వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ లో చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోరు. పరిరక్షణే ధ్యేయంగా దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. - జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ ఖుదావన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు గతంలో వక్ఫ్ బోర్డు మరియు రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన సంయుక్త సర్వే లో నెల్లూరు నగరంలోని పోట్టేపాలెం గ్రామం, సర్వే నం. 387/1లో ఉన్న 2.15 ఎకరాల విస్తీర్ణం గల భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారణ కావడంతో, చైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు జనవరి నెలలోనే అక్కడ హెచ్చరిక బోర్డు (కాషన్ బోర్డు) ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ ఖుదావన్ పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా వక్ఫ్ సిబ్బంది, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోట్టేపాలెం గ్రామం, సర్వే నం. 387/1లో ఉన్న 2.15 ఎకరాల విస్తీర్ణం గల అత్తరా మసీదుకు అనుబంధ వక్ఫ్ భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రదేశంలో పెరిగిన చెట్లు, పొదలను జేసీబీ సహాయంతో తొలగిస్తూ శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా ఈ స్థలాన్ని లేఅవుట్గా మార్చినట్లు తేలిందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ విషయంలో చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోరని, పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ధృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులపై ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే ఈ వక్ఫ్ భూమికి పక్కా కంచె ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ లో చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోరు. పరిరక్షణే ధ్యేయంగా దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. - జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ ఖుదావన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు గతంలో వక్ఫ్ బోర్డు మరియు రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన సంయుక్త సర్వే లో నెల్లూరు నగరంలోని పోట్టేపాలెం గ్రామం, సర్వే నం. 387/1లో ఉన్న 2.15 ఎకరాల విస్తీర్ణం గల భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారణ కావడంతో, చైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు జనవరి నెలలోనే అక్కడ హెచ్చరిక బోర్డు (కాషన్ బోర్డు) ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ ఖుదావన్ పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా వక్ఫ్ సిబ్బంది, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోట్టేపాలెం గ్రామం, సర్వే నం. 387/1లో ఉన్న 2.15 ఎకరాల విస్తీర్ణం గల అత్తరా మసీదుకు అనుబంధ వక్ఫ్ భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రదేశంలో పెరిగిన చెట్లు, పొదలను జేసీబీ సహాయంతో తొలగిస్తూ శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా ఈ స్థలాన్ని లేఅవుట్గా మార్చినట్లు తేలిందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ విషయంలో చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోరని, పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ధృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులపై ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే ఈ వక్ఫ్ భూమికి పక్కా కంచె ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.
- Post by మీ శ్రేయోభిలాషి1
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.1
- కడప అల్లాహ్ 23 24 251
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్1
- బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.1