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.రామకృష్ణకు అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేసి, జర్నలిస్టుల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.
    2
    శ్రీకాకుళం జిల్లా పలాసలో విధి నిర్వహణలో ఉన్న బీఆర్‌కే న్యూస్ రిపోర్టర్ యవ్వారీ తిరుమలపై దాడి జరిగింది. గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో పలాస సమీపంలోని గరుడుకండి వద్ద పెట్రోల్ బంక్ వెనుక ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో జర్నలిస్ట్ అక్కడికి చేరుకున్నారు. వీడియో చిత్రీకరిస్తుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి, ఆ తవ్వకాలు టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజుకు సంబంధించినవని పేర్కొన్నట్లు బాధితుడు తెలిపారు.

కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, బూర్లె యోగేశ్వర్ మరియు మరికొందరు తనపై, తనతో ఉన్న జనసేన నాయకుడు ప్రదీప్‌పై దాడి చేశారని జర్నలిస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు తమ స్కూటీని కిందకు తోసేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడు 112 అత్యవసర సేవలకు సమాచారం అందించి, ఆపై పలాస-కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.రామకృష్ణకు అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేసి, జర్నలిస్టుల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.
    user_Ratnala Ramesh
    Ratnala Ramesh
    Teacher పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • విజయనగరం జిల్లా రాజాం మండలం డోలపేటలోని జడ్పీ హైస్కూల్ (ZPHS)లో శుక్రవారం ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌పై దాడి జరిగింది. పాఠశాల గేటు వద్ద ఉదయం ప్రార్థన జరుగుతున్న సమయంలో, అదే పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలి కుమారుడు తన కారును అడ్డుగా నిలిపివేశాడు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన మరో ఉపాధ్యాయురాలు కారును తీసివేయాలని కోరగా, ఆమెపై సదరు వ్యక్తి దుర్భాషలాడాడు. ఈ క్రమంలో వేణుగోపాల్ జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఉపాధ్యాయురాలి భర్త అయిన కానిస్టేబుల్ మరియు ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి వేణుగోపాల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    విజయనగరం జిల్లా రాజాం మండలం డోలపేటలోని జడ్పీ హైస్కూల్ (ZPHS)లో శుక్రవారం ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌పై దాడి జరిగింది. పాఠశాల గేటు వద్ద ఉదయం ప్రార్థన జరుగుతున్న సమయంలో, అదే పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలి కుమారుడు తన కారును అడ్డుగా నిలిపివేశాడు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన మరో ఉపాధ్యాయురాలు కారును తీసివేయాలని కోరగా, ఆమెపై సదరు వ్యక్తి దుర్భాషలాడాడు.

ఈ క్రమంలో వేణుగోపాల్ జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఉపాధ్యాయురాలి భర్త అయిన కానిస్టేబుల్ మరియు ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి వేణుగోపాల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.