*తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్ర – వక్రీకరణలపై సెమినార్* *షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సెప్టెంబర్ 17న సాయంత్రం 4:30 గంటలకు* *టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటప్ప వక్తలుగా హాజరు* “తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం – వాస్తవ చరిత్ర, వక్రీకరణలు” అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సెమినార్లో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటప్ప వక్తలుగా పాల్గొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్ర, దాని నేపథ్యం, పోరాట లక్ష్యాలు, చరిత్రపై జరుగుతున్న భిన్న వ్యాఖ్యానాల గురించి ప్రసంగించనున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన మహత్తర ప్రజా పోరాటమని నిర్వాహకులు పేర్కొన్నారు. నాటి జమీందారులు, భూస్వాములు, దేశ్ముఖ్లు, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు, రైతులు సాగించిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ఆ పోరాటంలో అమరులైన ప్రజల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వాస్తవ చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కే. వెంకటయ్య, ఎన్. నర్సిములు, జేవీవీ నాయకులు వెంకటరమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి. కరుణాకర్, ఫరూక్నగర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె. లక్ష్మీదేవమ్మ, బిజిలి సత్యం, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు వలిగే కృష్ణ, మండల కోశాధికారి మహేష్, కేశంపేట మండల ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఏ. వినీత్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్, ఎస్ఎఫ్ఐ షాద్నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొననున్నారు. షాద్నగర్ పట్టణంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని సెప్టెంబర్ 17న జరిగే సెమినార్ను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
*తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్ర – వక్రీకరణలపై సెమినార్* *షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సెప్టెంబర్ 17న సాయంత్రం 4:30 గంటలకు* *టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటప్ప వక్తలుగా హాజరు* “తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం – వాస్తవ చరిత్ర, వక్రీకరణలు” అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సెమినార్లో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటప్ప వక్తలుగా పాల్గొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్ర, దాని నేపథ్యం, పోరాట లక్ష్యాలు, చరిత్రపై జరుగుతున్న భిన్న వ్యాఖ్యానాల గురించి ప్రసంగించనున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన మహత్తర ప్రజా పోరాటమని నిర్వాహకులు పేర్కొన్నారు. నాటి జమీందారులు, భూస్వాములు, దేశ్ముఖ్లు, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు, రైతులు సాగించిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ఆ పోరాటంలో అమరులైన ప్రజల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వాస్తవ చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కే. వెంకటయ్య, ఎన్. నర్సిములు, జేవీవీ నాయకులు వెంకటరమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి. కరుణాకర్, ఫరూక్నగర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె. లక్ష్మీదేవమ్మ, బిజిలి సత్యం, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు వలిగే కృష్ణ, మండల కోశాధికారి మహేష్, కేశంపేట మండల ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఏ. వినీత్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్, ఎస్ఎఫ్ఐ షాద్నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొననున్నారు. షాద్నగర్ పట్టణంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని సెప్టెంబర్ 17న జరిగే సెమినార్ను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
- పెండింగ్ జీతాలు చెల్లించడంతో కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరసన తెలుపడంతో అధికారులు పాలకులు దిగివచ్చి జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేర్ చౌరస్తా వద్ద ఉదయం వేళలో మున్సిపల్ కార్మికులు సమావేశమై పెండింగ్ జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ చైర్మన్కు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు1
- బేగంబజార్లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్లోని బేగంబజార్ ఫీల్ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.1
- _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్. గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/ గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్లోని కోల అభిరామ్ గార్డెన్స్లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.4
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- శ్రీ ఏడుపాయల మనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- బేగంపేట్ ప్రకాష్నగర్లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్లోని ప్రకాష్నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.1