logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలి కామారెడ్డి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారులు రాజ్యమేలుతున్న రోజుల్లో అణగారిన వర్గాల అభ్యున్నతికి పండుగ సాయన్న విశేషంగా కృషి చేశారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఆడపిల్లల వివాహాలు నిర్వహించి, అనేక కుటుంబాలకు పెద్దన్నగా అండగా నిలిచారని కొనియాడారు. కేవలం 36 ఏళ్ల జీవితకాలంలోనే బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి పండుగ సాయన్న అని అన్నారు. ఆయనను హతమార్చేందుకు భూస్వాములు కుట్రలు పన్నిన సమయంలో సామాన్య ప్రజలు ఏకమై తిరగబడిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి గొప్ప వీరుడి చరిత్ర, వ్యక్తిత్వం భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, పున్న రాజేశ్వర్, నీల నాగరాజు, గేరిగంటి లక్ష్మీనారాయణ, సునుగూరి భానుప్రకాష్, దాకి అరవింద్, కాళ్ల గణేష్, పిట్ల వేణు, పిల్లి మల్లేష్, చింతల రమేష్, మోడేగామ్ మహేష్, అంజి, శ్రీకాంత్, బట్టు నర్సింలు, ప్రసాద్, బర్ల స్వామి, కనికంటి రమేష్, నర్సింలు, చిట్యాల రమేష్, పిట్ల శంకర్, కనకంటి రమేష్, స్వామి, గోవర్ధన్, సంపత్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

53 min ago
user_KODIPYAKA SAIRAM
KODIPYAKA SAIRAM
Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
53 min ago
44dfb629-d8ec-4a28-b4f8-831a977e78c5

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలి కామారెడ్డి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనలో భూస్వాములు, పెత్తందారులు రాజ్యమేలుతున్న రోజుల్లో అణగారిన వర్గాల అభ్యున్నతికి పండుగ సాయన్న విశేషంగా కృషి చేశారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఆడపిల్లల వివాహాలు నిర్వహించి, అనేక కుటుంబాలకు పెద్దన్నగా అండగా నిలిచారని కొనియాడారు. కేవలం 36 ఏళ్ల జీవితకాలంలోనే బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి పండుగ సాయన్న అని అన్నారు. ఆయనను హతమార్చేందుకు భూస్వాములు కుట్రలు పన్నిన సమయంలో సామాన్య ప్రజలు ఏకమై తిరగబడిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి గొప్ప వీరుడి చరిత్ర, వ్యక్తిత్వం భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీకగా జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, పున్న రాజేశ్వర్, నీల నాగరాజు, గేరిగంటి లక్ష్మీనారాయణ, సునుగూరి భానుప్రకాష్, దాకి అరవింద్, కాళ్ల గణేష్, పిట్ల వేణు, పిల్లి మల్లేష్, చింతల రమేష్, మోడేగామ్ మహేష్, అంజి, శ్రీకాంత్, బట్టు నర్సింలు, ప్రసాద్, బర్ల స్వామి, కనికంటి రమేష్, నర్సింలు, చిట్యాల రమేష్, పిట్ల శంకర్, కనకంటి రమేష్, స్వామి, గోవర్ధన్, సంపత్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్ ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి. ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్  
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్  ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి.  ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు  రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    user_KODIPYAKA SAIRAM
    KODIPYAKA SAIRAM
    Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    47 min ago
  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
    1
    మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  రాఖీ పౌర్ణమి వేడుకలు....
కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    4 hrs ago
  • గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్‌ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్‌–నందగోకుల్‌ రహదారికి డాంబర్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్‌, దయాకర్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
    2
    గుంతల రోడ్డుపై.. నిరసన బాట!
డాంబర్‌ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్‌–నందగోకుల్‌ రహదారికి డాంబర్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్‌, దయాకర్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
    user_మహమ్మద్
    మహమ్మద్
    నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • బాన్సువాడలో రాఖీ పండుగ సందడి రాఖీల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్‌ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్‌లో సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు తరలివచ్చారు. రాఖీ దుకాణాలు వివిధ రంగులు, ఆకర్షణీయమైన నమూనాలతో కళకళలాడగా, ఉదయం నుంచే మార్కెట్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తమ అన్నదమ్ముల కోసం ప్రత్యేకమైన రాఖీలను ఎంచుకుంటూ అక్కాచెల్లెళ్లు ఉత్సాహంగా కనిపించారు. పండుగ నేపథ్యంలో వ్యాపారులు సైతం ప్రత్యేకంగా రాఖీలను అందుబాటులో ఉంచడంతో మార్కెట్‌లో సందడి మరింత పెరిగింది.
    1
    బాన్సువాడలో రాఖీ పండుగ సందడి
రాఖీల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్‌
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్‌లో సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు తరలివచ్చారు.
రాఖీ దుకాణాలు వివిధ రంగులు, ఆకర్షణీయమైన నమూనాలతో కళకళలాడగా, ఉదయం నుంచే మార్కెట్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తమ అన్నదమ్ముల కోసం ప్రత్యేకమైన రాఖీలను ఎంచుకుంటూ అక్కాచెల్లెళ్లు ఉత్సాహంగా కనిపించారు. పండుగ నేపథ్యంలో వ్యాపారులు సైతం ప్రత్యేకంగా రాఖీలను అందుబాటులో ఉంచడంతో మార్కెట్‌లో సందడి మరింత పెరిగింది.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Lawyer Banswada, Kamareddy•
    12 min ago
  • మున్సిపల్ కార్మికుల సమస్యలపై కౌన్సిల్లో చర్చించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించకపోతే పనులు బందు చేసి సమ్మె చేస్తాం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ , చైర్మన్ లకు వినతిపత్రం అందజేత సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశాలలో ఎజెండాగా పెట్టి చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ బుధవారం ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కమిషనర్ ఖదీర్ పాషాకి మరియు చైర్మన్ జిందం కళా - చక్రపాణి లకు కలిసి సమస్యలను తెలియజేసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ అధికారులు , పాలకవర్గం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇవ్వవలసిన బట్టలు , చెప్పులు , సబ్బులు , నూనెలు , గ్లౌజులు ఇతరత్రా సామాగ్రిని వెంటనే అందించాలని అదేవిధంగా కొంతకాలంగా 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోక పోవడం వలన కార్మికులు తగ్గి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై విపరీతంగా పని భారం పెరిగిందని వెంటనే పాలకవర్గంలో చర్చించి అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని వీరిలో కార్మికుల కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని మరియు సిరిసిల్ల మున్సిపల్ లో కార్మికులకు సంబంధించి 2009 నుండి 2012 వరకు కార్మికుల పెండింగు పిఎఫ్ సమస్యను తొందరగా పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు జమ చేయాలని , ఇంకా కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పీఎఫ్ సమస్య , ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి కార్మికులందరికీ మున్సిపల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అన్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధిలో భాగస్వాములై పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పాలకవర్గ సభ్యుల పైన కూడా ఉంటుంది కాబట్టి రాబోయే కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి వెంటనే సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు.సమస్యలు పరిష్కరించకుంటే కనుక రానున్న రోజుల్లో అవసరమైతే కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసర్ల శంకర్ , పట్టణ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య నాయకులు నర్మెట బాబా కిషన్ , బత్తుల దేవరాజు , గడ్డం విజయ , నర్మెట ఉమ , రెడ్డిమల్ల మమత , మారుపాక లక్ష్మి , నక్క ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
    3
    మున్సిపల్ కార్మికుల సమస్యలపై కౌన్సిల్లో చర్చించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించకపోతే పనులు బందు చేసి సమ్మె చేస్తాం
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ , చైర్మన్ లకు వినతిపత్రం  అందజేత
సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశాలలో ఎజెండాగా పెట్టి చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ  సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ బుధవారం ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కమిషనర్ ఖదీర్ పాషాకి మరియు చైర్మన్ జిందం కళా - చక్రపాణి లకు కలిసి సమస్యలను తెలియజేసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ అధికారులు ,  పాలకవర్గం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇవ్వవలసిన బట్టలు , చెప్పులు , సబ్బులు , నూనెలు , గ్లౌజులు ఇతరత్రా సామాగ్రిని వెంటనే అందించాలని అదేవిధంగా కొంతకాలంగా 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోక పోవడం వలన కార్మికులు తగ్గి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై విపరీతంగా పని భారం పెరిగిందని వెంటనే పాలకవర్గంలో చర్చించి అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని వీరిలో కార్మికుల కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని మరియు సిరిసిల్ల మున్సిపల్ లో కార్మికులకు సంబంధించి 2009 నుండి 2012 వరకు కార్మికుల పెండింగు పిఎఫ్ సమస్యను తొందరగా పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు జమ చేయాలని , ఇంకా కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పీఎఫ్ సమస్య , ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి కార్మికులందరికీ మున్సిపల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అన్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధిలో భాగస్వాములై పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పాలకవర్గ సభ్యుల పైన కూడా ఉంటుంది కాబట్టి రాబోయే కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి వెంటనే సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు.సమస్యలు పరిష్కరించకుంటే కనుక రానున్న రోజుల్లో అవసరమైతే కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసర్ల శంకర్ , పట్టణ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య నాయకులు నర్మెట బాబా కిషన్ , బత్తుల దేవరాజు , గడ్డం విజయ , నర్మెట ఉమ , రెడ్డిమల్ల మమత , మారుపాక లక్ష్మి , నక్క ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.
    1
    అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు...........
బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    11 hrs ago
  • మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
    1
    మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు
ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    4
    యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.