logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చదువుకు నైపుణ్యం తోడైతే ఉత్తమ ఫలితాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం, మార్చి 31 : విద్యార్ధుల చదువులకు మరిన్ని నైపుణ్యాలు అందివ్వాలనే లక్ష్యంతో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ఓ ఆలోచన ఫలితాలను అందిస్తోంది. కేంద్ర మంత్రిగా తనకు అందుబాటులోకి వచ్చిన పరిచయాలను జిల్లా అభివృద్ధికి వినియోగిస్తున్నారు. తాజాగా పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుతో భేటి అవ్వడం.. వారి కార్పోరేట్ సామజిక భాద్యత నిధులు జిల్లాకు వినియోగించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు కోరడం.. మంగళవారం నాడు ఈ నిధుల వినియోగంకు సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం నుండి పరిపాలనా ఆమోదం రావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థ నుండి సి.ఎస్.ఆర్ నిధులు 30 లక్షల రూపాయలు వచ్చాయని.. వీటిని శ్రీకాకుళం నగరంలోని ఎన్.టి.ఆర్ మున్సిపల్ హైస్కూల్ తో పాటు, నిమ్మాడ జిల్లా పరిషత్ హైస్కూల్ లలో స్కిల్ ల్యాబ్ లను ఏర్పాటు చెయ్యాలని, ఒక్కో పాఠశాలలో 15 లక్షల వ్యయంతో మొత్తంగా ముప్పై లక్షలను వీటి నిర్మాణం కోసం వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలను సర్వశిక్షా అభియాన్ అధికారులకు జారీ చేశారు. వీటితో పాటుగా కాగ్నో స్పేస్ అనే సంస్థ.. ఈ రెండు ల్యాబ్ ల నిర్వహణ చేస్తూ.. విద్యార్ధులకు మరిన్ని నైపుణ్యాలు తోడయ్యేలా చెయ్యాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ రెండు పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కిల్ ల్యాబ్ లు సేవలందిచనుండగా.. భవిష్యత్ లో మరిన్ని పాఠశాలలకు ఈ కాన్సెప్ట్ ను విస్తృత పరిచే ఆలోచన చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కాగా గతంలో శ్రీకాకుళం నగరంలోని ఎన్టిఆర్ మున్సిపల్ హైస్కూల్ ను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు.. ఈ పాఠశాలను తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో అక్కడ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి అదనపు భవనాలు, ఇతర వసతుల కోసం నిధుల మంజూరు జరగగా.. నిర్మాణ దశను ఆవి పూర్తి చేసుకున్నాయి. తాజాగా వాటితో పాటు స్కిల్ ల్యాబ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడం పట్ల ఇటు ఎన్టిఆర్ మున్సిపల్ స్కూల్ విద్యార్ధులు, నిమ్మాడ జెడ్పి హైస్కూల్ విద్యార్ధులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని జిల్లా అభివృద్ధి వైపు మళ్లిస్తూఉండటంలో కేంద్ర మంత్రి చొరవ పట్ల ప్రసంశలు లభిస్తున్నాయి.

5 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
fae5178d-3274-4bbb-9897-86315441c24a

చదువుకు నైపుణ్యం తోడైతే ఉత్తమ ఫలితాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం, మార్చి 31 : విద్యార్ధుల చదువులకు మరిన్ని నైపుణ్యాలు అందివ్వాలనే లక్ష్యంతో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ఓ ఆలోచన ఫలితాలను అందిస్తోంది. కేంద్ర మంత్రిగా తనకు అందుబాటులోకి వచ్చిన పరిచయాలను జిల్లా అభివృద్ధికి వినియోగిస్తున్నారు. తాజాగా పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుతో భేటి అవ్వడం.. వారి కార్పోరేట్ సామజిక భాద్యత నిధులు జిల్లాకు వినియోగించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు కోరడం.. మంగళవారం నాడు ఈ నిధుల వినియోగంకు సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం నుండి పరిపాలనా ఆమోదం రావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థ నుండి సి.ఎస్.ఆర్ నిధులు 30 లక్షల రూపాయలు వచ్చాయని.. వీటిని శ్రీకాకుళం నగరంలోని ఎన్.టి.ఆర్ మున్సిపల్ హైస్కూల్ తో పాటు, నిమ్మాడ జిల్లా పరిషత్ హైస్కూల్ లలో స్కిల్ ల్యాబ్ లను ఏర్పాటు చెయ్యాలని, ఒక్కో పాఠశాలలో 15 లక్షల వ్యయంతో మొత్తంగా ముప్పై లక్షలను వీటి నిర్మాణం కోసం వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలను

b0bb215f-dc06-4b5e-bb51-b6b8c48660ce

సర్వశిక్షా అభియాన్ అధికారులకు జారీ చేశారు. వీటితో పాటుగా కాగ్నో స్పేస్ అనే సంస్థ.. ఈ రెండు ల్యాబ్ ల నిర్వహణ చేస్తూ.. విద్యార్ధులకు మరిన్ని నైపుణ్యాలు తోడయ్యేలా చెయ్యాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ రెండు పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కిల్ ల్యాబ్ లు సేవలందిచనుండగా.. భవిష్యత్ లో మరిన్ని పాఠశాలలకు ఈ కాన్సెప్ట్ ను విస్తృత పరిచే ఆలోచన చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కాగా గతంలో శ్రీకాకుళం నగరంలోని ఎన్టిఆర్ మున్సిపల్ హైస్కూల్ ను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు.. ఈ పాఠశాలను తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో అక్కడ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి అదనపు భవనాలు, ఇతర వసతుల కోసం నిధుల మంజూరు జరగగా.. నిర్మాణ దశను ఆవి పూర్తి చేసుకున్నాయి. తాజాగా వాటితో పాటు స్కిల్ ల్యాబ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడం పట్ల ఇటు ఎన్టిఆర్ మున్సిపల్ స్కూల్ విద్యార్ధులు, నిమ్మాడ జెడ్పి హైస్కూల్ విద్యార్ధులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని జిల్లా అభివృద్ధి వైపు మళ్లిస్తూఉండటంలో కేంద్ర మంత్రి చొరవ పట్ల ప్రసంశలు లభిస్తున్నాయి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లా టెక్కెర నియోజకవర్గం దడియాల పేట గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ఆలయ వార్షికోత్సవ పూజలు వేడుకగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దశ్రద్ధలతో సామూహిక కుంకుమ అర్చనలు చేసి అమ్మవారిని మొక్కులు తీర్చ్చుకున్నారు.
    3
    శ్రీకాకుళం జిల్లా టెక్కెర నియోజకవర్గం దడియాల పేట గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ఆలయ వార్షికోత్సవ పూజలు వేడుకగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దశ్రద్ధలతో సామూహిక కుంకుమ అర్చనలు చేసి అమ్మవారిని మొక్కులు తీర్చ్చుకున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో ఇద్దరు డాక్టర్లలో డాక్టర్ ఎం. శివరామకృష్ణ ఎఫ్‌పి క్యాంప్‌కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన డాక్టర్ ఎన్. అనూష లంచ్‌కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విధుల్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి, సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఓపి రిజిస్టర్‌ను పరిశీలించి 39 మంది రోగులు నమోదు అయినట్లు గుర్తించారు. అలాగే మందుల స్టాక్ రూమ్, స్టాక్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు. వార్డులో బెడ్స్‌తో పాటు మెడిసిన్ బాక్సులు నిల్వ ఉంచడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో ఇద్దరు డాక్టర్లలో డాక్టర్ ఎం. శివరామకృష్ణ ఎఫ్‌పి క్యాంప్‌కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన డాక్టర్ ఎన్. అనూష లంచ్‌కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విధుల్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.
వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి, సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ఓపి రిజిస్టర్‌ను పరిశీలించి 39 మంది రోగులు నమోదు అయినట్లు గుర్తించారు. అలాగే మందుల స్టాక్ రూమ్, స్టాక్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు.
వార్డులో బెడ్స్‌తో పాటు మెడిసిన్ బాక్సులు నిల్వ ఉంచడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    8 hrs ago
  • గ్రామ సర్పంచులకు ఘన సత్కారం మంగళవారం హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాల ముగింపు సభకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సర్పంచుల పరిపాలన విధానం,గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి, వారి కృషిని ప్రశంసించారు.గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీడీవో కాళీ ప్రసాద్, మండల అధ్యక్షులు దారపు డిల్లేశ్వరరావు ,ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతి రావు , జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు , హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు,సర్పంచు ప్రతినిధులు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    గ్రామ సర్పంచులకు ఘన సత్కారం
మంగళవారం హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాల ముగింపు సభకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సర్పంచుల పరిపాలన విధానం,గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి, వారి కృషిని ప్రశంసించారు.గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీడీవో కాళీ ప్రసాద్, మండల అధ్యక్షులు దారపు డిల్లేశ్వరరావు ,ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతి రావు , జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు , హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు,సర్పంచు ప్రతినిధులు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • विशाखापट्टनम में श्रद्धा वॉकर जैसा कांड: अवैध संबंधों में कत्ल, प्रेमिका की लाश को काटकर फ्रिज में छिपायाविशाखापट्टनम में एक शख्स ने महिला से मामूली बहस के बाद बेरहमी से हत्या कर दी.आरोपी यहीं नहीं रुका, उसने महिला के शव के कई टुकड़े किए और फ्रिज में डाल दिया. आरोपी पति को गिरफ्तार कर लिया गया है. विशाखापत्तनम: विशाखापट्टनम की एक दिल दहला देने वाली घटना ने फिर एक बार श्रद्धा वॉकर हत्याकांड की याद दिला दी. यहां एक शख्स ने महिला से मामूली बहस के बाद बेरहमी से हत्या कर दी.आरोपी यहीं नहीं रुका, उसने महिला के शव के कई टुकड़े किए और फ्रिज में डाल दिया. आरोपी पति को गिरफ्तार कर लिया गया है. हत्यारा रवींद्र मूल रूप से आंध्र प्रदेश के विजयनगरम जिले के राजम का रहने वाला है और वर्तमान में विशाखापत्तनम के गाजुवाका (एलवी नगर) में रह रहा था. आरोपीका मृतक महिला से अवैध संबंध था. विशाखापट्टनम की इस रूह कंपा देने वाली घटना की डिटेल दिए देते हैं. 35 साल के रवींद्र ने शादीशुदा होने के बाद भी 29 साल की मोनिका से अवैध संबंध था. मोनिका विशाखापत्तनम की रहने वाली है तो रवींद्र मूल रूप से आंध्र प्रदेश के विजयनगरम जिले के राजम का रहने वाला है और वर्तमान में विशाखापत्तनम के गाजुवाका (एलवी नगर) में रह रहा था. कैसे हुई घटना? पुलिस के अनुसार कुछ हफ्ते पहले रवींद्र की पत्नी अपने मायके (विजयनगरम) गई हुई थी. रवींद्र ने रविवार दोपहर को मोनिका को अपने घर बुलाया.दोनों कई घंटों तक घर पर ही थे. शाम के समय दोनों के बीच किसी बात को लेकर झगड़ा शुरू हो गया. गुस्से में आकर रवींद्र ने चाकू से गोदकर मोनिका की हत्या कर दी. हत्या करने के बाद आरोपी रवींद्र ने घर के अंदर ही मोनिका के शव के कई टुकड़े किए और शव के कुछ हिस्सों को बैग में भरकर ठिकाने लगाने के लिए एक सुनसान जगह पर फेंक दिया, जबकि बाकी हिस्सों को अपने ही घर के फ्रिज (refrigerator) में छिपाकर रख दिया.
    1
    विशाखापट्टनम में श्रद्धा वॉकर जैसा कांड: अवैध संबंधों में कत्ल, प्रेमिका की लाश को काटकर फ्रिज में छिपायाविशाखापट्टनम में एक शख्स ने महिला से मामूली बहस के बाद बेरहमी से हत्या कर दी.आरोपी यहीं नहीं रुका, उसने महिला के शव के कई टुकड़े किए और फ्रिज में डाल दिया. आरोपी पति को गिरफ्तार कर लिया गया है.
विशाखापत्तनम:
विशाखापट्टनम  की एक दिल दहला देने वाली घटना ने फिर एक बार श्रद्धा वॉकर हत्याकांड की याद दिला दी. यहां एक शख्स ने महिला से मामूली बहस के बाद बेरहमी से हत्या कर दी.आरोपी यहीं नहीं रुका, उसने महिला के शव के कई टुकड़े किए और फ्रिज में डाल दिया. आरोपी पति को गिरफ्तार कर लिया गया है. हत्यारा रवींद्र मूल रूप से आंध्र प्रदेश के विजयनगरम जिले के राजम का रहने वाला है और वर्तमान में विशाखापत्तनम के गाजुवाका (एलवी नगर) में रह रहा था. आरोपीका मृतक महिला से अवैध संबंध था.
विशाखापट्टनम की इस रूह कंपा देने वाली घटना की डिटेल दिए देते हैं. 35 साल के रवींद्र ने शादीशुदा होने के बाद भी 29 साल की मोनिका से अवैध संबंध था. मोनिका विशाखापत्तनम की रहने वाली है तो रवींद्र मूल रूप से आंध्र प्रदेश के विजयनगरम जिले के राजम का रहने वाला है और वर्तमान में विशाखापत्तनम के गाजुवाका (एलवी नगर) में रह रहा था. 
कैसे हुई घटना?
पुलिस के अनुसार कुछ हफ्ते पहले रवींद्र की पत्नी अपने मायके (विजयनगरम) गई हुई थी. रवींद्र ने रविवार दोपहर को मोनिका को अपने घर बुलाया.दोनों कई घंटों तक घर पर ही थे. शाम के समय दोनों के बीच किसी बात को लेकर झगड़ा शुरू हो गया. गुस्से में आकर रवींद्र ने चाकू से गोदकर मोनिका की हत्या कर दी. हत्या करने के बाद आरोपी रवींद्र ने घर के अंदर ही मोनिका के शव के कई टुकड़े किए और शव के कुछ हिस्सों को बैग में भरकर ठिकाने लगाने के लिए एक सुनसान जगह पर फेंक दिया, जबकि बाकी हिस्सों को अपने ही घर के फ्रिज (refrigerator) में छिपाकर रख दिया.
    user_अन्नू पाल
    अन्नू पाल
    Visakhapatnam (Rural), Visakhapatanam•
    10 hrs ago
  • ఇంటి నుండి పని రోజుకు 4-5 గంటల వని చేను ₹20,000 ₹40,000
    1
    ఇంటి నుండి పని 
రోజుకు 4-5 గంటల వని చేను
₹20,000 ₹40,000
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    విశాఖపట్నం (గ్రామీణ), విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • గిరి గ్రామాలలో ఇటుకల పండగ ప్రస్తుతం ఘనంగా కొనసాగుతోంది. ఈ పండగను గిరిజనులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పండగ ప్రారంభానికి ముందు గ్రామ పూజారి (గురుమై) ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక గుడ్డును ప్రతిష్ఠిస్తారు. అనంతరం గ్రామస్తులు రాళ్లతో ఆ గుడ్డును పగలగొట్టేందుకు ప్రయత్నిస్తారు. గుడ్డును పగలగొట్టిన వ్యక్తిని ప్రత్యేకంగా సత్కరించి ఊరేగింపు నిర్వహిస్తారు. అంతేకాకుండా విజేతకు నగదు బహుమతి కూడా అందజేస్తారు.
    1
    గిరి గ్రామాలలో ఇటుకల పండగ ప్రస్తుతం ఘనంగా కొనసాగుతోంది. ఈ పండగను గిరిజనులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పండగ ప్రారంభానికి ముందు గ్రామ పూజారి (గురుమై) ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక గుడ్డును ప్రతిష్ఠిస్తారు. అనంతరం గ్రామస్తులు రాళ్లతో ఆ గుడ్డును పగలగొట్టేందుకు ప్రయత్నిస్తారు. గుడ్డును పగలగొట్టిన వ్యక్తిని ప్రత్యేకంగా సత్కరించి ఊరేగింపు నిర్వహిస్తారు. అంతేకాకుండా విజేతకు నగదు బహుమతి కూడా అందజేస్తారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • వల్లే వలస జిల్లా స్థాయి బలప్రదర్శన పోటీల విజేతలు. శ్రీరామనవమి నవమి సందర్భంగా సంతబొమ్మాలి మండలం వల్లే వలస శ్రీ చిన్మనయానంద స్వామి ఆలయము వద్ద బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ పురుషులు,మహిళలు, తీతసంగిడి, ఈడుపుసంగిడి లో హోరా హోరీగా తలబడి క్రీడా వాతావరణాన్ని కల్పించారు పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు, పరిసర గ్రామ ప్రజలు తరలివచ్చి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వెళ్లే వలసశ్రీ చిన్మణానంద ఆశ్రమ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంత గ్రామ పెద్దలు సహాయ, సహకారాలతో నిర్వహించబడ్డాయి.పోటీలకు మాజీ జాతీయ వెయిట్ లిఫ్టర్ శ్రీ పిలక ధనుంజయ కుమార్ మాస్టర్ వ్యవహరించారు.. గెలుపొందిన విజేతలు వెయిట్ లిఫ్టింగ్(పురుషులు) లో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు (నిమ్మడ), ద్వితీయ బహుమతి బొంగు నాగరాజ్(నరసన్నపేట), తృతీయ బహుమతి భిన్నాల యోగేశ్వరరావు (శ్యామ్ పాలెం ) గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్ (మహిళా ) విభాగం నుండి ప్రథమ బహుమతి దుబ హేమశ్రీ (బోరవెల్లి), ద్వితీయ బహుమతి శనగల ఝాన్సీ (టెక్కలి ), తృతీయ బహుమతి తాలాడ కావ్య( గార మండలం ) విజేతలు గా నిలిచారు. తీత సంగిడి లో ప్రథమ బహుమతి గేదెల సత్యనారాయణ(ఒప్పంగి), ద్వితీయ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) తృతీయ బహుమతి పాలిన రాజారావు (వానవిష్ణుపురం) గెలుపొందారు. ఈడుపు సంగిడిలో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) ద్వితీయ బహుమతి ఆవాల వసంతరావు(చింతవానిపేట) తృతీయ బహుమతి గేదెల సత్యనారాయణ (ఒప్పంగి) కైవసం చేసుకున్నారు.వీరికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి అప్పన్న ,గూట్ల మల్లేశ్వరరావు సర్పంచ్ వడ్డీ వాడ, సూరిబాబు మాస్టర్, శ్రీ సచ్చిదానంద స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కటారి పురుషోత్తం కుటుంబ సభ్యులు, ప్రజలు, పరిసర ప్రాంతా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో బహుమతి ప్రధానము జరిగింది.
    4
    వల్లే వలస జిల్లా స్థాయి బలప్రదర్శన పోటీల విజేతలు.
శ్రీరామనవమి నవమి సందర్భంగా సంతబొమ్మాలి మండలం వల్లే వలస శ్రీ చిన్మనయానంద స్వామి ఆలయము వద్ద బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ పురుషులు,మహిళలు, తీతసంగిడి, ఈడుపుసంగిడి లో హోరా హోరీగా తలబడి క్రీడా వాతావరణాన్ని కల్పించారు పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు, పరిసర గ్రామ ప్రజలు తరలివచ్చి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వెళ్లే వలసశ్రీ చిన్మణానంద ఆశ్రమ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంత గ్రామ పెద్దలు సహాయ, సహకారాలతో నిర్వహించబడ్డాయి.పోటీలకు మాజీ జాతీయ వెయిట్ లిఫ్టర్ శ్రీ పిలక ధనుంజయ కుమార్ మాస్టర్ వ్యవహరించారు.. గెలుపొందిన విజేతలు వెయిట్ లిఫ్టింగ్(పురుషులు) లో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు (నిమ్మడ), ద్వితీయ బహుమతి బొంగు నాగరాజ్(నరసన్నపేట), తృతీయ బహుమతి భిన్నాల యోగేశ్వరరావు (శ్యామ్ పాలెం ) గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్ (మహిళా ) విభాగం నుండి ప్రథమ బహుమతి దుబ హేమశ్రీ (బోరవెల్లి), ద్వితీయ బహుమతి శనగల ఝాన్సీ (టెక్కలి ), తృతీయ బహుమతి తాలాడ కావ్య( గార మండలం ) విజేతలు గా నిలిచారు. తీత సంగిడి లో ప్రథమ బహుమతి గేదెల సత్యనారాయణ(ఒప్పంగి), ద్వితీయ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) తృతీయ బహుమతి పాలిన రాజారావు (వానవిష్ణుపురం) గెలుపొందారు. ఈడుపు సంగిడిలో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) ద్వితీయ బహుమతి ఆవాల వసంతరావు(చింతవానిపేట) తృతీయ బహుమతి గేదెల సత్యనారాయణ (ఒప్పంగి) కైవసం చేసుకున్నారు.వీరికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  రెడ్డి అప్పన్న ,గూట్ల మల్లేశ్వరరావు సర్పంచ్ వడ్డీ వాడ, సూరిబాబు మాస్టర్, శ్రీ సచ్చిదానంద స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కటారి పురుషోత్తం కుటుంబ సభ్యులు, ప్రజలు, పరిసర ప్రాంతా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో బహుమతి ప్రధానము జరిగింది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.