ప్రెస్ నోట్: జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా తేది: 20.04.2026. ఫేక్ సైబర్ కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న బీహార్ గ్యాంగ్ అరెస్ట్ – జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారు జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా, ఫేక్ కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర బీహార్ ముఠాను నెల్లూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భాగంగా: * మొత్తం 03 కేసులు నమోదు చేయబడినవి. * 05 మంది నిందితులను అరెస్ట్ చేశారు. * బాధితుల నుండి మోసం చేసిన రూ. 6,00,000/-లో భాగంగా రూ. 10,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు: Cr.No. 68/2026 u/s 318(4), 303(2) BNS & Sec 66 C & 66(D) IT Act-2000 (420, 379 IPC) of Santhapet Police Station, Nellore City. నిందితుల వివరాలు: బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు, వయస్సు 23 నుండి 32 సంవత్సరాల మధ్య, వివిధ ప్రాంతాల వారిగా గుర్తించారు. ముద్దాయిలు: 1. సజ్జన్ కుమార్ (26 సంవత్సరాలు) 2. రంజిత్ కుమార్ (26 సంవత్సరాలు) 3. రోహిత్ కుమార్ (32 సంవత్సరాలు) 4. నరేందర్ కుమార్ (24 సంవత్సరాలు) 5. సందీప్ కుమార్ (28 సంవత్సరాలు) (అందరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారు) నేర విధానం (Modus Operandi): నిందితులు ఫేక్ సిమ్ కార్డులు, ఫేక్ బ్యాంక్ ఖాతాలు ఉపయోగించి ప్రజలకు ఫోన్ కాల్స్ చేసి, KYC అప్డేట్, బ్యాంక్ సమస్యలు, లాటరీలు, ఇతర ఆఫర్ల పేరుతో మోసం చేశారు. బాధితులకు OTPలు తీసుకొని వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకున్నారు. ఈ గ్యాంగ్ బీహార్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీస్ టీమ్ను జిల్లా ఎస్.పి. గారు అభినందించారు. ఈ ఆపరేషన్లో సైబర్ క్రైమ్ DSP, SIలు మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ప్రజలు అపరిచిత కాల్స్పై జాగ్రత్తగా ఉండాలని, OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మోసాలపై వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.
ప్రెస్ నోట్: జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా తేది: 20.04.2026. ఫేక్ సైబర్ కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న బీహార్ గ్యాంగ్ అరెస్ట్ – జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారు జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా, ఫేక్ కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర బీహార్ ముఠాను నెల్లూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భాగంగా: * మొత్తం 03 కేసులు నమోదు చేయబడినవి. * 05 మంది నిందితులను అరెస్ట్ చేశారు. * బాధితుల నుండి మోసం చేసిన రూ. 6,00,000/-లో భాగంగా రూ. 10,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు: Cr.No. 68/2026 u/s 318(4), 303(2) BNS & Sec 66 C & 66(D) IT Act-2000 (420, 379 IPC) of Santhapet Police Station, Nellore City. నిందితుల వివరాలు: బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు, వయస్సు 23 నుండి 32 సంవత్సరాల మధ్య, వివిధ ప్రాంతాల వారిగా గుర్తించారు. ముద్దాయిలు: 1. సజ్జన్ కుమార్ (26 సంవత్సరాలు) 2. రంజిత్ కుమార్ (26 సంవత్సరాలు) 3. రోహిత్ కుమార్ (32 సంవత్సరాలు) 4. నరేందర్ కుమార్ (24 సంవత్సరాలు) 5. సందీప్ కుమార్ (28 సంవత్సరాలు) (అందరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారు) నేర విధానం (Modus Operandi): నిందితులు ఫేక్ సిమ్ కార్డులు, ఫేక్ బ్యాంక్ ఖాతాలు ఉపయోగించి ప్రజలకు ఫోన్ కాల్స్ చేసి, KYC అప్డేట్, బ్యాంక్ సమస్యలు, లాటరీలు, ఇతర ఆఫర్ల పేరుతో మోసం చేశారు. బాధితులకు OTPలు తీసుకొని వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకున్నారు. ఈ గ్యాంగ్ బీహార్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీస్ టీమ్ను జిల్లా ఎస్.పి. గారు అభినందించారు. ఈ ఆపరేషన్లో సైబర్ క్రైమ్ DSP, SIలు మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ప్రజలు అపరిచిత కాల్స్పై జాగ్రత్తగా ఉండాలని, OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మోసాలపై వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అమరావతి నిర్మాత, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ కటౌట్కు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. డ్రోన్ సహాయంతో కటౌట్పై పుష్ఫాభిషేకం నిర్వహించారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో లక్ష్మీపురం గ్రామం దద్ధరిల్లింది. చంద్రబాబు నాయుడు అంటే కేవలం పేరు కాదని, అదొక అభివృద్ధి బ్రాండ్ అని నినదించారు. ఈ సందర్భంగా ఆయన అందిస్తున్న సుపరిపాలనను కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలగకుండా చంద్రబాబు నాయుడు పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్న నవ్యాంధ్ర నిర్మాతకు ప్రజలందరూ అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.4