ధర్మవరం యువతకు ఉద్యోగాల పండుగ... సెప్టెంబర్ 8న మెగా జాబ్ మేళా ఆగస్టు 28న జరగాల్సిన మెగా జాబ్ మేళా సెప్టెంబర్ 8కు వాయిదా 100కు పైగా ప్రముఖ జాతీయ కంపెనీలతో భారీ స్థాయిలో జాబ్ మేళా మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో నిరుద్యోగ యువతకు అపూర్వ అవకాశం – హరీష్ బాబు ధర్మవరం, ఆగస్టు 25:– ధర్మవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా తేదీలో మార్పు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ముందుగా ఆగస్టు 28వ తేదీన నిర్వహించాల్సిన ఈ మెగా జాబ్ మేళాను సెప్టెంబర్ 8వ తేదీ మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ప్రత్యేక చొరవతో, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు సంస్కృతి సేవా సమితి సహకారంతో నిర్వహించనున్న ఈ మెగా జాబ్ మేళా ధర్మవరం యువతకు ఉద్యోగ అవకాశాలను నేరుగా అందించే వేదికగా నిలవనుందని హరీష్ బాబు పేర్కొన్నారు. ధర్మవరం ప్రాంతానికి చెందిన అనేక మంది యువత విద్యార్హతలు పూర్తి చేసుకున్నప్పటికీ, సరైన ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలను ధర్మవరం గడ్డపైకి తీసుకువచ్చి, యువతకు ఒకే వేదికపై అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. *-100కు పైగా ప్రముఖ కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.... ఈ మెగా జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ జాతీయ కంపెనీలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని హరీష్ బాబు తెలిపారు. వివిధ రంగాల్లోని కంపెనీలు తమకు అవసరమైన సిబ్బంది ఎంపిక కోసం అభ్యర్థులకు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం యువత కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా... కంపెనీలనే ధర్మవరం యువత వద్దకు తీసుకురావడం ఈ మెగా జాబ్ మేళా ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల నుంచి అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ బాబు పిలుపునిచ్చారు. **10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత.... ఈ మెగా జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ, డి.ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం మరియు కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వివిధ ఉద్యోగాలకు వేతనాలు కూడా ఆయా సంస్థలు, ఉద్యోగ స్వభావాన్ని బట్టి ఉంటాయని తెలిపారు. *-సెప్టెంబర్ 8న ఉదయం 9 గంటలకు ప్రారంభం.... సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 9 గంటలకు ధర్మవరం–బత్తలపల్లి రోడ్డులోని CNB ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హరీష్ బాబు వెల్లడించారు. అభ్యర్థులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని, జాబ్ మేళాకు హాజరయ్యే సమయంలో తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అవసరమైన ఇతర పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. **యువత ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.... ధర్మవరం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగాన్ని సాధించాలన్నదే ఆయన ఆకాంక్ష. అందుకే ప్రముఖ కంపెనీలను ధర్మవరం వరకు తీసుకువచ్చి ఇంత పెద్ద స్థాయిలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాం. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి అని హరీష్ బాబు పేర్కొన్నారు. ఆగస్టు 28న జరగాల్సిన జాబ్ మేళా ఇప్పుడు సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా పడింది. తేదీ మార్పును అభ్యర్థులందరూ గమనించి, కొత్త తేదీ ప్రకారం ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని జాబ్ మేళాకు హాజరుకావాలి. ఒక్క అవకాశం కూడా వృథా కాకుండా ప్రతి నిరుద్యోగ యువకుడు, యువతి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్మవరం యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతాయని హరీష్ బాబు తెలిపారు. **రిజిస్ట్రేషన్ తప్పనిసరి.... ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యం (Naipunyam) పోర్టల్ ద్వారా లేదా పోస్టర్లో అందించిన QR కోడ్ను స్కాన్ చేసి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అధికారిక పోర్టల్లోనూ జాబ్ ఫెయిర్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి: 8688466361, 9390176421, 9966682246, ధర్మవరం యువతకు ఇదొక సువర్ణావకాశం... ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి కార్యాలయం ఇన్చార్జ్ హరీష్ బాబు కోరారు.
ధర్మవరం యువతకు ఉద్యోగాల పండుగ... సెప్టెంబర్ 8న మెగా జాబ్ మేళా ఆగస్టు 28న జరగాల్సిన మెగా జాబ్ మేళా సెప్టెంబర్ 8కు వాయిదా 100కు పైగా ప్రముఖ జాతీయ కంపెనీలతో భారీ స్థాయిలో జాబ్ మేళా మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో నిరుద్యోగ యువతకు అపూర్వ అవకాశం – హరీష్ బాబు ధర్మవరం, ఆగస్టు 25:– ధర్మవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా తేదీలో మార్పు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ముందుగా ఆగస్టు 28వ తేదీన నిర్వహించాల్సిన ఈ మెగా జాబ్ మేళాను సెప్టెంబర్ 8వ తేదీ మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ప్రత్యేక చొరవతో, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు సంస్కృతి సేవా సమితి సహకారంతో నిర్వహించనున్న ఈ మెగా జాబ్ మేళా ధర్మవరం యువతకు ఉద్యోగ అవకాశాలను నేరుగా అందించే వేదికగా నిలవనుందని హరీష్ బాబు పేర్కొన్నారు. ధర్మవరం ప్రాంతానికి చెందిన అనేక మంది యువత విద్యార్హతలు పూర్తి చేసుకున్నప్పటికీ, సరైన ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలను ధర్మవరం గడ్డపైకి తీసుకువచ్చి, యువతకు ఒకే వేదికపై అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. *-100కు పైగా ప్రముఖ కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.... ఈ మెగా జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ
జాతీయ కంపెనీలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని హరీష్ బాబు తెలిపారు. వివిధ రంగాల్లోని కంపెనీలు తమకు అవసరమైన సిబ్బంది ఎంపిక కోసం అభ్యర్థులకు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం యువత కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా... కంపెనీలనే ధర్మవరం యువత వద్దకు తీసుకురావడం ఈ మెగా జాబ్ మేళా ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల నుంచి అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ బాబు పిలుపునిచ్చారు. **10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత.... ఈ మెగా జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ, డి.ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం మరియు కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వివిధ ఉద్యోగాలకు వేతనాలు కూడా ఆయా సంస్థలు, ఉద్యోగ స్వభావాన్ని బట్టి ఉంటాయని తెలిపారు. *-సెప్టెంబర్ 8న ఉదయం 9 గంటలకు ప్రారంభం.... సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 9 గంటలకు ధర్మవరం–బత్తలపల్లి రోడ్డులోని CNB ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హరీష్ బాబు వెల్లడించారు. అభ్యర్థులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని, జాబ్ మేళాకు హాజరయ్యే సమయంలో తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అవసరమైన ఇతర పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. **యువత ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.... ధర్మవరం
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగాన్ని సాధించాలన్నదే ఆయన ఆకాంక్ష. అందుకే ప్రముఖ కంపెనీలను ధర్మవరం వరకు తీసుకువచ్చి ఇంత పెద్ద స్థాయిలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాం. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి అని హరీష్ బాబు పేర్కొన్నారు. ఆగస్టు 28న జరగాల్సిన జాబ్ మేళా ఇప్పుడు సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా పడింది. తేదీ మార్పును అభ్యర్థులందరూ గమనించి, కొత్త తేదీ ప్రకారం ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని జాబ్ మేళాకు హాజరుకావాలి. ఒక్క అవకాశం కూడా వృథా కాకుండా ప్రతి నిరుద్యోగ యువకుడు, యువతి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్మవరం యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతాయని హరీష్ బాబు తెలిపారు. **రిజిస్ట్రేషన్ తప్పనిసరి.... ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యం (Naipunyam) పోర్టల్ ద్వారా లేదా పోస్టర్లో అందించిన QR కోడ్ను స్కాన్ చేసి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అధికారిక పోర్టల్లోనూ జాబ్ ఫెయిర్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి: 8688466361, 9390176421, 9966682246, ధర్మవరం యువతకు ఇదొక సువర్ణావకాశం... ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి కార్యాలయం ఇన్చార్జ్ హరీష్ బాబు కోరారు.
- శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.1
- ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్” శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెబ్ సిరీస్లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.1
- Dharmavaram market Road Near current office due to drainage water facing health issues Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e. e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu. yours youth rockz4
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- నేపాల్ వరదలకు కారణం ఇదేనా..? బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..! నేపాల్, టిబెట్ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం... హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ భారీ మంచుకొండ ఏకంగా 4 వేల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది. అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో... భారీగా మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి... దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంచుకొండ పడిన ప్రాంతం... బాంబు పేలినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అంటే... ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా..? లేక... హిమాలయాల్లో భారీ మంచుకొండ విరిగిపడి... దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగిందా..? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం... మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద... హిమాలయాల్లో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.1