శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు నేడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. జనసేన నాయకులు కొట్టే శ్రీహరి ఆహ్వానం మేరకు నందలూరుకు విచ్చేసిన వీరిద్దరికీ NDA కూటమి నాయకులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ గారు, కీర్తన గారు NDA కూటమి నాయకులు, స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం రాయలసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో దిలీప్ గారు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం పూర్తయ్యాక, ఆలయ మర్యాదలతో కొట్టే సాయి ప్రసాద్ గారిని, పరింగిశెట్టి కీర్తన గారిని సత్కరించి, ఆలయ వేద పండితులతో ఆశీర్వచనం అందించారు. ఈ పర్యటనలో భాగంగా, వారు శ్రీ సౌమ్యనాథ స్వామి అన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ అన్నదాన ట్రస్టుకు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ RTC జోనల్ చైర్మన్ యెద్దల సుబ్బరాయుడు, మాజీ MPP పల్లె సుబ్రమణ్యం, హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర, ఉప్పుశెట్టి సుధీర్, మాజీ సర్పంచ్లు జంబుసూర్యనారయణ, మోడపోతుల రాము, గంగధర్, జిగిలి ఓబులేస్, హిమగిరి, రెడ్డేయ్య, బాలజి, కొట్టే రాఘవ, హోటల్ శివ, పర్న రామయ్య, డాల, మొహన్, మస్తాన్ రాయల్, మాజీ MPTC సుబ్రమణ్యం, అబ్బిగారి గోపాల్, రత్నం, పవన్ కుమార్, రాయచోటి చిరంజీవి యువత అధ్యక్షులు జయారం, అనంగి హరి చంద్ర, బాల, కొట్టే నాగేంద్ర, సురేంద్ర, మల్లి, ప్రతాప్, సురేష్, వర్మ, శివ, సునిల్, సుధాకర్, కొట్టే ప్రదీప్, కొట్టే హరి, తోట సుబ్బయ్య, బద్రి సహా NDA కూటమి నాయకులు, స్థానికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు నేడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. జనసేన నాయకులు కొట్టే శ్రీహరి ఆహ్వానం మేరకు నందలూరుకు విచ్చేసిన వీరిద్దరికీ NDA కూటమి నాయకులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ గారు, కీర్తన గారు NDA కూటమి నాయకులు, స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం రాయలసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో దిలీప్ గారు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం పూర్తయ్యాక, ఆలయ మర్యాదలతో కొట్టే సాయి ప్రసాద్ గారిని, పరింగిశెట్టి కీర్తన గారిని సత్కరించి, ఆలయ వేద పండితులతో ఆశీర్వచనం అందించారు. ఈ పర్యటనలో భాగంగా, వారు శ్రీ సౌమ్యనాథ స్వామి అన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ అన్నదాన ట్రస్టుకు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ RTC జోనల్ చైర్మన్ యెద్దల సుబ్బరాయుడు, మాజీ MPP పల్లె సుబ్రమణ్యం, హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర, ఉప్పుశెట్టి సుధీర్, మాజీ సర్పంచ్లు జంబుసూర్యనారయణ, మోడపోతుల రాము, గంగధర్, జిగిలి ఓబులేస్, హిమగిరి, రెడ్డేయ్య, బాలజి, కొట్టే రాఘవ, హోటల్ శివ, పర్న రామయ్య, డాల, మొహన్, మస్తాన్ రాయల్, మాజీ MPTC సుబ్రమణ్యం, అబ్బిగారి గోపాల్, రత్నం, పవన్ కుమార్, రాయచోటి చిరంజీవి యువత అధ్యక్షులు జయారం, అనంగి హరి చంద్ర, బాల, కొట్టే నాగేంద్ర, సురేంద్ర, మల్లి, ప్రతాప్, సురేష్, వర్మ, శివ, సునిల్, సుధాకర్, కొట్టే ప్రదీప్, కొట్టే హరి, తోట సుబ్బయ్య, బద్రి సహా NDA కూటమి నాయకులు, స్థానికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
- మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.1
- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూటమి నాయకులు ఇన్నాళ్లు పోలీసులను అడ్డం పెట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాడుకుంటే సమాజం ఎలా తయారవుతుందో చెప్పడానికి కృష్ణలంక సీఐ నాగరాజు కారణంగా జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దుర్ఘటనలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నొక్కడానికి తెగబడుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై తనిఖీల పేరుతో దాడులకు పూనుకున్నారని ఆయన వెల్లడించారు. డీఎస్సీ-2025 నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలు, అలాగే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి లబ్ధి చేకూర్చారని ఆధారాలతో సహా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ తరఫున చంద్రశేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్రభుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూటమి ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారినందుకే ఆయనపై కక్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.1
- గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు వ్యవహారం జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సింగనగర్లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని తలపించడంతో పాటు, పోలీసు శాఖలోని క్రమశిక్షణ, చట్టాల అమలు, అధికారుల బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు సింగనగర్ ప్రాంతంలోని ఓ కానిస్టేబుల్ నివాసంలో తలదాచుకున్నారనే ప్రచారం ఉదయం నుంచే జోరందుకుంది, ఈ సమాచారం వెలుగులోకి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా, కృష్ణలంక ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళన వ్యక్తం చేయడం మరింత చర్చకు దారితీసింది. వారు నాగరాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పూర్తి విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించడంతో పరిస్థితి రాజకీయ రంగు పులుముకున్నట్టుగా మారింది. అయితే, ఈ పరిణామాలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసు అధికారులే చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తూ, సాధారణ ప్రజలకు ఒక విధానం, అధికారులకు మరో విధానమా అని నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని, కానీ చట్టపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసేలా నిరసనలు, ఒత్తిళ్లు తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ పూర్తయ్యే వరకు చట్టం తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు వీధుల్లోకి రావడం, అరెస్ట్ చేయొద్దంటూ డిమాండ్ చేయడం పట్ల సామాజిక మాధ్యమాల్లో కూడా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి, చట్టం ముందు అందరూ సమానమే అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రత్యేక రక్షణ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, విచారణ ఏ దశలో ఉంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది. మీడియా ముందు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారా? లేక విచారణ అనంతరం మాత్రమే చర్యలు ప్రకటిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసు శాఖలో పనిచేసే అధికారిపై ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టపరమైన ప్రక్రియలు పారదర్శకంగా సాగాలని, ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. చట్టాలను అమలు చేసే వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే, బాధ్యులపై చట్టం ముందు సమానత్వం కనిపించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.1
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు. పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.1
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ప్రజలకు ప్రతి రోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆయన పట్టణంలోని వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని హాకీ మైదానం మరియు ఇందిరమ్మ రాణితోపు పార్కులలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు వెంకట్రాంరెడ్డి మరియు ఓం ప్రకాశ్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. వారు యోగాసనాలు చేయించడంతో పాటు, ప్రాణాయామం కూడా చేయించారు.1
- కడప జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాలవ పాపాగ్ని నదిలో ఇసుక క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పెండ్లిమర్రి మండలం కార్పురెడ్డి గారి పల్లెకు చెందిన రాజవర్ధన్ రెడ్డి (16) మరియు జయంతి రెడ్డి (18)గా మృతులను గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చిన ఈ యువకులు సరదాగా ఇసుక క్వారీ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలతో పాపాగ్ని నదిలో ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు, క్వారీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాగా, అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు బాధ్యులపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు.1