కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 8న కళ్ళకు గంతులు కట్టుకొని నిరసన పలాస నియోజకవర్గంలో మందస పలాస ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అన్ని గ్రామాలలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు,కార్యదర్శి జోగి అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిలి రామారావు,సిపిఎం నాయకులు కొనారి మోహన్ రావు లు మాట్లాడుతూ తమిళనాడు పెరంబూర్ లో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నారని, నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి గారు పర్యావరణానికి ఏర్పోర్ట్ వలన ముప్పందని పర్యావరణానికి తీవ్ర నష్టమని తమిళనాడు ముఖ్యమంత్రి విజయం పెరంబూర్ ఎయిర్పోర్ట్ రద్దు చేశారని, ఇది మన ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు.కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దాన ప్రజల భూములను ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని ప్రశ్నించారు. ఎన్నికల్లో జీడీకి గిట్టుబాటు ధర ఇస్తామని జీడిబోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దానాన్ని విధ్వంసానికి పూనుకోవడం ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా? అని ప్రశ్నించారు.ఏకకాలంలో నాలుగు పంటలు పండే పచ్చని ఉద్దానం పర్యావరణం పరంగా ప్రకృతి వైపరీత్యాల నుండి, సునామీల నుండి శ్రీకాకుళం జిల్లాను కాపాడుతున్న ఉద్దానాన్ని మీరు స్మశానం చేయదలుచుకున్నారా అని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో అనేక గ్రామాలు,వేలాది ఎకరాల భూమి బలవంతంగా గుంజుకుంటే వేలాదిమంది రైతులు, కార్మికులు,వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయి నిరాశ్రయులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా ఉన్న మీరు ఈ జిల్లా అభివృద్ధికి చేసింది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగారి పక్క గ్రామం కాకరపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో 2020 ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకొని ముగ్గురు చంపి పొట్టన పెట్టుకొని ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధపు ప్రసారాలతో ప్రజలను ఎన్నాళ్లు మోసం చేయలేరని,ప్రజలు చైతన్యంతో తిప్పికొడతారని అన్నారు,కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూములు జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు పి దానేసు, జనశక్తి నాయకులు కోనేరు రమేష్,ఎ పి రైతు సంఘం నాయకులు టి అజయ్ కుమార్,ఎంపళ్ళ కామేశ్వరరావు వామపక్షాల నాయకులు యన్ గణపతి, పి వైకుంఠ రావు, జి బాలకృష్ణ,జుత్తు వీరాస్వామి, పి నాగేశ్వరావు, సి హెచ్ రవి, పౌరహక్కుల నాయకులు పి జోగారావు,జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పోరాటకమిటి నాయకులు బత్తిని లక్ష్మణరావు,గుంటు లోకనాధం,నల్ల పరుశురాం, పొట్టి ధర్మారావు గుంటు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 8న కళ్ళకు గంతులు కట్టుకొని నిరసన పలాస నియోజకవర్గంలో మందస పలాస ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అన్ని గ్రామాలలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు,కార్యదర్శి జోగి అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిలి రామారావు,సిపిఎం నాయకులు కొనారి మోహన్ రావు లు మాట్లాడుతూ తమిళనాడు పెరంబూర్ లో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నారని, నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి గారు పర్యావరణానికి ఏర్పోర్ట్ వలన ముప్పందని పర్యావరణానికి తీవ్ర నష్టమని తమిళనాడు ముఖ్యమంత్రి విజయం పెరంబూర్ ఎయిర్పోర్ట్ రద్దు చేశారని, ఇది మన ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు.కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దాన ప్రజల భూములను ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని ప్రశ్నించారు. ఎన్నికల్లో జీడీకి గిట్టుబాటు ధర ఇస్తామని జీడిబోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దానాన్ని విధ్వంసానికి పూనుకోవడం ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా? అని ప్రశ్నించారు.ఏకకాలంలో నాలుగు పంటలు పండే పచ్చని ఉద్దానం పర్యావరణం పరంగా ప్రకృతి వైపరీత్యాల నుండి, సునామీల నుండి శ్రీకాకుళం జిల్లాను కాపాడుతున్న ఉద్దానాన్ని మీరు స్మశానం చేయదలుచుకున్నారా అని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో అనేక గ్రామాలు,వేలాది ఎకరాల భూమి బలవంతంగా గుంజుకుంటే వేలాదిమంది రైతులు, కార్మికులు,వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయి నిరాశ్రయులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా ఉన్న మీరు ఈ జిల్లా అభివృద్ధికి చేసింది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగారి పక్క గ్రామం కాకరపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో 2020 ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకొని ముగ్గురు చంపి పొట్టన పెట్టుకొని ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధపు ప్రసారాలతో ప్రజలను ఎన్నాళ్లు మోసం చేయలేరని,ప్రజలు చైతన్యంతో తిప్పికొడతారని అన్నారు,కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూములు జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు పి దానేసు, జనశక్తి నాయకులు కోనేరు రమేష్,ఎ పి రైతు సంఘం నాయకులు టి అజయ్ కుమార్,ఎంపళ్ళ కామేశ్వరరావు వామపక్షాల నాయకులు యన్ గణపతి, పి వైకుంఠ రావు, జి బాలకృష్ణ,జుత్తు వీరాస్వామి, పి నాగేశ్వరావు, సి హెచ్ రవి, పౌరహక్కుల నాయకులు పి జోగారావు,జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పోరాటకమిటి నాయకులు బత్తిని లక్ష్మణరావు,గుంటు లోకనాధం,నల్ల పరుశురాం, పొట్టి ధర్మారావు గుంటు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
- వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.1
- సంతకవిటి : అల్పపీడనం ప్రభావంతో నాగావళి నది కి భారీ గా వరద నీరు సంతకవిటి మండలం రంగరాయ పురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టు కు 10460 క్యూసిక్కుల నీరు ప్రవహిస్తుoదని ఆయకట్టు ఏ ఈ శివాజీ తెలిపారు. దీంతో దిగివకు నీరు విడిచిపెడుతున్నామని నదిలోకి ఎవరు దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.1
- బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన1
- విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.1
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు1
- కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.1