Shuru
Apke Nagar Ki App…
అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు...... జన్నారం మండలంలోని పోన్కల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లపై వరదనీరు భారీగా నిలిచింది. బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాలలో వరద నీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
P.G. Murthy
అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు...... జన్నారం మండలంలోని పోన్కల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లపై వరదనీరు భారీగా నిలిచింది. బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాలలో వరద నీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆటో బంద్ను విజయవంతం చేయండి ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న చేపట్టనున్న ఆటో బంద్ను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్కుమార్ పిలుపునిచ్చారు. కాగజ్నగర్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లపై పన్నులు, లైసెన్స్, ఫిట్నెస్ తదితర చార్జీల భారాన్ని తగ్గించాలని, రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు సవరించాలని, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులను అరికట్టాలని కోరారు. బంద్లో డ్రైవర్లు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.1
- గుంతలు.. బురదతో ప్రజలకు అవస్థలు . గుడిహత్నూర్ మండలంలోని తోయగూడ గ్రామ రహదారులు గుంతలమయంగా మారాయి. వర్షాలకు బురదమయంగా మారడంతో నడిచేందుకు కూడా వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులపై మొరం మట్టి పోసి మరమ్మతులు చేపట్టాలని కోరారు.1
- ఎల్లారెడ్డిపేట కలెక్టర్ లో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ..చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేదంటే పోరాటాలు తప్పవు. ___ఎస్.వీరయ్య, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు. CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, CITU కార్యాలయం, గోదావరిఖని లో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసులు రెండవ రోజు క్లాసుకు ముఖ్యఅతిథిగా CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య గారు హాజరై CITU నిర్మాణం - కర్తవ్యాలు. అంశం పై క్లాసు బోదించారు. క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలి పోయాయాని అన్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చింది 3 సంవత్సరాలు దగ్గర పడుతుందని అన్నారు ఇప్పటికి హామీలు వేరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకా కాంగ్రేస్ ప్రభుత్వం కు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను హెచ్చరించారి. యూనియన్ గవర్నమెంట్ (మోడీ గవర్నమెంట్) కనీస వేతనాలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతం లో ఉన్న సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్ టి పి సి లాంటి కంపెనిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేకుండా బానిస సాకిరీ చేయాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ లాంటి పేర్ల తో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు అన్నారు.మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల చట్టం 2022 జనవరితో దాని పని అయిపొయింది అన్నారు.ఇప్పుడు నాలుగేండ్లు గడిచింది మోడీ దాని ఊసే మర్చిపోయారని ఇది అత్యంత దారుణం అన్నారు.ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా గోదావరిఖని ప్రాంతం లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ESI వంద పడకల హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం సేకరించారు ఇంత జరిగాక కూడా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించలేదు అన్నారు. ఈ విషయం లో కేంద్ర గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందొ చెప్పాలని అన్నారు.ప్రతి నెల ESI హాస్పిటల్ కు రెండు కోట్ల నలభై లక్షల ఆదాయం వస్తుంది. వంద పడకల హాస్పిటల్ ను నిర్మించడంలో కేంద్రం నిర్లక్ష్యం తాగదన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షం లో రానున్న రోజుల్లో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వేల్పుల కుమారస్వామి CITU జిల్లా అధ్యక్షులు వ్యవహరించగ జిల్లా కార్యదర్శి ఎ. ముత్యం రావు, కోశాధికారి ఎం. రామాచారీ, ఉపాధ్యక్షులు బిక్షపతి,కొమురయ్య, సహాయ కార్యదర్శులు జ్యోతి, రవీందర్,వనజా రాణి, ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు గణేష్,లక్ష్మారెడ్డి, శివ రామ్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.1
- 𝐀 𝐝𝐚𝐲 𝐥𝐚𝐭𝐞, 𝐛𝐮𝐭 𝐭𝐡𝐞 𝐡𝐲𝐩𝐞 𝐢𝐬 𝐚𝐛𝐬𝐨𝐥𝐮𝐭𝐞𝐥𝐲 𝐰𝐨𝐫𝐭𝐡 𝐢𝐭. 🚀 From becoming the first country to land near the Moon’s South Pole to reaching Mars on our very first attempt, India’s space journey is rewriting history. AND THE BEST PART? 𝐖𝐞’𝐫𝐞 𝐨𝐧𝐥𝐲 𝐠𝐞𝐭𝐭𝐢𝐧𝐠 𝐬𝐭𝐚𝐫𝐭𝐞𝐝. 😎 📈1
- ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం................. ఆదిలాబాద్ రూరల్ మండలంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. రూరల్ మండలంతో పాటు పోచ్చర, రాంపూర్, చందా గ్రామాల్లో వర్షం కురియడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.1
- ఇప్పటిదాకా అబద్దాలు చెబుతావు సంజయ్, జువ్వాడి కృష్ణారావు1
- మెగాస్టార్ చిరంజీవి వీరఅభిమానికి చిరు బీమా ఇన్సూరెన్స్ పాలసీ.. పలువురి హర్షం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని వీర అభిమానుల కానుకగా గోదావరిఖనికి చెందిన చిరు వీరాభిమాని రాష్ట్ర చిరంజీవి యువత నేత రోడ్డ శ్రీనివాస్ కు చిరు బీమా ఇన్సూరెన్స్ ను హైదరాబాద్ బ్లడ్ బ్యాంకు నుండి రోడ్డ శ్రీనివాస్ కు అందించారు ఈ ప్రాంతంలో రోడ్డ శ్రీనివాస్ కు ఒక్కడికే ఈ చిరు బీమా రావడం పట్ల ఇక్కడి చిరంజీవి ఫ్యాన్స్ గట్ల రమేష్, నెల కంటి రాము, ఇండ్ల ఓదెలు, బడికెల తిరుపతి, గంధం మహేందర్, ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం* *-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే* చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు. వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత పై అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు... ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్ విజ్ఞప్తి చేశారు..4