Shuru
Apke Nagar Ki App…
ధర్మారెడ్డి గ్రామంలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం నాగిరెడ్డిపేట్, ఆగస్టు 1: నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక MPPS పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, చెట్లు ప్రకృతికి అందాన్ని తీసుకురావడమే కాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించి మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు జ్యోతి, ప్రతిభ, అంగన్వాడీ సమన్వయకర్త వజ్రవ్వ, వార్డు సభ్యుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
MALAVATH MAHESH
ధర్మారెడ్డి గ్రామంలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం నాగిరెడ్డిపేట్, ఆగస్టు 1: నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక MPPS పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, చెట్లు ప్రకృతికి అందాన్ని తీసుకురావడమే కాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించి మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు జ్యోతి, ప్రతిభ, అంగన్వాడీ సమన్వయకర్త వజ్రవ్వ, వార్డు సభ్యుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
More news from Kamareddy and nearby areas
- భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.2
- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.1
- రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.1
- బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్హెచ్వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- జపాన్కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.1
- రేలమడుగు కళ్ళు దుకాణంలో బొమ్మ బోరుసు ఆడుతున్న 9 మంది అరెస్ట్ 7910 రూపాయలు నగదు స్వాధీనం ఆర్ సెల్ ఫోన్లు సీజ్ ఎస్పి శ్రీనివాసరావు బొమ్మా బొరుసు ఆడుతున్న 9 మంది అరెస్టు రూ.7,910 నగదు, 6 సెల్ఫోన్లు స్వాధీనం మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో కల్లు దుకాణం వెనుకవైపు బొమ్మా బొరుసు ఆడుతున్న స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మా బొరుసు ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,910 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో శేఖర్, యాదగిరి, చంద్రశేఖర్, ప్రవీణ్, చంద్రం, కిష్టయ్య, పోలె లక్ష్మణ్, దుర్గేష్, నిఖిల్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, జూదం, పేకాట, బొమ్మా బొరుసు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత జూదం, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.1