logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

-ముఖీం అనుచ‌రుల‌ చేతిలో.. -మోస‌పోయాం.. మాకు న్యాయం చేయండి -హైడ్రా ప్ర‌జావాణిలో ఐలాపూర్ పేద‌ల వేడుకోలు ఒక‌రా ఇద్ద‌రా.. అంద‌రూ ముఖీం అనుచ‌రులే.. ముఖీం పెద్ద లాయ‌ర్ మా వెంట ఉన్నారు.. మీకేం కాదు.. మేం చూసుకుంటాం.. అని న‌మ్మ‌బ‌లికి మాకు 70 గజాల చొప్పున ప్లాట్లు అమ్మేశారు. ప్ర‌భుత్వ భూమి అని మాకు తెలియ‌దు.. అంద‌రూ కొనుక్కుంటున్నారు.. అలాగే మేమూ కొనుక్కున్నాం.. ఇప్పుడు వారిని అడిగితే మాకేమి తెలీదు.. ఖాళీ జాగా ఉంచొద్దు.. వెంట‌నే ఇల్లు క‌ట్టుకోండి అని చెబితే మీరు విన‌లేద‌ని తిరిగి మ‌మ్మ‌ల‌నే ద‌బాయిస్తున్నారు. మా డ‌బ్బులు మాకిచ్చేయండి అంటే.. అవెప్పుడో ఎవ‌రి వాటాలు వారికి వెళ్లిపోయాయి.. మా ద‌గ్గ‌ర లేవ‌ని దాటేస్తున్నారు. మా నోట‌రీలు.. అగ్రిమెంట్లు చూసి ప్ర‌భుత్వ‌మే మాకు న్యాయం చేయాలి..అంటూ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మండలం ఐలాపూర్ గ్రామం, తండా నుంచి వంద‌లాది మంది పేదలు సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి వ‌చ్చి ఫిర్యాదు చేశారు. కురుమ మ‌ళ్లేష్‌, మాణిక్ యాద‌వ్‌, ర‌వి నాయ‌క్‌, రామ‌చంద్ర నాయ‌క్ త‌దిత‌రులు ముఖీం అనుచ‌రులుగా వేర్వేరు పేర్ల‌తో అగ్రిమెంట్లు, నోట‌రీలు చేసి అమ్మారంటూ పేర్కొన్నారు. కూలీ డ‌బ్బులు చిట్టీలు వేసుకుని.. ఊళ్ల‌లో ఉన్న కాస్త పొలం అమ్ముకుని.. నానా అవ‌స్థ‌లు ప‌డి ప్లాట్లు కొనుక్కొన్నాం. ఇప్పుడెవ‌రూ ప‌ల‌క‌డంలేదు.. ప్ర‌భుత్వ‌మే న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. వీటికి తోడు.. న‌గ‌రంలో ప్ర‌భుత్వ భూములు, యూఎల్‌సీ ల్యాండ్స్‌, అసైన్డ్ భూములు క‌బ్జాల‌కు గురౌతున్నాయ‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఔట‌ర్ రింగురోడ్డు నిర్మాణంలో సేక‌రించిన అసైన్డ్ భూముల్లో మ‌ట్టిని అమ్ముకున్న‌వారే.. ఇప్పుడు ఆ భూముల‌ను కూడా క‌బ్జా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని దుండిగ‌ల్ గ్రామ నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ భూములు అసైనీల‌కు ద‌క్కాలి.. లేదంటే ప్ర‌భుత్వానికి ఉండాలి కాని మ‌ధ్య‌లో క‌బ్జాదారుల పాల‌వ్వ‌కుండా చూడాల‌ని కోరారు. -బ్లూసీ వెనుక ఉన్న 2 ఎక‌రాల‌ను కాపాడండి.. 🔷సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోని బ్లూసీ హోట‌ల్ వెనుక ఉన్న 2 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తు అంద‌జేశారు. ప్ర‌భుత్వ భూమిని కొట్టేయాల‌ని అక్క‌డివారు కేసులు ఒక‌రిపై ఒక‌రు వేసుకుని న‌డిపిస్తున్నార‌ని.. ఈ విష‌యంలో హైడ్రా చొర‌వ తీసుకుని కాపాడాల‌న్నారు. కిక్కిరిసిన జ‌నాభా ఉన్న ఈ ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేయాల‌ని కోరారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి విలేజ్ స‌ర్వే నంబ‌రు 54లో 2 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని.., రంగారెడ్డి జిల్లా శేరిలింగంప్లి మండ‌లం, మియాపూర్ గ్రామంలోని స‌ర్వే నంబ‌రు 100, 101లో ఎక‌రా ప్ర‌భుత్వ భూమి ఉంటే స్థానికంగా ఉన్న వారు క‌బ్జా చేస్తున్నార‌ని శ్రీ శ‌క్తి మ‌హిళామండ‌లి ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. సికింద్ర‌బాద్ బేగంపేట‌లోని బ్రాహ్మ‌ణ‌వాడి స‌ర్వే నంబ‌రు 210లో 3 వేల గ‌జాల స్థ‌లం ప్ర‌భుత్వానిది కాగా.. క‌బ్జాలు జ‌రుగుతున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైదాబాద్లోని ఫిష్ మార్క‌ట్ వ‌ద్ద ఓపెన్ ప్లేస్ 4083 గ‌జాలుంటే.. దానిని పిల్ల‌ల‌కోసం పార్కును అభివృద్ధి చేయాల‌ని మేమంతా జీహెచ్ ఎంసీని కోరుతుంటే.. మ‌ధ్య‌లో వేరే వ్య‌క్తులు వ‌చ్చి క‌బ్జాలు చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ‌దంటే త‌మ‌ద‌ని ఇద్ద‌రు వ్య‌క్తులుప్ర‌భుత్వ భూమిపై కోర్టుకెక్క‌డం.. వాళ్లలో ఎవ‌రో ఒక‌రు సొంతం చేసుకుంటున్నార‌ని.. రెవెన్యూ, జీహెచ్ ఎంసీకి కూడా ఫిర్యాదు చేశామ‌ని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణి కి మొత్తం 52 ఫిర్యాదులు రాగా హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు వాటిని ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. ప‌త్రాల‌ను ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు

2 hrs ago
user_LOKESH DUVVURU
LOKESH DUVVURU
కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
2 hrs ago
6bb1d682-4f25-4a20-a21d-ab6e0e08d51c

-ముఖీం అనుచ‌రుల‌ చేతిలో.. -మోస‌పోయాం.. మాకు న్యాయం చేయండి -హైడ్రా ప్ర‌జావాణిలో ఐలాపూర్ పేద‌ల వేడుకోలు ఒక‌రా ఇద్ద‌రా.. అంద‌రూ ముఖీం అనుచ‌రులే.. ముఖీం పెద్ద లాయ‌ర్ మా వెంట ఉన్నారు.. మీకేం కాదు.. మేం చూసుకుంటాం.. అని న‌మ్మ‌బ‌లికి మాకు 70 గజాల చొప్పున ప్లాట్లు అమ్మేశారు. ప్ర‌భుత్వ భూమి అని మాకు తెలియ‌దు.. అంద‌రూ కొనుక్కుంటున్నారు.. అలాగే మేమూ కొనుక్కున్నాం.. ఇప్పుడు వారిని అడిగితే మాకేమి తెలీదు.. ఖాళీ జాగా ఉంచొద్దు.. వెంట‌నే ఇల్లు క‌ట్టుకోండి అని చెబితే మీరు విన‌లేద‌ని తిరిగి మ‌మ్మ‌ల‌నే ద‌బాయిస్తున్నారు. మా డ‌బ్బులు మాకిచ్చేయండి అంటే.. అవెప్పుడో ఎవ‌రి వాటాలు వారికి వెళ్లిపోయాయి.. మా ద‌గ్గ‌ర లేవ‌ని దాటేస్తున్నారు. మా నోట‌రీలు.. అగ్రిమెంట్లు చూసి ప్ర‌భుత్వ‌మే మాకు న్యాయం చేయాలి..అంటూ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మండలం ఐలాపూర్ గ్రామం, తండా నుంచి వంద‌లాది మంది పేదలు సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి వ‌చ్చి ఫిర్యాదు చేశారు. కురుమ మ‌ళ్లేష్‌, మాణిక్ యాద‌వ్‌, ర‌వి నాయ‌క్‌, రామ‌చంద్ర నాయ‌క్ త‌దిత‌రులు ముఖీం అనుచ‌రులుగా వేర్వేరు పేర్ల‌తో అగ్రిమెంట్లు, నోట‌రీలు చేసి అమ్మారంటూ పేర్కొన్నారు. కూలీ డ‌బ్బులు చిట్టీలు వేసుకుని.. ఊళ్ల‌లో ఉన్న కాస్త పొలం అమ్ముకుని.. నానా అవ‌స్థ‌లు ప‌డి ప్లాట్లు కొనుక్కొన్నాం. ఇప్పుడెవ‌రూ ప‌ల‌క‌డంలేదు.. ప్ర‌భుత్వ‌మే న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. వీటికి తోడు.. న‌గ‌రంలో ప్ర‌భుత్వ భూములు, యూఎల్‌సీ ల్యాండ్స్‌, అసైన్డ్ భూములు క‌బ్జాల‌కు గురౌతున్నాయ‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఔట‌ర్ రింగురోడ్డు నిర్మాణంలో సేక‌రించిన అసైన్డ్ భూముల్లో మ‌ట్టిని అమ్ముకున్న‌వారే.. ఇప్పుడు ఆ భూముల‌ను కూడా క‌బ్జా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని దుండిగ‌ల్ గ్రామ నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ భూములు అసైనీల‌కు ద‌క్కాలి.. లేదంటే ప్ర‌భుత్వానికి ఉండాలి కాని మ‌ధ్య‌లో క‌బ్జాదారుల పాల‌వ్వ‌కుండా చూడాల‌ని కోరారు. -బ్లూసీ వెనుక ఉన్న 2 ఎక‌రాల‌ను కాపాడండి.. 🔷సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోని బ్లూసీ హోట‌ల్ వెనుక ఉన్న 2 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తు అంద‌జేశారు. ప్ర‌భుత్వ భూమిని కొట్టేయాల‌ని అక్క‌డివారు కేసులు ఒక‌రిపై ఒక‌రు వేసుకుని న‌డిపిస్తున్నార‌ని.. ఈ విష‌యంలో హైడ్రా చొర‌వ తీసుకుని కాపాడాల‌న్నారు. కిక్కిరిసిన జ‌నాభా ఉన్న ఈ ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేయాల‌ని కోరారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి విలేజ్ స‌ర్వే నంబ‌రు 54లో 2 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని.., రంగారెడ్డి జిల్లా శేరిలింగంప్లి మండ‌లం, మియాపూర్ గ్రామంలోని స‌ర్వే నంబ‌రు 100, 101లో ఎక‌రా ప్ర‌భుత్వ భూమి ఉంటే స్థానికంగా ఉన్న వారు క‌బ్జా చేస్తున్నార‌ని శ్రీ శ‌క్తి మ‌హిళామండ‌లి ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. సికింద్ర‌బాద్ బేగంపేట‌లోని బ్రాహ్మ‌ణ‌వాడి స‌ర్వే నంబ‌రు 210లో 3 వేల గ‌జాల స్థ‌లం ప్ర‌భుత్వానిది కాగా.. క‌బ్జాలు జ‌రుగుతున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైదాబాద్లోని ఫిష్ మార్క‌ట్ వ‌ద్ద ఓపెన్ ప్లేస్ 4083 గ‌జాలుంటే.. దానిని పిల్ల‌ల‌కోసం పార్కును అభివృద్ధి చేయాల‌ని మేమంతా జీహెచ్ ఎంసీని కోరుతుంటే.. మ‌ధ్య‌లో వేరే వ్య‌క్తులు వ‌చ్చి క‌బ్జాలు చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ‌దంటే త‌మ‌ద‌ని ఇద్ద‌రు వ్య‌క్తులుప్ర‌భుత్వ భూమిపై కోర్టుకెక్క‌డం.. వాళ్లలో ఎవ‌రో ఒక‌రు సొంతం చేసుకుంటున్నార‌ని.. రెవెన్యూ, జీహెచ్ ఎంసీకి కూడా ఫిర్యాదు చేశామ‌ని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణి కి మొత్తం 52 ఫిర్యాదులు రాగా హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు వాటిని ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. ప‌త్రాల‌ను ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు

More news from తెలంగాణ and nearby areas
  • ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోమిరిశెట్టి సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా హైదరాబాద్, కొండాపూర్: ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ శ్రీ కోమిరిశెట్టి సాయిబాబా గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్‌లో శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్‌కు చెందిన మొహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతూ, ప్రజాసేవలో సాయిబాబా గారు చేసిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. అలాగే ఆయనకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్లు: మొహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ కొండాపూర్ డివిజన్
    1
    ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోమిరిశెట్టి సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా
హైదరాబాద్, కొండాపూర్:
ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ శ్రీ కోమిరిశెట్టి సాయిబాబా గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్‌లో శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్‌కు చెందిన మొహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతూ, ప్రజాసేవలో సాయిబాబా గారు చేసిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.
అలాగే ఆయనకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇట్లు:
మొహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్
కొండాపూర్ డివిజన్
    user_LOKESH DUVVURU
    LOKESH DUVVURU
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    35 min ago
  • जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।
    1
    जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।
    user_Kishor vaishnav
    Kishor vaishnav
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Secunderabad, Hyderabad•
    6 hrs ago
  • జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
    1
    జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    21 hrs ago
  • త్వరలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో కాంగ్రెస్ జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు.
    1
    త్వరలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో కాంగ్రెస్ జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    21 hrs ago
  • కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పాలి బిజెపి అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ పిలుపు దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యం దేశాభివృద్ధిలో మహిళలు ముందుకొస్తే అభివృద్ధి లో దూసుకెళ్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేలు చేస్తుందని చేస్తున్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితం అన్నారు ఆరు గ్యారెంటీలలో మహిళలకు 2500 నగదు ఏమైందన్నారు యువతకు స్కూటీలు ఇస్తానని మోసం చేశారన్నారు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని పెంచలేదన్నారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు మహిళా బిల్లు పవీగి పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మోసాలను మహిళలు గ్రహించాలన్నారు రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తే తమ సీట్లు గల్లంతయితాయని అపోహతో స్వార్థంతో బిల్లును అడ్డుకున్నారన్నారు మోడీ, ఏమిష లు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెస్తారు మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ బిల్లు పెట్టారు మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మా సీట్లను త్యాగాలు చేయడానికి సిద్ధం కాంగ్రెస్, ఇండియా కూటమిని మహిళలు చి కొడుతున్నారు రేవంత్ రెడ్డి వి కేవలం మాటలే చేతల్లో లేవు కెసిఆర్ లాగానే రేవంత్ పాలన సాగుతోంది ఆరు గ్యారెంటీ లు అమలు చేయడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలనిపిలుపుఇచ్చారు. డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ఏలాంటి సంబంధం లేదు బీజేపీ నార్త్, సౌత్ అనే బేధం లేకుండా నిదులిస్తుంది కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనుల నిధులు విడుదల అవుతున్నాయి ఓవెసి కి చెందిన ఫాతిమా కాలేజీ ని ఎందుకు కూల్చడం లేదు హైడ్రా పేదోళ్ళవే కూల్చుతున్నారు.. పెద్దలవి వదిలేస్తున్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతుందికెసిఆర్ ఫాం హౌజ్ లో కూర్చొని మందు తాగుతున్నారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కి వచ్చి కొట్లాడాలి బిఆర్ఎస్ అంటేనే భష్టు పట్టిన రాష్ట్ర సమితి ప్రగతి భవన్ పేరు తీసేసి కమిషన్ భవన్ అని పెట్టాలి ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే హైడ్రా కూల్చుతున్న భవనాల అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి వ్యవస్థ కరెక్ట్ ఉంటే బఫర్ జోన్ లల్లో ఇల్లు ఎందుకు కడుతారు ప్రభుత్వానికి మానవత్వం లేదు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తుంది ప్రజల హక్కుల కోసం పోరాడే వారి కోసం పనిచేస్తుంది ఎన్నికలకు ముందు రూ లక్ష కోట్ల స్కామ్ తీస్తా అన్నారు.. ఒక లక్ష కూడా తీయలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు . తెలంగాణ లో బిజెపి ఈ కార్య మోసపురిత సీఎం గా మిగిలిపోతారు ఈ సమావేశంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వోల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకురాలు మల్లిక మెదక్ కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్ అఖిల భరత్ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ మెదక్ జిల్లా బిజెపి కార్యదర్శి మహేశ్వరి మీడియా ఇన్చార్జి సంగీత మౌనిక లావణ్య విజయ్ పట్టణ అధ్యక్షులు నవీన్ ప్రసాద్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామంపేట కౌన్సిలర్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    1
    కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పాలి బిజెపి అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ పిలుపు
దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యం 
దేశాభివృద్ధిలో మహిళలు ముందుకొస్తే అభివృద్ధి లో దూసుకెళ్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేలు చేస్తుందని చేస్తున్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితం అన్నారు ఆరు గ్యారెంటీలలో మహిళలకు 2500 నగదు ఏమైందన్నారు యువతకు స్కూటీలు ఇస్తానని మోసం చేశారన్నారు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని పెంచలేదన్నారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు మహిళా బిల్లు పవీగి పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మోసాలను మహిళలు గ్రహించాలన్నారు రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తే తమ సీట్లు గల్లంతయితాయని అపోహతో స్వార్థంతో బిల్లును అడ్డుకున్నారన్నారు మోడీ, ఏమిష లు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెస్తారు 
మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ బిల్లు పెట్టారు 
మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ 
మహిళల కోసం మా సీట్లను త్యాగాలు చేయడానికి సిద్ధం కాంగ్రెస్, ఇండియా కూటమిని మహిళలు చి కొడుతున్నారు 
రేవంత్ రెడ్డి వి కేవలం మాటలే చేతల్లో లేవు 
కెసిఆర్ లాగానే రేవంత్ పాలన సాగుతోంది 
ఆరు గ్యారెంటీ లు అమలు చేయడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారు 
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలనిపిలుపుఇచ్చారు.
డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ఏలాంటి సంబంధం లేదు బీజేపీ నార్త్, సౌత్ అనే బేధం లేకుండా నిదులిస్తుంది కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనుల నిధులు విడుదల అవుతున్నాయి ఓవెసి కి చెందిన ఫాతిమా కాలేజీ ని ఎందుకు కూల్చడం లేదు 
హైడ్రా పేదోళ్ళవే కూల్చుతున్నారు.. పెద్దలవి వదిలేస్తున్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతుందికెసిఆర్ ఫాం హౌజ్ లో కూర్చొని మందు తాగుతున్నారు 
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కి వచ్చి కొట్లాడాలి 
బిఆర్ఎస్ అంటేనే భష్టు పట్టిన రాష్ట్ర సమితి ప్రగతి భవన్ పేరు తీసేసి కమిషన్ భవన్ అని పెట్టాలి ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే 
హైడ్రా కూల్చుతున్న భవనాల అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి 
వ్యవస్థ కరెక్ట్ ఉంటే బఫర్ జోన్ లల్లో ఇల్లు ఎందుకు కడుతారు 
ప్రభుత్వానికి మానవత్వం లేదు 
దేవాలయాలపై దాడులు చేస్తున్నారు 
పోలీస్ వ్యవస్థ, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తుంది ప్రజల హక్కుల కోసం పోరాడే వారి కోసం పనిచేస్తుంది ఎన్నికలకు ముందు రూ లక్ష కోట్ల స్కామ్ తీస్తా అన్నారు.. ఒక లక్ష కూడా తీయలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు . తెలంగాణ లో బిజెపి ఈ కార్య మోసపురిత సీఎం గా మిగిలిపోతారు ఈ సమావేశంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వోల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకురాలు మల్లిక మెదక్ కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్ అఖిల భరత్ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ మెదక్ జిల్లా బిజెపి కార్యదర్శి మహేశ్వరి మీడియా ఇన్చార్జి సంగీత మౌనిక లావణ్య విజయ్ పట్టణ అధ్యక్షులు నవీన్ ప్రసాద్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామంపేట కౌన్సిలర్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    43 min ago
  • సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.
    1
    సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.