ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చింతపల్లి* మండలంలోని ధైర్యపురి తండా గ్రామ పంచాయతీలో *ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ* కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్ ✅ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అత్యంత సంతోషకరమని తెలిపారు. ✅టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదల అవసరాలు ఏమాత్రం పట్టించుకోలేదని, దొరల మనస్తత్వంతో ప్రజలను పీడించారని విమర్శించారు. తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, ఉద్యోగ అవకాశాలు అందాలనే లక్ష్యంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ✅గతంలో పేదలకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారని, ఇప్పుడు పేదలు కూడా సన్న బియ్యంతో గౌరవంగా భోజనం చేయాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. రాష్ట్రంలోని 96 లక్షల కుటుంబాలకు ఏకధాటిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ✅పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఆ బిల్లులను ప్రతి నెలా ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని తెలిపారు. ✅గత ప్రభుత్వాల మాదిరిగా దోపిడీ చేయడం, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ చేయదని, ప్రతి రూపాయిని పొదుపుగా వినియోగిస్తూ తెలంగాణ ప్రజానీకం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ➡️చింతపల్లి మండల కేంద్రంలో PACs ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ➡️చింతపల్లి మండలంలోని గాసిరాం తండాలో హైమాక్స్ లైట్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చింతపల్లి* మండలంలోని ధైర్యపురి తండా గ్రామ పంచాయతీలో *ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ* కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్ ✅ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అత్యంత సంతోషకరమని తెలిపారు. ✅టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో
పేదల అవసరాలు ఏమాత్రం పట్టించుకోలేదని, దొరల మనస్తత్వంతో ప్రజలను పీడించారని విమర్శించారు. తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, ఉద్యోగ అవకాశాలు అందాలనే లక్ష్యంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ✅గతంలో పేదలకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారని, ఇప్పుడు పేదలు కూడా సన్న బియ్యంతో గౌరవంగా భోజనం చేయాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. రాష్ట్రంలోని 96 లక్షల కుటుంబాలకు ఏకధాటిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక
రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ✅పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఆ బిల్లులను ప్రతి నెలా ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని తెలిపారు. ✅గత ప్రభుత్వాల మాదిరిగా దోపిడీ చేయడం, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ చేయదని, ప్రతి రూపాయిని పొదుపుగా వినియోగిస్తూ తెలంగాణ ప్రజానీకం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి
నాయకత్వంలో తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ➡️చింతపల్లి మండల కేంద్రంలో PACs ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ➡️చింతపల్లి మండలంలోని గాసిరాం తండాలో హైమాక్స్ లైట్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- వేమలపల్లి మండలం శేట్టిపాలెం గ్రామంలో యూరియా ఆన్లైన్ విధానాన్ని తీసివేయాలని, రైతాంగానే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు గ్రామ రైతులు పెద్ద ఎత్తున శేట్టిపాలెం గ్రామ కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ముట్టడి చేశారు మరియు యూరియా పంపిణి అడ్డుకున్నారు. పోలీసులు బిజెపి శ్రేణులతో వాగ్వాదం జరగడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ యూరియా ఆన్లైన్ విధానం వల్ల రైతులు గోసపడుతున్నారని,, బుకింగ్ సమయం లో రెండు మూడు నిమిషాల్లోనే యూరియా పూర్తిగా అయిపోతుందని, అన్ని గ్రామాలకు సంబంధించిన కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు యూరియా అందించాలని పక్క ఊరి రైతులకు ఇవ్వడం వల్ల ఇక్కడి గ్రామ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్లైన్ విధానం వల్ల పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆన్లైన్ విధానం తెలియని రైతులు ఒక్క దశలోనూ యూరియా అందలేదని వరి పొలాలకు ఇప్పుడు యూరియా అత్యవసరమని యూరియా అందకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని నిరక్షరాశులయిన రైతులు,మహిళా రైతులు,ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, శెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రైతాంగానికి యూరియా దొరకడం లేదు అని ప్రతిరోజు టన్నుల కొద్దీ యూరియా వస్తున్న యూరియా కొరత గ్రామంలో తీవ్రంగా ఉంది, కోపరేట్ సొసైటీ ఉన్నప్పటికీ యూరియా దొరకపోవడం బాధాకరమని తక్షణమే ప్రత్యేకంగా శెట్టిపాలెం గ్రామ రైతులకు యూరియా తీసుకురావాలని AEO కిషన్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు బోల్లేదు లవయ్య,బీజేపీ గ్రామ వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్, బిజెపి నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, కోల చంద్రయ్య, ఆలకుంట్ల మధు, ఈట మహేష్,జగినాల రమేష్ దుండిగల రేణుక, బోగారి సైదులు, పాలడుగు శంకర్, సతీష్, శీను, మహేష్, రామకృష్ణ, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- చిత్తూరు నగర శివారులోని ఇరువారం క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ కారుపై బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.4
- వరంగల్ : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు పేపర్లు లీక్ అవుతున్నట్లు సిఐడి గుర్తించింది. తాజా విద్యా సంవత్సరంలో వరంగల్ అగ్రికల్చర్ కాలేజీకి చెందిన జూ.అసిస్టెంట్ కార్తీక్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి, విద్యార్థిని జ్యోతి ద్వారా ఈ చైన్ సిస్టమ్ నడిపించినట్లు తేలింది. ఈ లీకేజీ నెట్వర్క్ వరంగల్ నుంచి జగిత్యాల, అశ్వరావుపేట, రాజేంద్రనగర్ సహా పలు జిల్లాలకు విస్తరించడంతో లోతైన విచారణ కొనసాగుతోంది.1
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం....... - ఇదేమిటి అని అడిగితే బూతు మాటలతో ఎదురుదాడి...... - ఇట్లనే చేస్తే హాల్ టికెట్ ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి...... వెల్దండ: మండల కేంద్రాల్లోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు వారం రోజుల నుండి ఉడికి ఉడకని పురువుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం,బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి ప్రిన్సిపాల్ డాం డాం అంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ స్వర్ణ రత్నం ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ, అడిగితే పురుగులను తీసేసి తినండి అంటున్నారని, సమస్య ఎవరికైన చెప్పిన మమ్మల్ని టార్గెట్ చేసేవారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేదని, ఎందుకు మేడం అంటే పాఠశాల లో మౌలిక వసతుల కోసమని చెప్పేది కానీ ఆ డబ్బులతో ఏమీ చేయకుండా సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకునేదని తెలిపారు. ఫెస్టివల్ పార్టీ కానీ, ఫ్రెషర్ పార్టీ కానీ ప్రిన్సిపల్ మైక్ లోనే దుర్భాషలాడేదని, పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నామని, మా ఆరోగ్యాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారని,ఈ ప్రిన్సిపల్ మాకొద్దని, వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తేనే మేము పాఠశాల వెళ్తామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కార్తీక్ కుమార్, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎస్సై కురుమూర్తి హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ఆగ్రహం.......... పురుగుల అన్నం తినలేక గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని దళిత సంఘాల నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్, జంగిలి ఆనంద్, సామెల్, కొయ్యల పుల్లయ్య, గోరటి సుధాకర్, గోరటి సంజీవ, జంగిల్ ప్రవీణ్, ఏకుల వెంకటేష్, దుళ్ల పెద్దయ్య లతో పాటు మరి కొంతమంది నాయకులు ఆగ్రం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారని, వారికి పురుగుల అన్నం ఎట్లా పెడతారని, ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శి గిరి, ఆయా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.6
- హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం4
- *నకిరేకల్ నియోజకవర్గం* *రామన్నపేట మండలం* ఈరోజు రామన్నపేట మండలం *తుర్కపల్లి* గ్రామానికి చెందిన *సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త* *దొడ్డి మారయ్య* గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించి దహన సంస్కారాలకు *ఐదువేల* *రూపాయలు* *(5000/_)* ఆర్థిక సాయం అందజేసిన దైద రవీందర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి ఉప సర్పంచ్ మల్లయ్య జే వెంకన్న ప్రశాంత్ జానయ్య సూరయ్య యాదగిరి శంకర్ వెంకట చారి సాలయ్య నర్సింహ కృష్ణయ్య కుమార్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు1