logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యూనిఫాం.. టైలతో కొత్త కళ ఈ ఏడాది ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపికైన కాశీంపూర్‌ తండా ఎంపీపీఎస్‌. విద్యార్థుల్లో కొత్త ఉత్సవం. మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: యూనిఫాం.. టైలు చేతికందడంతో కాశీంపూర్‌ తండా ఎంపీపీఎస్‌ విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఏడాది ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపికైన ఈ పాఠశాలలో మంగళవారం సర్పంచ్‌ రామచంద్రనాయక్‌ విద్యార్థులకు యూనిఫాం, టైలను పంపిణీ చేశారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపిక కావడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

3 hrs ago
user_మహమ్మద్
మహమ్మద్
నిజాంపేట, మెదక్, తెలంగాణ•
3 hrs ago
afc71cf9-bc7b-430b-a74e-e80f5155dd6d

యూనిఫాం.. టైలతో కొత్త కళ ఈ ఏడాది ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపికైన కాశీంపూర్‌ తండా ఎంపీపీఎస్‌. విద్యార్థుల్లో కొత్త ఉత్సవం. మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: యూనిఫాం.. టైలు చేతికందడంతో కాశీంపూర్‌ తండా ఎంపీపీఎస్‌ విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఏడాది ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపికైన ఈ పాఠశాలలో మంగళవారం సర్పంచ్‌ రామచంద్రనాయక్‌ విద్యార్థులకు యూనిఫాం, టైలను పంపిణీ చేశారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఎంపిక కావడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హెల్మెట్.. ప్రాణాలకు రక్షణ కవచం వినాయకుడి దర్శనానికి వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్లాలి – ఎస్పీ రాజేష్ చంద్ కామారెడ్డి, సెప్టెంబర్ 15: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. ఎస్పీ వినూత్న ఆలోచనకు అనుగుణంగా కామారెడ్డి పోలీసులు చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా తీర్చిదిద్దారు. హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ‘హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు. “వినాయకుడి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాలి. వచ్చే ఏడాది కూడా స్వామివారి దర్శనానికి రావాలి. అందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, జాగ్రత్తగా ప్రయాణించాలి” అని ఎస్పీ పిలుపునిచ్చారు. పండుగల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తారని, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వేగ నియంత్రణ పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. భక్తి.. బాధ్యత.. భద్రత అనే సందేశంతో పట్టణంలోని వివిధ వినాయక మండపాల వద్ద కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు జరిమానాలు, కేసుల కోసమే కాదని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, డీఎస్పీ ఎస్. మధుసూదన్, పట్టణ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, ట్రాఫిక్ ఆర్‌ఎస్ఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    హెల్మెట్.. ప్రాణాలకు రక్షణ కవచం వినాయకుడి దర్శనానికి వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్లాలి
– ఎస్పీ రాజేష్ చంద్
కామారెడ్డి, సెప్టెంబర్ 15:  వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. ఎస్పీ వినూత్న ఆలోచనకు అనుగుణంగా కామారెడ్డి పోలీసులు చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా తీర్చిదిద్దారు. హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ‘హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.  ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు. “వినాయకుడి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాలి. వచ్చే ఏడాది కూడా స్వామివారి దర్శనానికి రావాలి. అందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, జాగ్రత్తగా ప్రయాణించాలి” అని ఎస్పీ పిలుపునిచ్చారు. పండుగల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తారని, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వేగ నియంత్రణ పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
భక్తి.. బాధ్యత.. భద్రత అనే సందేశంతో పట్టణంలోని వివిధ వినాయక మండపాల వద్ద కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు జరిమానాలు, కేసుల కోసమే కాదని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, డీఎస్పీ ఎస్. మధుసూదన్, పట్టణ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, ట్రాఫిక్ ఆర్‌ఎస్ఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు ఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.
    2
    దంతాలపల్లి

 *ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* 

ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ
దంతాలపల్లి
*ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* 
ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ
కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు
ఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన
పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన
తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు
ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్
బాధితుల  ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో మహా గర్జన సభ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో సంగమేశ్వర గౌడ్ మాట్లాడుతూ..1-03-2026 నుంచి 31-08-2026 వరకు చేసిన జమ కర్చుల గురించి చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు
    1
    రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో మహా గర్జన సభ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో సంగమేశ్వర గౌడ్ మాట్లాడుతూ..1-03-2026 నుంచి 31-08-2026 వరకు చేసిన జమ కర్చుల గురించి చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు
    user_Abdul Raheem
    Abdul Raheem
    నిజాంసాగర్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి! హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.
    1
    కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌ మాట్లాడుతూ..
హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి!
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు.
ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    17 min ago
  • ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు రాజీ వద్దు పాఠంలో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్, సెప్టెంబర్ 15 — మెతుకు సీమ టైమ్స్ ప్రతినిధి: “ప్రాథమిక దశలోనే విద్యార్థికి బలమైన పునాది వేస్తే.. భవిష్యత్తులో అతని విద్యా ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది” అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మంగళవారం రామాయంపేట, అక్కన్నపేట మండలాల్లోని ప్రీ-ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో.. కేవలం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో సరిపెట్టకుండా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు? పిల్లలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? నేర్చుకున్న విషయాలను తిరిగి చెప్పగలుగుతున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారి పునాదే.. రేపటి భవిష్యత్తు ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లల్లో చదవడం, రాయడం, సంఖ్యలపై ప్రాథమిక అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. “ప్రతి చిన్నారి చదవాలి.. అర్థం చేసుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది” అనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
    1
    ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 
పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి
ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి
మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు రాజీ వద్దు
పాఠంలో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, సెప్టెంబర్ 15 — మెతుకు సీమ టైమ్స్ ప్రతినిధి:
“ప్రాథమిక దశలోనే విద్యార్థికి బలమైన పునాది వేస్తే.. భవిష్యత్తులో అతని విద్యా ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది” అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
మంగళవారం రామాయంపేట, అక్కన్నపేట మండలాల్లోని ప్రీ-ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో..
కేవలం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో సరిపెట్టకుండా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు? పిల్లలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? నేర్చుకున్న విషయాలను తిరిగి చెప్పగలుగుతున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
చిన్నారి పునాదే.. రేపటి భవిష్యత్తు
ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లల్లో చదవడం, రాయడం, సంఖ్యలపై ప్రాథమిక అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి
విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
“ప్రతి చిన్నారి చదవాలి.. అర్థం చేసుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది” అనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
  • రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం శివంపేట మండలం గూడూరు గ్రామంలోని ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత మేరకు వచ్చింది.. అందులో ఎంత ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అందించారు.. ప్రస్తుతం మిల్లులో ఎంత ధాన్యం నిల్వ ఉంది అనే వివరాలను అధికారులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేస్తూ క్షేత్రస్థాయి నిల్వలను లెక్కించారు. ధాన్యం కేటాయింపులు, బియ్యం సరఫరా, ప్రస్తుత నిల్వలకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.
    1
    రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు
రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం శివంపేట మండలం గూడూరు గ్రామంలోని ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత మేరకు వచ్చింది.. అందులో ఎంత ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అందించారు.. ప్రస్తుతం మిల్లులో ఎంత ధాన్యం నిల్వ ఉంది అనే వివరాలను అధికారులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేస్తూ క్షేత్రస్థాయి నిల్వలను లెక్కించారు. ధాన్యం కేటాయింపులు, బియ్యం సరఫరా, ప్రస్తుత నిల్వలకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    3
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు.
ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు.
అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి
కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.