గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 9 ఐ 3 న్యూస్ /* *హెచ్ .పి. వి టీకా*--- *మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ* *కవచం*..... *చందన, రవీందర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్* సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు ఈరోజు "*అంతర్జాతీయ మహిళా దినోత్సవం*" పురస్కరించుకొని 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్ .పి.వి (ఉమెన్ పాపిలోమా వైరస్)టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *ప్రజా పాలన- ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక* లో భాగంగా 15 సంవత్సరాల లోపు మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా... గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి చందన ,రవీందర్. స్థానిక వార్డు కౌన్సిలర్ బొగ్గుల స్వప్న, HPV వ్యాక్సిన్ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా .. మాట్లాడుతూ. మన దేశ ప్రగతి నివేదికలో మహిళలకు గర్భాశయ క్యాన్సర్ చాలామంది చనిపోతున్నారని గ్రహించి 14 నుండి 15 సంవత్సరాలు లోపు బాలికలకు *ఒక డోసు హెచ్. పి. వి. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చునన్నారు*. చిన్న వయసులోనే ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చునన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ స్థానిక వార్డు కౌన్సిలర్ బొగ్గుల స్వప్న గారు ఈ సందర్భంగా మాట్లాడుతూHPV వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారని , మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు ఆరోగ్యం రక్షణకు ఒక కవచంగా పనిచేస్తుందని కొనియాడినారు. 15 సంవత్సరాల లోపు బాలికల తల్లిదండ్రులు అందరు అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా పిలుపునిచ్చారు. గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూHPV ఈ టీక వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండయని, ఇది మన హాస్పిటల్ లో అందుబాటులో ఉంటుందని, రుతుస్రావం జరుగుతున్న సమయంలో కూడా ఈ టీకా తీసుకోవచ్చునని, చిన్న వయసులోనే ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చునని, మహిళల ఆరోగ్య రక్షణలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుంది అన్నారు. ఈ టీకా పూర్తిగా సురక్షమైందని, గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చునని అభివర్ణించారు . ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, హాస్పిటల్ ఆర్.ఎం.ఓ డాక్టర్ రాము డాక్టర్ శ్రీధర్ డాక్టర్ ప్రణయ శ్రీరిగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్బెర్ సింగ్ అమ్మిదిపూర్ పురప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రణయ్ రాజ్, హాస్పిటల్ హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మహారాజ్ భాను, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, శ్రీరిగిరిపల్లి, ఆమ్మిదిపూర్ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మంజుల, స్వప్న, సుజాత,రాణి సంతోష , జుబేదా బేగం , మహేశ్వరి హాస్పిటల్స్ పారామెడికల్, మరియు సానిటరీ సిబ్బంది, బాలికల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినారు.
గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 9 ఐ 3 న్యూస్ /* *హెచ్ .పి. వి టీకా*--- *మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ* *కవచం*..... *చందన, రవీందర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్* సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు ఈరోజు "*అంతర్జాతీయ మహిళా దినోత్సవం*" పురస్కరించుకొని 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్ .పి.వి (ఉమెన్ పాపిలోమా వైరస్)టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *ప్రజా పాలన- ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక* లో భాగంగా 15 సంవత్సరాల లోపు మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా... గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి చందన ,రవీందర్. స్థానిక వార్డు కౌన్సిలర్ బొగ్గుల స్వప్న, HPV వ్యాక్సిన్ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ..
మాట్లాడుతూ. మన దేశ ప్రగతి నివేదికలో మహిళలకు గర్భాశయ క్యాన్సర్ చాలామంది చనిపోతున్నారని గ్రహించి 14 నుండి 15 సంవత్సరాలు లోపు బాలికలకు *ఒక డోసు హెచ్. పి. వి. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చునన్నారు*. చిన్న వయసులోనే ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చునన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ స్థానిక వార్డు కౌన్సిలర్ బొగ్గుల స్వప్న గారు ఈ సందర్భంగా మాట్లాడుతూHPV వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారని , మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు ఆరోగ్యం రక్షణకు ఒక కవచంగా పనిచేస్తుందని కొనియాడినారు. 15 సంవత్సరాల లోపు బాలికల తల్లిదండ్రులు అందరు అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా పిలుపునిచ్చారు. గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూHPV ఈ టీక వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండయని, ఇది మన హాస్పిటల్ లో అందుబాటులో ఉంటుందని, రుతుస్రావం జరుగుతున్న సమయంలో కూడా ఈ టీకా
తీసుకోవచ్చునని, చిన్న వయసులోనే ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చునని, మహిళల ఆరోగ్య రక్షణలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుంది అన్నారు. ఈ టీకా పూర్తిగా సురక్షమైందని, గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చునని అభివర్ణించారు . ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, హాస్పిటల్ ఆర్.ఎం.ఓ డాక్టర్ రాము డాక్టర్ శ్రీధర్ డాక్టర్ ప్రణయ శ్రీరిగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్బెర్ సింగ్ అమ్మిదిపూర్ పురప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రణయ్ రాజ్, హాస్పిటల్ హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మహారాజ్ భాను, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, శ్రీరిగిరిపల్లి, ఆమ్మిదిపూర్ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మంజుల, స్వప్న, సుజాత,రాణి సంతోష , జుబేదా బేగం , మహేశ్వరి హాస్పిటల్స్ పారామెడికల్, మరియు సానిటరీ సిబ్బంది, బాలికల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినారు.
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్హౌస్ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మల్లన్నసాగర్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- సిద్దిపేట జిల్లా : యువకుల ర్యాష్ డ్రైవింగ్ పై గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. * గజ్వెల్ మున్సిపల్ సంగాపూర్ రోడ్డు లో ర్యాష్ డ్రైవింగ్ వీడియోను తీసుకున్న యువకులు * ర్యాష్ డ్రైవింగ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకులు * వీడియో వైరల్ గా మారడంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ * మళ్లీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరిక * విద్యార్థులు రాకపోకల సమయంలో పిచ్చి చేష్టలు చేస్తే చర్యలు తప్పవని యువకులను హెచ్చరించిన సీఐ రవి కుమార్1