ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "యోగాంధ్ర–2026, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు" కార్యక్రమంలో భాగంగా కౌతాళం మండల కేంద్రంలోని జడ్పీకే హైస్కూల్లో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ, "ఫిట్ ఆంధ్ర పర్ఫెక్ట్ ఆంధ్ర" నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యోగా సాధనలో హైస్కూల్ చైర్మన్ బసవరాజ్ తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సురేష్ నాయుడు, అల్లూరి వెంకటపతి రాజు, మండల పాఠశాల అధికారి శోభారాణి, తాసిల్దార్లు, కౌతాళం తహసిల్దార్ రజనీకాంత్ రెడ్డి, హైస్కూల్ చైర్మన్ బసవరాజ్ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ వెంకటపతిరాజు, కౌతాళం తహసిల్దార్ రజనీకాంత్ రెడ్డి, మండల పాఠశాల అధికారి శోభారాణి, సీనియర్ కౌతాళం హైస్కూల్ హెచ్ఎం సుధాకర్ రెడ్డి, నాయకులు రామలింగ అన్న, డాక్టర్ రాజా నంద, గిరి, సుభాన్, రమేష్, లింగేశ్, ఈరన్న, కృష్ణ, అమ్మువలి, నభిసాబ్, రాత్రికి చంద్ర, తయన్న, రేవన్న, భీమ, నాగరాజు, మరియు కళాశాల, పాఠశాల, మండల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అభివృద్ధి అధికారులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "యోగాంధ్ర–2026, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు" కార్యక్రమంలో భాగంగా కౌతాళం మండల కేంద్రంలోని జడ్పీకే హైస్కూల్లో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ, "ఫిట్ ఆంధ్ర పర్ఫెక్ట్ ఆంధ్ర" నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో
ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యోగా సాధనలో హైస్కూల్ చైర్మన్ బసవరాజ్ తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సురేష్ నాయుడు, అల్లూరి వెంకటపతి రాజు, మండల పాఠశాల అధికారి శోభారాణి, తాసిల్దార్లు, కౌతాళం తహసిల్దార్ రజనీకాంత్ రెడ్డి, హైస్కూల్ చైర్మన్ బసవరాజ్ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని, శారీరక, మానసిక
ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ వెంకటపతిరాజు, కౌతాళం తహసిల్దార్ రజనీకాంత్ రెడ్డి, మండల పాఠశాల అధికారి శోభారాణి,
సీనియర్ కౌతాళం హైస్కూల్ హెచ్ఎం సుధాకర్ రెడ్డి, నాయకులు రామలింగ అన్న, డాక్టర్ రాజా నంద, గిరి, సుభాన్, రమేష్, లింగేశ్, ఈరన్న, కృష్ణ, అమ్మువలి, నభిసాబ్, రాత్రికి చంద్ర, తయన్న, రేవన్న, భీమ, నాగరాజు, మరియు కళాశాల, పాఠశాల, మండల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అభివృద్ధి అధికారులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- ఆదోనిలోని ఆర్ఆర్ లేబర్ కాలనీ సమీపంలో ఉన్న ఆవు దూడ వంకలో ఒక లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు గతంలో పదిసార్లు అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ, ఈ సమస్యపై ఎటువంటి స్పందన రాలేదని ఆరోపించారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి ఈ ప్రాంతాన్ని సందర్శించి, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని ఆయన మరిచిపోయారని కూడా వారు పేర్కొన్నారు.1
- ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు (APUWJ) మహాసభ ఓర్వకల్లులో ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభలో APUWJ కి కొత్త కమిటీని ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఈ నూతన కమిటీ పనిచేస్తుందని ప్రకటించారు.1
- జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గట్టు మండలంలో నేషనల్ హైవే రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు ధర్నా చేస్తున్నారు. ముంబై నుండి చెన్నై మరియు బెంగళూరు వరకు వెళ్ళే నేషనల్ హైవే రింగ్ రోడ్డు తమ గట్టు మండలం పరిధిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక ప్రజలు వరహరా దీక్షకు దిగారు.1
- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హన్వాడ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి లాల్యనాయక్ తండాలో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. వెంకటమ్మ కుంట తండాలో ₹20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ అరుణ ప్రారంభించారు. అదే గ్రామంలో ₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్వయం సహాయక సంఘ భవనానికి కూడా ఆమె భూమి పూజ చేశారు.1
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు. పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.1
- యోగా డే వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేష్ యోగా సాధనలో పాల్గొన్నారు. ఆయన బాబా రామ్దేవ్తో కలిసి యోగాసనాలు వేశారు.1
- మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టగా, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పూజారులు, అధికారులు, సిబ్బందితో పాటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1