*ఆంధ్రప్రదేశ్ క్రీడల ఉన్నతికి అరవై కోట్ల మంజూరు.* - ఫలించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ. - ఈనెల ఆరవ తేదిన క్రీడా శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ తో భేటి. - ఎపిలో పరిస్థితులు, కేంద్రం అందించాల్సిన నిధుల గురించి ప్రత్యేక చర్చ. - ఖెలో ఇండియా నుండి నిధుల కేటాయింపు, హర్షం వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు. జనవరి 08 : ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పలు కీలక అంశాలకు సంబంధించి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధి ఖెలో ఇండియా పధకం నుండి నిధులు మంజూరు అయ్యాయి. తాజాగా ఈ నెల ఆరవ తేదిన రాష్ట్రంలో క్రీడా వసతులకు సంబంధించిన పరిస్థితులు, అందించాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. కేంద్ర క్రీడా శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయకు వివరించారు. వారి భేటి అనంతరం గురువారం నాడు నిధుల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల అవ్వడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా అరవై కోట్ల డబ్బై ఆరు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఇందులో శ్రీకాకుళం రూరల్ మండలం, పాత్రునివలసలో ఇండోర్ హాల్ నిర్మాణం కొరకు 14 కోట్లు, చిత్తూరు జిల్లా కుప్పం లో బహుళ ప్రయోజన భవన సముదాయం నిర్మాణం కొరకు 14 కోట్లు, రాజమండ్రి పరిధిలో బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు 13.76 కోట్లు, విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ఎనిమిది లైన్ల సింథటిక్ అధ్లేటిక్ ట్రాక్ నిర్మాణం 9 కోట్ల ఏభై లక్షలు, అదే మైదానంలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫుట్ బాల్ ఫీల్డ్ నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలు, అదే మైదానం లో టెన్నిస్ కోర్టు నిర్మాణం కోసం కోటి ఏభై లక్షల రూపాయలతో పాటు బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణం కోసం 92 లక్షలు మంజూరు అయ్యాయి. ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, 200 మీటర్ల ట్రాక్, ఇతర వసతుల కోసం ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. వీటితో పాటు గుంటూరు లో మైదానం నిర్మాణం కొరకు నిధుల మంజూరుకు వినతి ను రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. అందులో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 14కోట్లు మంజూరు చేస్తామని, సవరించిన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులలో పేర్కొంది. తాజా నిధుల కేటాయింపు తో ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అనేక ప్రాజెక్టులు.. తాజా నిధుల కేటాయింపుతో నిర్మాణం దిశగా వేగం పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, అడగగానే నిధుల కేటాయింపు చేసిన కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధుల కేటాయింపు తో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరద్రుష్టితో క్రీడాకారులు మరిన్ని అధ్బుతాలు అధ్బుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
*ఆంధ్రప్రదేశ్ క్రీడల ఉన్నతికి అరవై కోట్ల మంజూరు.* - ఫలించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ. - ఈనెల ఆరవ తేదిన క్రీడా శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ తో భేటి. - ఎపిలో పరిస్థితులు, కేంద్రం అందించాల్సిన నిధుల గురించి ప్రత్యేక చర్చ. - ఖెలో ఇండియా నుండి నిధుల కేటాయింపు, హర్షం వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు. జనవరి 08 : ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పలు కీలక అంశాలకు సంబంధించి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధి ఖెలో ఇండియా పధకం నుండి నిధులు మంజూరు అయ్యాయి. తాజాగా ఈ నెల ఆరవ తేదిన రాష్ట్రంలో క్రీడా వసతులకు సంబంధించిన పరిస్థితులు, అందించాల్సిన ఆవశ్యకతను
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. కేంద్ర క్రీడా శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయకు వివరించారు. వారి భేటి అనంతరం గురువారం నాడు నిధుల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల అవ్వడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా అరవై కోట్ల డబ్బై ఆరు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఇందులో శ్రీకాకుళం రూరల్ మండలం, పాత్రునివలసలో ఇండోర్ హాల్ నిర్మాణం కొరకు 14 కోట్లు, చిత్తూరు జిల్లా కుప్పం లో బహుళ ప్రయోజన భవన సముదాయం నిర్మాణం కొరకు 14 కోట్లు, రాజమండ్రి పరిధిలో బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు 13.76 కోట్లు, విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ఎనిమిది లైన్ల సింథటిక్ అధ్లేటిక్ ట్రాక్ నిర్మాణం 9 కోట్ల ఏభై
లక్షలు, అదే మైదానంలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫుట్ బాల్ ఫీల్డ్ నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలు, అదే మైదానం లో టెన్నిస్ కోర్టు నిర్మాణం కోసం కోటి ఏభై లక్షల రూపాయలతో పాటు బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణం కోసం 92 లక్షలు మంజూరు అయ్యాయి. ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, 200 మీటర్ల ట్రాక్, ఇతర వసతుల కోసం ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. వీటితో పాటు గుంటూరు లో మైదానం నిర్మాణం కొరకు నిధుల మంజూరుకు వినతి ను రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. అందులో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 14కోట్లు మంజూరు చేస్తామని, సవరించిన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ
శాఖ ఈ ఉత్తర్వులలో పేర్కొంది. తాజా నిధుల కేటాయింపు తో ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అనేక ప్రాజెక్టులు.. తాజా నిధుల కేటాయింపుతో నిర్మాణం దిశగా వేగం పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, అడగగానే నిధుల కేటాయింపు చేసిన కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధుల కేటాయింపు తో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరద్రుష్టితో క్రీడాకారులు మరిన్ని అధ్బుతాలు అధ్బుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
- నరసన్నపేట: సంక్రాంతికి ఊరెళితే సమాచారం ఇవ్వండి.. సీఐ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రయాణాల సమయంలో ఇళ్లల్లోని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ముందుగా సమాచారం ఇస్తే, ఆయా గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచడం ద్వారా భద్రత కల్పించబడుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1
- సంతబొమ్మాళి, జనవరి 9,సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు ఆధ్వర్యంలో శుక్రవారం భోగి, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యా యులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. డూడూ బసవన్నలు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీ, స్లో సైక్లింగ్ తదితర ఆటలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక పాటలకు డాన్స్లు వేశారు. హరిదాసు,సంక్రాంతి గొబ్బెమ్మలు, కోలాటం సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు సాంప్రదాయ వంటలు వాళ్లు విషయాలపై సాంస్కృతికంగా తెలిపారు.4
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహముతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి, పాటశాల అవరణంతా మామిడి తోరణాలతో, రంగు రంగుల రంగవల్లికలు తో తీర్చిదిద్దారు. విద్యార్థులు వేసిన హరిదాసు, జంగమయ్య, సోదమ్మ వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరకుగడలతో, క్రొత్తకుండలో పాలు పొంగించిడము, గొబ్బెమ్మలు, భోగి మంటలతో కోలాహలంగా పండుగ వాావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి మండల విద్యాధికారులు చిన్నవాడు, అర్జునుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.1
- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఎంజీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం నియోజకవర్గ పరిధి కొత్తూరు మండలంలో గల బలద గ్రామానికి చెందిన బెహర శంకరరావు మేడపై నుండి జారీ పడిపోవడంతో రెండు కాళ్ళు విరిగి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ స్థానిక నాయుకులు ద్వారా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద వివరించారు. దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందిస్తూముఖ్యమంత్రి సహాయానిదికి దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 80,916/- రూపాయిలు చెక్ ను గురువారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి, సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవల ౦ అర్హతే ఆధారంగా నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియో జక వర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు ఉన్నారు.2
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- 🙏🙏1
- भारत सरकार ने 100 mg से ज्यादा डोज वाली निमेसुलाइड दवाओं पर रोक लगा दी है। यह पेनकिलर और एंटी‑इंफ्लेमेटरी दवा आमतौर पर बुखार, सिरदर्द और बदन दर्द में ली जाती थी, लेकिन ज्यादा मात्रा में लेने से लिवर और किडनी को नुकसान पहुंच सकता है। स्वास्थ्य मंत्रालय और डॉक्टरों ने बिना सलाह दवा लेने से बचने और बच्चों को यह दवा न देने की चेतावनी दी है।1