logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నంద్యాల జిల్లాలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకల సందర్భంగా కొందరు ఆకతాయిలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో భారీ బలగాలను మోహరించారు, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

15 hrs ago
user_अतीक अहमद
अतीक अहमद
Court reporter India•
15 hrs ago

నంద్యాల జిల్లాలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకల సందర్భంగా కొందరు ఆకతాయిలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో భారీ బలగాలను మోహరించారు, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం బురద మయంగా మారిన రహదారులు మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    1
    వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం  బురద మయంగా మారిన రహదారులు
మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య.. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు. పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
    1
    అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే 
నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి  మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు  గిత్త జయసూర్య..
ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి  ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు.
గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు
మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు
గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు.
కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు.
ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు.
పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు
పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు 
అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు 
అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు
R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు
మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు
అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి  మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి  మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    4 hrs ago
  • పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.
    1
    పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు
నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
    1
    ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    1
    అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి  సంపత్ కుమార్
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    1
    రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఈ సందేశం దేవుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుతోంది. యేసు నామంలో పవిత్రమైన, అద్భుతమైన జీవనం లభించాలని ఆకాంక్షిస్తుంది.
    1
    ఈ సందేశం దేవుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుతోంది. యేసు నామంలో పవిత్రమైన, అద్భుతమైన జీవనం లభించాలని ఆకాంక్షిస్తుంది.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
    1
    కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్  ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
    user_Shiva ji
    Shiva ji
    కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.