logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 11 March
user_BHASKAR V
BHASKAR V
భట్టిప్రోలు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
on 11 March
c86d09fa-b7b5-4370-ba08-6215c17e0dce

  • user_, to aZzz)
    , to aZzz)
    Bapatla, Andhra Pradesh
    🛕
    on 1 April
More news from Andhra Pradesh and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ​ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ​ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    1
    మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
​
మహబూబాబాద్ జిల్లా 
మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
​ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
"ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు."
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం ​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం
​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి  ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్  విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు.
జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    21 hrs ago
  • ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు ​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: ​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. ​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. ​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. ​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ​పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు
​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం!
​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు:
​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు.
​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.
​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది"
​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
​పాల్గొన్న నాయకులు:
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    2 hrs ago
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • ​పిఠాపురం: అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పిఠాపురం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో స్థానిక జగ్గయ్య చెరువు రాజీవ్ గృహకల్ప వద్ద నివాస గృహాల్లో సంభవించే అగ్నిప్రమాదాలపై ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యజీవితంలో ఎదురయ్యే అగ్నిప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు. వంట గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలను ప్రత్యక్షంగా వివరించారు. గ్యాస్ లీకైనప్పుడు అనుసరించాల్సిన అత్యవసర పద్ధతులను ప్రదర్శించి చూపారు. అగ్ని భద్రతా నియమాలతో కూడిన కరపత్రాలను స్థానిక నివాసితులకు పంపిణీ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను ఎలా తగ్గించుకోవాలో వివరించారు. గృహాల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు మరియు గ్యాస్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 నంబరుకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ సూచించారు. ​ఈ కార్యక్రమంలో పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానిక గృహకల్ప నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    ​పిఠాపురం: అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పిఠాపురం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో స్థానిక జగ్గయ్య చెరువు రాజీవ్ గృహకల్ప వద్ద నివాస గృహాల్లో సంభవించే అగ్నిప్రమాదాలపై ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యజీవితంలో ఎదురయ్యే అగ్నిప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు.
వంట గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలను ప్రత్యక్షంగా వివరించారు. గ్యాస్ లీకైనప్పుడు అనుసరించాల్సిన అత్యవసర పద్ధతులను ప్రదర్శించి చూపారు.
అగ్ని భద్రతా నియమాలతో కూడిన కరపత్రాలను స్థానిక నివాసితులకు పంపిణీ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను ఎలా తగ్గించుకోవాలో వివరించారు.
గృహాల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు మరియు గ్యాస్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 నంబరుకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఓ సూచించారు.
​ఈ కార్యక్రమంలో పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానిక గృహకల్ప నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    23 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.